logo

GHMC: రూ.8,440 కోట్లతో జీహెచ్‌ఎంసీ వార్షిక బడ్జెట్‌!

Eenadu icon
By Telangana Dist. Team Published : 23 Dec 2024 19:19 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక బడ్జెట్‌కు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,440 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి తెలిపారు. మేయర్ అధ్యక్షతన కమిషనర్ ఇలంబర్తి సమక్షంలో సమావేశమైన స్టాండింగ్ కమిటీ.. బడ్జెట్ అంచనాలపై విస్తృతంగా చర్చించింది. పలు విభాగాలకు సంబంధించి సభ్యులు అడిగిన సందేహాలను ఆయా విభాగాల అధికారులు నివృత్తి చేశారు. దీంతో స్టాండింగ్ కమిటీ....రూ.8,440 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.

రెవెన్యూ రాబడులు రూ.4,445 కోట్లు, రెవెన్యూ వ్యయం రూ.4 వేల కోట్లగా అంచనా వేశారు. రూ.445 కోట్ల రెవెన్యూ మిగులు చూపారు. హెచ్‌-సీటీ కింద రాష్ట్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీకి రూ.2,654 కోట్లు గ్రాంట్‌ రూపంలో కేటాయించినట్లు విజయలక్ష్మి పేర్కొన్నారు. 2024-25లో రెవెన్యూ రాబడులను రూ.5,938 కోట్ల నుంచి రూ. 4,052 కోట్లకు సవరించినట్లు తెలిపారు. ఆమోదిత బడ్జెట్ నుంచి ఘన వ్యర్థాల నిర్వహణకు రూ.687 కోట్లు, వీధి దీపాల కోసం రూ.186 కోట్లు, భూసేకరణ కోసం రూ.283 కోట్లు, ఎస్ఎన్‌డీపీ కింద రూ.408 కోట్లు, హెచ్‌-సీటీ కోసం రూ.1,690 కోట్లు, గ్రీన్ బడ్జెట్‌కు రూ.344 కోట్లు కేటాయించబోతున్నట్లు మేయర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని