ఏక రూపం.. చకచకా సిద్ధం
విద్యా సంవత్సరం సమీపంలోకి వచ్చేస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి రెండు జతల ఏకరూప దుస్తులు సిద్ధం కావాల్సి ఉంది.
ధరిస్తే విద్యార్థులు ఇలా..
న్యూస్టుడే, పాత తాండూరు, బషీరాబాద్: విద్యా సంవత్సరం సమీపంలోకి వచ్చేస్తోంది. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి రెండు జతల ఏకరూప దుస్తులు సిద్ధం కావాల్సి ఉంది. దీంతో విద్యార్థి పాఠశాలకు మొదటి రోజే కొత్త దుస్తులు, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలతో వచ్చేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జూన్ 10వ తేదీ లోపే కచ్చితంగా కుట్టిన ఏకరూప దుస్తులను ఉపాధ్యాయులకు మహిళా సంఘాల సభ్యులు అప్పగించనున్నారు. ఈ విషయమై జిల్లా పాలనాధికారి, డీఈఓ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు.
1.15 లక్షల మందికి అందించాలనేది లక్ష్యం
జిల్లాలోని 20 మండలాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు మొత్తం 1,325 ఉన్నాయి. వీటిలో 1,22,728 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ బడులతో పాటు కస్తూర్బా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలకు ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు జతల ఏకరూప దుస్తులను అందజేస్తోంది.
- 2022-23 సంవత్సరానికి గాను 53,058 మంది బాలురు, 54,730 మంది బాలికలకు ఏకరూప దుస్తులను అందించనున్నారు. ఈసారి సుమారు 1.15లక్షల మంది విద్యార్థులకు ఏకరూప దుస్తులను అందించాలని ప్రణాళిక సిద్ధం చేసింది.
ప్రైవేటుకు దీటుగా.. ఆకర్షణీయంగా..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఏకరూప దుస్తుల డిజైన్ను గతేడాది నుంచి అమలు చేస్తున్నారు. గతంలో కుట్టు విషయంతో కొంత ఇబ్బందులొచ్చినా.. ఈసారి దర్జీలకు అవగాహన కల్పించి మహిళా సంఘాల సభ్యుల చేత ఏ విధంగా కుట్టాలనే పూర్తి వివరాలను తెలియజేయడంతో చక్కని ఆకర్షణతో కుట్టు కొనసాగుతోంది.
ః 1-3తరగతులకు, 4-5వరకు, 6-12 తరగతులకు బాలికలకు విడి రకాలుగా, 1-12 తరగతుల వరకు బాలురకు కొలతల ఆధారంగా, వయసుల వారీగా కుట్టాల్సి ఉంటుంది. అమ్మాయిలకు, చిన్నారులకు షర్టు, గౌను, పట్టీలు పెట్టి చక్కగా కుట్టడం, పెద్ద వారికి కాలర్ పట్టీలు, కోట్, చొక్కా, జేబులు, భుజాలపై క్లాప్స్, చేతి భాగంలో క్లిప్పులు కుట్టాలి. బాలురకు రెండు జేబులు, కాలర్ పట్టీలు, చూసేందుకు చక్కగా కనిపించేలా కొలత సరిగ్గా చూసి కుట్టాల్సి ఉంటుంది.
రూ.50 ఏం సరిపోతుంది
ఖర్చు, పని భారం పెరుగుతోందని ఒక జతకు రూ.50 చొప్పున రెండు జతలకు రూ.100 ఇస్తే ఏం సరిపోతాయని మహిళా సంఘ సభ్యులు పేర్కొంటున్నారు. కనీసం రూ.200 చెల్లించాలని కోరుతున్నారు. కాగా, పాఠశాల ప్రారంభం నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పుస్తకాలు పంపిణీ చేయిస్తామని, చదువులో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈసారి చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
పది రోజుల్లో ఇస్తాం..
ఏకరూప దుస్తులు పది రోజుల్లోగా ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తాం. ఒకేసారి ఎక్కువ వస్త్రాన్ని కత్తిరించేందుకు యంత్రం ఉపయుక్తంగా ఉంది. దీంతో కటింగ్, కుట్టు విషయంలో సమయం వృథా కాకుండా త్వరగా పనులు జరుగుతున్నాయి. కుట్టు ఊడిపోకుండా నాణ్యమైన దారం వాడుతున్నాం. మాకిచ్చే కూలీ పెంచితే బాగుంటుంది.
విమల, మహిళా సంఘం సభ్యురాలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి