logo

Ponguleti: మూడేళ్ల కాలంలో జూబ్లీహిల్స్‌ సమస్యలు పరిష్కరిస్తాం: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Telangana Dist. Team Published : 01 Nov 2025 15:47 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీక అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేస్తామని తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రెహమత్‌ నగర్‌లో పర్యటించిన మంత్రి.. రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్‌లో భారాస ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించలేక పోయిందని ఆరోపించారు. తమ అభ్యర్థి నవీన్‌కుమార్‌ను గెలిపిస్తే.. మూడేళ్ల కాలంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. భాజపా, భారత రాష్ట్ర సమితిలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు