logo

Mlc Kavitha: కుట్రలకు పాల్పడే వారిని బయటపెట్టాలని కోరితే.. నాపైనే కక్షకట్టారు: ఎమ్మెల్సీ కవిత

Eenadu icon
By Telangana Dist. Team Published : 21 Aug 2025 11:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: సింగరేణి బొగ్గు గని కార్మికులకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) బహిరంగ లేఖ రాశారు. టీవీజీకేఎస్‌ గౌరవ అధ్యక్షుడిగా ఎన్నికైన కొప్పుల ఈశ్వర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో ఎన్నిక నిర్వహించారన్నారు. 

‘‘ రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగింది. సింగరేణి కార్మికుల కోసం పోరాడుతుంటే నాపై కుట్ర పన్నుతున్నారు. భారత రాష్ట్ర సమితిలో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. నా తండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్లినప్పుడు లీక్‌ చేశారు. నాపై కుట్రలకు పాల్పడుతున్న వారిని బయటపెట్టాలని కోరితే.. నాపైనే కక్షకట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులకు గురి చేస్తున్నారు. నేను అమెరికాలో ఉన్న సమయంలోనే గౌరవ అధ్యక్ష ఎన్నిక జరిగింది. చట్టవిరుద్ధంగా టీవీజీకేఎస్‌ సమావేశం నిర్వహించి ఎన్నుకున్నారు’’ అని కవిత తెలిపారు. (Telangana News)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు