logo

గుండెపోటుతో టంగుటూరి గోపాలకృష్ణ మృతి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ గుండెపోటుతో సోమవారం మరణించారు.

Published : 28 May 2024 02:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ గుండెపోటుతో సోమవారం మరణించారు. ఈయన టంగుటూరి ప్రకాశం పంతులు రెండో కుమారుడైన హనుమంతరావు నాలుగో కుమారుడు. ఒంగోలులో కమర్షియల్‌ టాక్స్‌ విభాగంలో పనిచేసిన ఈయన రెండేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. పదవీ విరమణ అనంతరం ప్రకాశం పంతులుకు సంబంధించిన అనేక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు