GHMC: రూ.వెయ్యి కొడితేనే.. ఓటీపీ
జనన, మరణ ధ్రువీకరణ పత్రాలకు ఓటీపీతో లింకు
దరఖాస్తులు లెక్కగట్టి వసూలు చేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు

ఈనాడు,హైదరాబాద్: లంచం ఇస్తేగానీ.. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు ఆమోదం పొందట్లేదు. కొందరు అధికారులు దరఖాస్తుకు రూ.వెయ్యి, రెండు వేలు వసూలు చేస్తున్నారు. వారికి కంప్యూటర్ ఆపరేటర్లు మధ్యవర్తిత్వం చేస్తున్నారు. కేంద్ర కార్యాలయం పర్యవేక్షణ లేకపోవడంతో.. సర్కిళ్ల స్థాయి అధికారులు, కంప్యూటర్ ఆపరేటర్లు రెచ్చిపోతున్నారు.
డబ్బులిస్తేనే ఆమోదం..: జనన, మరణ ధ్రువీకరణపత్రాల దరఖాస్తులను ఆమోదించే అధికారం సహాయ వైద్యాధికారులు, సహాయ మున్సిపల్ కమిషనర్లకు ఉంది. తప్పుడు పత్రాల జారీకి అధికారులను బాధ్యులను చేయాలనే ఉద్దేశంతో.. అధికారి నంబరుకు వచ్చే ఓటీపీతో దరఖాస్తు ఆమోదాన్ని ముడిపెట్టారు. ఆ నిబంధనను కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్కో ఓటీపీకి రూ.1,000 నుంచి రూ.2,000 ఇవ్వాలని.. అప్పుడే ఓటీపీ చెబుతామని కంప్యూటర్ ఆపరేటర్లకు షరతు పెట్టారు.
ఇవిగో ఉదాహరణలు..
- జులై 27న పిల్లాడికి పేరు పెట్టేందుకు దరఖాస్తు నంబరు బీసీఎన్సీ07250 25319తో ఓ వ్యక్తి మీసేవా కేంద్రం ద్వారా చేసుకున్న దరఖాస్తును అధికారులు ఇప్పటికీ ఆమోదించలేదు.
 - ఆగస్టు 20న తన కుమారుడికి పేరు పెట్టడం కోసం బేగంపేట్కు చెందిన వ్యక్తి దరఖాస్తు నెంబరు సీఎన్ఐ022502429108తో చేసుకున్న దరఖాస్తును అధికారి ఆమోదించలేదు. ఆన్లైన్లో పుట్టిన తేదీని పరిశీలించుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ.. సరైన పత్రాలతో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని అధికారి దరఖాస్తును అటకెక్కించడం గమనార్హం.
 
కావాలనే తప్పుగా నమోదు చేసి..
నగరంలోని 30 సర్కిళ్లలో కలిపి 5వేల అర్జీలు పెండింగులో ఉన్నాయి. అందులో రెండు నెలలకుపైగా ఆమోదం పొందనివి 3వేలు ఉండటం గమనార్హం. బాధితుల్లో మెజార్టీ అమాయకులు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పు చేయించుకున్న పేదలకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. ఉద్దేశపూర్వకంగా ఆయా ఆస్పత్రుల్లోని సిబ్బంది తల్లిదండ్రుల పేర్లను తప్పుగా నమోదు చేస్తున్నారు. మీసేవా కేంద్రాల నిర్వాహకులూ అలాగే జనన ధ్రువీకరణపత్రాలు ఇస్తున్నారు. పిల్లలకు ఆధార్ కార్డు తీసుకునేటప్పుడు, పాఠశాలల్లో ప్రవేశాలప్పుడో సమస్య గురించి తెలుస్తోంది. హడావుడిగా మీసేవా కేంద్రాలకు వెళ్లి, అఫిడవిట్, ఇతరత్రా పత్రాలు సమర్పించి.. అధికారులకు లంచాలిచ్చి సర్టిఫికెట్లలోని తప్పులు దిద్దుకుంటున్నారు. పేర్ల సవరణకు వచ్చే అర్జీల్లో 99శాతం ప్రభుత్వ దవాఖానాల్లో పుట్టిన పిల్లల సర్టిఫికెట్లు ఉండటమే అందుకు నిదర్శనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
[ 04-11-2025]
ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్కు తెలంగాణ ప్రభుత్వం శాఖలు కేటాయించింది. - 
                            
                                
                                ఉన్నత విద్యామండలి కార్యాలయ ముట్టడికి యత్నం
[ 04-11-2025]
ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. - 
                            
                                
                                తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన
[ 04-11-2025]
అరేబియా సముద్రం నుంచి తెలంగాణ వైపు తేమ గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. - 
                            
                                
                                ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ ఇచ్చిన స్పీకర్
[ 04-11-2025]
భారత రాష్ట్ర సమితి దాఖలు చేసిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ షెడ్యూల్ ఇచ్చారు. - 
                            
                                
                                హైదరాబాద్లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
నగరంలోని ఓ వైద్యుడి ఇంట్లో పోలీసులు డ్రగ్స్ పట్టుకున్నారు. ముషీరాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న జాన్పాల్ అనే వైద్యుడు దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. - 
                            
                                
                                గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
[ 04-11-2025]
గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ను అధికారులు పట్టుకున్నారు. 11 మందిని అరెస్టు చేశారు. కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. - 
                            
                                
                                మీ చరవాణిలో ‘జీపే’ ఉందా..?
[ 04-11-2025]
‘మీ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు.. ఎంతమందికి ఓట్లు ఉన్నాయి.. ఇంటి పెద్ద ఫోన్నెంబరు ఇవ్వండి..’ - 
                            
                                
                                యమ‘కంకరు’డిలా
[ 04-11-2025]
కాలేజీకి వెళ్లే విద్యార్థులు.. విధులకు హాజరయ్యే ఉద్యోగులు.. బంధువుల ఇంటికి వచ్చి తిరిగివెళ్తున్న మహిళలు.. బిడ్డా.. వెళ్లగానే ఫోన్ చేయ్ అంటూ తల్లిదండ్రులు.. - 
                            
                                
                                క్యూఆర్ కోడ్ స్కాన్తో తితిదే సమాచారం
[ 04-11-2025]
భక్తులు ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) సమాచారం తెలుసుకునేలా హిమాయత్నగర్ (లిబర్టీ)లోని తితిదే దేవాలయం వద్ద ‘క్యూఆర్ కోడ్’లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. - 
                            
                                
                                ఘటన దురదృష్టకరం.. బాధితులను ఆదుకుంటాం
[ 04-11-2025]
హైదరాబాద్- బీజాపూర్ రహదారిపై చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం నేపథ్యంలో పలువురు ప్రముఖులు చేవెళ్ల ఆసుపత్రికి వచ్చి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. - 
                            
                                
                                అధికలోడు.. అతివేగం.. అదుపేది?
[ 04-11-2025]
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదానికి టిప్పర్ డ్రైవర్ అతివేగం.. పరిమితికి మించి కంకర రవాణా చేస్తుండటమే కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. - 
                            
                                
                                ప్రమాదాల కట్టడి సాంకేతికతపై అలసత్వం
[ 04-11-2025]
ప్రమాదాలను గుర్తించి అప్రమత్తం చేసే ‘అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్’ (ఏడీఏఎస్) ప్రవేశపెట్టిన ఆర్టీసీ.. ఆ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. - 
                            
                                
                                అనుమతులు లేకుండానే.. అడ్డగోలుగా కనెక్షన్లు
[ 04-11-2025]
నగరంలో విద్యుత్తు కనెక్షన్ కావాలంటే జీహెచ్ఎంసీ, శివార్లలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఇంటి నిర్మాణ అనుమతి పత్రం ఉండాలి. - 
                            
                                
                                గురుకుల కళాశాల ప్రిన్సిపల్ సస్పెన్షన్
[ 04-11-2025]
షాద్నగర్ పట్టణ శివారులోని నాగర్కర్నూల్ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.శైలజపై వేటు పడింది. - 
                            
                                
                                ఫ్యాబ్సిటీలో ఐటీ సంస్థలు.. పరిశ్రమలు
[ 04-11-2025]
బాహ్యవలయ రహదారికి సమీపంలోని తుక్కుగూడ ఫ్యాబ్సిటీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్ల పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. - 
                            
                                
                                పార్కు సిద్ధం.. ప్రవేశం నిషిద్ధం!
[ 04-11-2025]
మహానగరంలో హిమాయత్సాగర్ చెంత హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఏకోపార్కు ప్రారంభానికి ఎదురు చూస్తోంది. - 
                            
                                
                                వ్యాపార విస్తరణకు చేయూత
[ 04-11-2025]
వీధి విక్రయదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ నిధి యోజన పథకాన్ని అమలు చేస్తోంది. అధిక వడ్డీల భారం నుంచి వీరిని గట్టెక్కించి స్వశక్తితో నిలదొక్కుకునేలా చేయడం దీని ఉద్దేశం. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
 - 
                        
                            

ఖర్గేజీ.. రాహుల్ పెళ్లి ఎప్పుడో చెప్పండి: భాజపా సెటైర్లు
 - 
                        
                            

మంత్రి అజారుద్దీన్కు శాఖల కేటాయింపు
 - 
                        
                            

నాకు ఏం జరిగిందో గుర్తులేదా..? థరూర్ను హెచ్చరించిన భాజపా నేత
 - 
                        
                            

లాలూ తాతలు దిగొచ్చినా.. ఆ సొమ్ము దోచుకోలేరు: అమిత్ షా
 - 
                        
                            

చాట్జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
 


