GHMC: ఇంటి కొలతలు తప్పాయా.. నోటీసులే!
జీఐఎస్ సర్వేతో నిర్మాణాలను జల్లెడ పడుతున్న జీహెచ్ఎంసీ

ఈనాడు, హైదరాబాద్: నగరంలో ఆస్తిపన్ను కట్టని నిర్మాణాలు, తక్కువ కడుతున్న భవనాలు జీఐఎస్(భౌగోళిక సమాచార వ్యవస్థ) సర్వేలో లెక్క తేలుతున్నాయి. ఇప్పటి వరకు 20 శాతం మేరకు సర్వే పూర్తవగా అందులో 80 వేల నిర్మాణాల కొలతలు, వాటి ఆస్తిపన్నులో తేడాలు ఉన్నట్లు సర్వేయర్లు గుర్తించారు. అందులో పన్ను కట్టని నిర్మాణాలే 20 వేల వరకు ఉన్నాయి. బల్దియా ఐటీ విభాగం ఆయా నిర్మాణాల జాబితాను ఇటీవల కమిషనర్ ఇలంబర్తి ముందుంచగా..అన్నింటికీ చట్టప్రకారం నోటీసులు ఇవ్వాలని, యజమానుల నుంచి వివరణ తీసుకుని తదుపరి చర్యలు తీసుకోవాలని ఆయన యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ మేరకు జోనల్ కమిషనర్లు చర్యలు ప్రారంభించారు. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 కింద నోటీసులు జారీకి శ్రీకారం చుట్టారు.
అయిదు లక్షలకు పైగా భవనాలకు..
జీఐఎస్ సర్వే ఏడాది కిందట మొదలైంది. డ్రోన్తో నగరం మొత్తాన్ని చిత్రీకరించారు. నగర భౌగోళిక పటాన్ని రూపొందించారు. ఇప్పుడు ఇంటింటి సర్వే జరుగుతోంది. పూర్తయిన 20 శాతం ఇంటింటి సర్వేలో 80 వేల భవనాలు లెక్క తేలాయి. నగరం మొత్తాన్ని సర్వే చేస్తే.. అయిదు లక్షలకుపైగా భవనాలకు నోటీసులు ఇచ్చే పరిస్థితి ఉత్పన్నమవుతుందని అంచనా.
నోటీసులిస్తూనే..: సర్వేయర్లు గుర్తిస్తున్న సమాచారంలో కూడా లోపాలు ఉండొచ్చనే ఉద్దేశంతో గుర్తించిన ప్రతి ఇంటి యజమానికి నోటీసు ఇవ్వాలని, ఆ వివరాలను సంబంధిత సహాయ మున్సిపల్ కమిషనర్(ఏఎంసీ) ఆన్లైన్లోనూ నమోదు చేయాలని కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. నోటీసుకు 15 రోజుల్లోపు యజమాని వివరణ ఇవ్వాలి. యజమాని ఇచ్చే వివరణ ఆధారంగా సంబంధిత బిల్ కలెక్టర్ లేదా ట్యాక్స్ ఇన్స్పెక్టర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి ఉప కమిషనర్కు నివేదిక ఇస్తారు. స్పందించకపోతే విచారణ లేకుండానే పన్ను మదింపు జరిగిపోతుంది. నోటీసులపై పౌరులు అభ్యంతరం వ్యక్తం చేస్తే వారి కోసం ఏదైనా ఒక రోజును కేటాయించి, సంబంధిత ఉప కమిషనర్ యజమాని అభ్యంతరాలపై విచారణ జరపాలని సూచించారు. నోటీసు జారీ, దాని వివరాలను యజమాని ఫోన్ నంబరుకు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                రోడ్డును బాగు చేయండి.. ప్రజల నిరసన
[ 04-11-2025]
వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్లే రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక ప్రజలు తాండూరు డెవలప్మెంట్ పేరిట ధర్నాకు దిగారు. - 
                            
                                
                                డివైడర్ను ఢీ కొన్నకారు.. దంపతులకు గాయాలు
[ 04-11-2025]
కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో వృద్ధ దంపతులకు స్వల్ప గాయాలయ్యాయి. - 
                            
                                
                                డ్రగ్స్ విక్రయిస్తున్న వైద్యుడు అరెస్టు
[ 04-11-2025]
ప్రాణాలు పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతక డ్రగ్స్ బారిన పడ్డాడు. డ్రగ్స్ కొనేందుకు డబ్బు లేకపోవడంతో స్నేహితులతో కలిసి డ్రగ్స్ అమ్మకాలకు పూనుకున్నాడు. - 
                            
                                
                                ఉన్నత విద్యామండలి కార్యాలయ ముట్టడికి యత్నం
[ 04-11-2025]
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. - 
                            
                                
                                ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ ఇచ్చిన స్పీకర్
[ 04-11-2025]
భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. - 
                            
                                
                                హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ముషీరాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జాన్పాల్ అనే వైద్యుడు దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. - 
                            
                                
                                గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. 11 మందిని అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. - 
                            
                                
                                మీ చరవాణిలో ‘జీపే’ ఉందా..?
[ 04-11-2025]
‘మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు.. ఎంతమందికి ఓట్లు ఉన్నాయి.. ఇంటి పెద్ద ఫోన్నెంబరు ఇవ్వండి..’ - 
                            
                                
                                యమ‘కంకరు’డిలా
[ 04-11-2025]
కాలేజీకి వెళ్లే విద్యార్థులు.. విధులకు హాజరయ్యే ఉద్యోగులు.. బంధువుల ఇంటికి వచ్చి తిరిగివెళ్తున్న మహిళలు.. బిడ్డా.. వెళ్లగానే ఫోన్ చేయ్ అంటూ తల్లిదండ్రులు.. - 
                            
                                
                                క్యూఆర్ కోడ్ స్కాన్తో తితిదే సమాచారం
[ 04-11-2025]
భక్తులు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సమాచారం తెలుసుకునేలా హిమాయత్నగర్ (లిబర్టీ)లోని తితిదే దేవాలయం వద్ద ‘క్యూఆర్ కోడ్’లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. - 
                            
                                
                                ఘటన దురదృష్టకరం.. బాధితులను ఆదుకుంటాం
[ 04-11-2025]
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలువురు ప్రముఖులు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. - 
                            
                                
                                అధికలోడు.. అతివేగం.. అదుపేది?
[ 04-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగం.. పరిమితికి మించి కంకర రవాణా చేస్తుండటమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. - 
                            
                                
                                ప్రమాదాల కట్టడి సాంకేతికతపై అలసత్వం
[ 04-11-2025]
ప్రమాదాలను గుర్తించి అప్రమత్తం చేసే ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్’ (ఏడీఏఎస్) ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. ఆ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. - 
                            
                                
                                అనుమతులు లేకుండానే.. అడ్డగోలుగా కనెక్షన్లు
[ 04-11-2025]
నగరంలో విద్యుత్తు కనెక్షన్ కావాలంటే జీహెచ్ఎంసీ, శివార్లలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఇంటి నిర్మాణ అనుమతి పత్రం ఉండాలి. - 
                            
                                
                                గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
[ 04-11-2025]
షాద్నగర్ పట్టణ శివారులోని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.శైలజపై వేటు పడింది. - 
                            
                                
                                ఫ్యాబ్సిటీలో ఐటీ సంస్థలు.. పరిశ్రమలు
[ 04-11-2025]
బాహ్యవలయ రహదారికి సమీపంలోని తుక్కుగూడ ఫ్యాబ్సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. - 
                            
                                
                                పార్కు సిద్ధం.. ప్రవేశం నిషిద్ధం!
[ 04-11-2025]
మహానగరంలో హిమాయత్సాగర్ చెంత హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఏకోపార్కు ప్రారంభానికి ఎదురు చూస్తోంది. - 
                            
                                
                                వ్యాపార విస్తరణకు చేయూత
[ 04-11-2025]
వీధి విక్రయదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అధిక వడ్డీల భారం నుంచి వీరిని గట్టెక్కించి స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడం దీని ఉద్దేశం. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

పెట్టుబడుల విషయంలో పూర్తిగా సహకరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
 - 
                        
                            

అదరగొట్టిన ఎస్బీఐ.. లాభం రూ.20,160 కోట్లు
 - 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 


