logo

TG News: ఆహారాన్ని కల్తీ చేస్తే వదిలేది లేదు.. కఠిన చర్యలుంటాయ్‌: దామోదర రాజనర్సింహ

Eenadu icon
By Telangana Dist. Team Published : 05 Nov 2024 18:13 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ఆహారాన్ని కల్తీ చేసేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లో వదలబోమని.. కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హెచ్చరించారు. నగరంలోని వెంగళరావు నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఫుడ్ సేఫ్టీ విభాగం కమిషనర్ ఆర్‌వి కర్ణన్, ఐపీఎం డైరెక్టర్ శివలీల, జీహెచ్ఎంసీ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొంత మంది స్ట్రీట్ ఫుడ్‌ వెండర్లకు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్సులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫుడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. వ్యాపారం చేసుకునే వారికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. వసతి గృహాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టకుండా ఇబ్బంది పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పెరిగిన హోటళ్ల సంఖ్య, జనాభాకు అనుగుణంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల సంఖ్యను పెంచనున్నట్టు మంత్రి ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని