GHMC: బల్దియా ఎన్నికలు.. ఏడాది ఆలస్యం?
ఈనాడు, హైదరాబాద్

నిర్ణీత సమయం కన్నా బల్దియా పాలకవర్గ ఎన్నికలు ఒక ఏడాది ఆలస్యం కానున్నాయా.. ప్రభుత్వం తీరును చూస్తే అధికార వర్గాలు అవుననే అంటున్నాయి. మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలను గ్రేటర్లో విలీనం చేయడం, బల్దియాను మళ్లీ విడదీయడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతోనే జాప్యం జరగనుందని అంటున్నారు. మరో వైపు గ్రేటర్ హైదరాబాద్ను ఓఆర్ఆర్ వరకు విస్తరింపజేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా శివారులోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనంచేస్తూ గెజిట్ విడుదలచేసింది. వచ్చే జనవరిలో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు జీహెచ్ఎంసీలో కలిసిపోతాయి. మరో ఏడాదికి జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు పూర్తవుతుంది. అనంతరం జనాభా లెక్కలు, డివిజన్ల పునర్విభజన, నగరాన్ని ఎన్ని కార్పొరేషన్లుగా విభజించాలనే అంశాలపై సర్కారు నిర్ణయం తీసుకుంటుంది. అదంతా జరిగేందుకు ఏడాది పడుతుంది. అనంతరం కొత్త మహా నగరపాలక సంస్థలు ఏర్పడుతాయి. అంటే.. ప్రస్తుత గ్రేటర్ పాలకమండలి గడువు పూర్తయ్యాక.. మళ్లీ జీహెచ్ఎంసీ పేరుతో ఎన్నికలు జరగవు. ఏడాదయ్యాక కొత్త నగరపాలక సంస్థలకే ప్రభుత్వం ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తుంది. నయా పాలకమండళ్లు 2027లో కొలువుదీరుతాయి.
సవాళ్ల సవారీ మొదలు
శివారు పురాలు గ్రేటర్లో కలిశాక పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధి 625 చదరపు కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. విలీనం తర్వాత విస్తీర్ణం 2,500 చ.కి.మీ వరకు పెరగనుంది. దానికి తగ్గట్టుగా సర్కిళ్లు, జోన్ల పరిధిని నిర్ణయించాలి.
ఇదే సమయంలో డివిజన్లు, అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన మొదలుకావచ్చనే ఊహాగానాలున్నాయి. 2026లో జనాభా లెక్కల నివేదిక వస్తుందన్న అంచనాలు నిజమైతే పునర్విభజన ప్రక్రియ చకచకా జరుగుతుంది.
రాష్ట్రమంతా అప్పుడే..
వచ్చే జనవరితో మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పాలకమండలి గడువు పూర్తవనుంది.ఆ సమయంలో నగర శివారులోని 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులను నియమించి, వారి ద్వారా ఆయా స్థానిక సంస్థలను గ్రేటర్లో విలీనం చేయాలని సర్కారు నిర్ణయించింది. తరువాతే ఆయా సంస్థల ఎన్నికలపై సర్కారు నిర్ణయం తీసుకుంటుందని సమాచారం.
రెండా.. నాలుగా!
మహా విలీనం తర్వాత జీహెచ్ఎంసీని ఎన్ని భాగాలు చేయాలన్న అంశంపై సర్కారు ఆలోచన చేస్తూనేఉంది. దిల్లీ మాదిరి తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నగరపాలక సంస్థలను ఏర్పాటుచేయాలా.. హైదరాబాద్, సికింద్రాబాద్ పేర్లతో ఏర్పాటు చేయాలా అని సీఎం రేవంత్రెడ్డి నిర్ణయించాల్సి ఉంది. ఓఆర్ఆర్ హద్దుగా గ్రేటర్ను విస్తరించినట్టే.. మూసీనది హద్దుగా నగరాన్ని విభజిస్తే.. చెరగని సరిహద్దులతో పరిపాలన జరపవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
[ 04-11-2025]
ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్కు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. - 
                            
                                
                                ఉన్నత విద్యామండలి కార్యాలయ ముట్టడికి యత్నం
[ 04-11-2025]
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. - 
                            
                                
                                తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
[ 04-11-2025]
అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. - 
                            
                                
                                ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ ఇచ్చిన స్పీకర్
[ 04-11-2025]
భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. - 
                            
                                
                                హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ముషీరాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జాన్పాల్ అనే వైద్యుడు దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. - 
                            
                                
                                గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. 11 మందిని అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. - 
                            
                                
                                మీ చరవాణిలో ‘జీపే’ ఉందా..?
[ 04-11-2025]
‘మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు.. ఎంతమందికి ఓట్లు ఉన్నాయి.. ఇంటి పెద్ద ఫోన్నెంబరు ఇవ్వండి..’ - 
                            
                                
                                యమ‘కంకరు’డిలా
[ 04-11-2025]
కాలేజీకి వెళ్లే విద్యార్థులు.. విధులకు హాజరయ్యే ఉద్యోగులు.. బంధువుల ఇంటికి వచ్చి తిరిగివెళ్తున్న మహిళలు.. బిడ్డా.. వెళ్లగానే ఫోన్ చేయ్ అంటూ తల్లిదండ్రులు.. - 
                            
                                
                                క్యూఆర్ కోడ్ స్కాన్తో తితిదే సమాచారం
[ 04-11-2025]
భక్తులు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సమాచారం తెలుసుకునేలా హిమాయత్నగర్ (లిబర్టీ)లోని తితిదే దేవాలయం వద్ద ‘క్యూఆర్ కోడ్’లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. - 
                            
                                
                                ఘటన దురదృష్టకరం.. బాధితులను ఆదుకుంటాం
[ 04-11-2025]
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలువురు ప్రముఖులు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. - 
                            
                                
                                అధికలోడు.. అతివేగం.. అదుపేది?
[ 04-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగం.. పరిమితికి మించి కంకర రవాణా చేస్తుండటమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. - 
                            
                                
                                ప్రమాదాల కట్టడి సాంకేతికతపై అలసత్వం
[ 04-11-2025]
ప్రమాదాలను గుర్తించి అప్రమత్తం చేసే ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్’ (ఏడీఏఎస్) ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. ఆ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. - 
                            
                                
                                అనుమతులు లేకుండానే.. అడ్డగోలుగా కనెక్షన్లు
[ 04-11-2025]
నగరంలో విద్యుత్తు కనెక్షన్ కావాలంటే జీహెచ్ఎంసీ, శివార్లలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఇంటి నిర్మాణ అనుమతి పత్రం ఉండాలి. - 
                            
                                
                                గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
[ 04-11-2025]
షాద్నగర్ పట్టణ శివారులోని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.శైలజపై వేటు పడింది. - 
                            
                                
                                ఫ్యాబ్సిటీలో ఐటీ సంస్థలు.. పరిశ్రమలు
[ 04-11-2025]
బాహ్యవలయ రహదారికి సమీపంలోని తుక్కుగూడ ఫ్యాబ్సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. - 
                            
                                
                                పార్కు సిద్ధం.. ప్రవేశం నిషిద్ధం!
[ 04-11-2025]
మహానగరంలో హిమాయత్సాగర్ చెంత హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఏకోపార్కు ప్రారంభానికి ఎదురు చూస్తోంది. - 
                            
                                
                                వ్యాపార విస్తరణకు చేయూత
[ 04-11-2025]
వీధి విక్రయదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అధిక వడ్డీల భారం నుంచి వీరిని గట్టెక్కించి స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడం దీని ఉద్దేశం. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 - 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 


