బస్తీ ఓటర్లపైనే అభ్యర్థుల ఆశలు
గ్రేటర్లోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్తీ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి.
నాలుగు నియోజకవర్గాల్లో వారే కీలకం
ఈనాడు, హైదరాబాద్: గ్రేటర్లోని నాలుగు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్తీ ఓటర్లపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు కంటే ఎక్కువ శాతం ఓటర్లు బస్తీల్లో ఉన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 3-4 వేల వరకు బస్తీలు ఉండగా.. వాటిల్లో తక్కువ ఆదాయ వర్గాలవారు నివశిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వలసలు వచ్చినవారు ఇక్కడే ఉంటున్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో గ్రేటర్ వ్యాప్తంగా బస్తీ ఓటర్లు కీలకంగా మారడటంతో అన్ని ప్రధాన రాజికీయ పార్టీలు ఆ దిశగా దృష్టి సారించాయి. సనత్నగర్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, పటాన్చెరు, రాజేంద్రనగర్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, ముషీరాబాద్ తదితర అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోకి వచ్చే బస్తీలు, కాలనీల్లో స్థానిక నేతలపై దృష్టి పెట్టాయి. ప్రచార కార్యక్రమాల్లో బస్తీల నుంచే ఎక్కువ శాతం జనసమీకరణ చేసే బాధ్యతలను చోటామోటా నేతలకు అప్పగిస్తున్నాయి. బస్తీల్లో పట్టు నిరూపించుకోవడానికి ప్రధాన పార్టీల నేతలు రకరకాల వ్యుహ, ప్రతివ్యహాలు పన్నుతున్నాయి.
ఎక్కువ ఓట్లు పడేలా ప్రణాళిక.. సాధారణంగా కాలనీలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలతో పోల్చితే బస్తీల నుంచే ఎక్కువ శాతం మంది ఓటు వేసేందుకు కదులుతుంటారు. ప్రతి ఓటరూ పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటు వేసేలా స్థానిక నేతలు బాధ్యత తీసుకోవడం వల్ల సహజంగా ఇక్కడ నుంచి ఎక్కువ శాతం పోలింగ్ జరుగుతుంటుంది. అపార్ట్మెంట్లు, కాలనీల్లో ఈ పరిస్థితి ఉండదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ బస్తీ ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు వివిధ రకాల తాయిలాలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని చోట్ల కుక్కర్లు, గడియారాలు, గొడుగులు, చీరలు లాంటివి ఇంటింటికీ పంపిణీ చేసి.. ఓటర్లు తమ వైపే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పోలింగ్కు రెండు మూడు రోజుల ముందే ఈ పంపకాలు జరిగేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యువ ఓటర్లు కూడా భారీ సంఖ్యలో ఉండటంతో వారిని ఆకట్టుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ బాధ్యతలను బస్తీల్లో చోటా మోటా నాయకులకు అప్పగిస్తున్నారు. బస్తీలు, కాలనీల్లో ప్రచారంలో పాల్గొంటే రూ.500 ఇచ్చి, భోజనం పెడుతున్నారు. చాలామందికి ఇదో ఉపాధి మార్గంగా మారిందని అంటున్నారు. బస్తీలో ఉన్న కుల, ఇతర సంక్షేమ సంఘాలను ప్రధాన పార్టీలు లక్ష్యం చేసుకొని.. ఓట్లు రాబట్టుకునేలా ప్రయత్నం చేస్తున్నాయి. తమను గెలిపిస్తే బస్తీల్లో ఉన్న సమస్యలపై కూడా దృష్టి పెట్టి పరిష్కరిస్తామని అభ్యర్థులు హామీ ఇస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశాబ్ది స్ఫూర్తిగా.. శతాబ్దికి బాసటగా
[ 02-06-2024]
అరవై ఏళ్ల ప్రజల సుదీర్ఘ పోరాటం ఫలితంగా పదేళ్ల క్రితం తెలంగాణ స్వరాష్ట్రం కల సాకారమైంది. ఉద్యమాలకు ఊపిరిలూదిన హైదరాబాద్ గడ్డ ఆ రోజు ఎంతో పులకించింది. -
ఉద్యమానికి ఊపిరిలూదారు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన క్రతువులో మొయినాబాద్ కీలకపాత్ర పోషించింది. ఈ ప్రాంతానికి చెందిన ముగ్గురు ఉద్యమానికి ఊపిరిలూది.. -
ప్రగతి కాంక్ష.. సాగాలి నిరంతర దీక్ష
[ 02-06-2024]
తెలంగాణ డయగ్నొస్టిక్ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు జిల్లాలో 1,05,103 మందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. వికారాబాద్ వైద్య కళాశాలకు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) అనుమతి మంజూరు చేసింది. -
ఫలితాల వెల్లడికి సర్వం సన్నద్ధం
[ 02-06-2024]
రాజధాని పరిధిలోని నాలుగు ఎంపీ స్థానాలు, ఓ అసెంబ్లీ నియోజకవర్గం ఓట్ల లెక్కింపునకు సమయం ఆసన్నమైంది. సుమారు ఆరు వేల మంది ఉద్యోగులు ఈనెల 4న ఓట్ల లెక్కింపులో పాల్గొననున్నారు. -
జైలుకెళ్లినా మార్పు రాలె..!
[ 02-06-2024]
నలుగురు స్నేహితులు.. జల్సాలకు అలవాటు పడి దొంగతనాలే లక్ష్యంగా చేసుకున్నారు.. పలు చోరీల కేసుల్లో పోలీసులు అరెస్టుచేసి జైలుకు పంపినా వారిలో మార్పు రాలేదు. -
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతూ..
[ 02-06-2024]
గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మేడ్చల్ ఠాణా పరిధిలో శనివారం జరిగింది. -
బుల్కాపూర్ నాలా బఫర్ జోన్ కబ్జా
[ 02-06-2024]
నగరానికి చెందిన వరద నీటిని మోసుకెళ్లే ప్రధాన కాలువల్లో బుల్కాపూర్ నాలా కీలకమైంది. శతాబ్దాల క్రితమే నగర ప్రజలను వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రణాళికాబద్ధంగా నాటి నిజాం పాలకులు తవ్వించగా.. -
డబ్బులిచ్చుకో.. నిరభ్యంతరంగా పత్రాలు పుచ్చుకో
[ 02-06-2024]
రాజధాని నగరం శివారు ప్రాంతాల్లోని చెరువులు..వాగుల్లో రియల్ వెంచర్లు వేసుకునేందుకు ఇరిగేషన్ శాఖ అధికారులు సహకరించారు. -
దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలవాలి
[ 02-06-2024]
సవాళ్లను అధిగమించేందుకు కృషి, పట్టుదల, ఐక్యత, చిత్తశుద్ధి దేశ భద్రతకు మూలస్తంభాలుగా నిలుస్తాయని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ఎయిర్ పోర్టు సెక్టార్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ ప్రవీర్ రంజన్ తెలిపారు. -
రౌడీషీటర్ హత్యకు పథక రచన
[ 02-06-2024]
ఇద్దరు రౌడీషీటర్ల మధ్య తలెత్తిన గొడవతో ఒకరిపై మరొకరు పగ పెంచుకున్నారు. వారిలో ఒకరి హత్యకు పథకం వేసి అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. -
ఉచిత న్యాయం.. మరింత చేరువ
[ 02-06-2024]
కాలంతోపాటు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయి. వీటివల్ల బాధితులకు సత్వర న్యాయం జరగాలి. ఈ నేపథ్యంలో జిల్లాలో న్యాయసేవలు విస్తృతమవుతున్నాయి. -
డ్రైవింగ్ లైసెన్సులు పాత విధానంలోనే
[ 02-06-2024]
డ్రైవింగ్ లైసెన్సులను యథావిధిగా రవాణాశాఖ కార్యాలయాల్లోనే జారీ చేయనున్నారు. డ్రైవింగ్ లైసెన్సింగ్ విధానాన్ని మరింత సరళతరం చేస్తున్నట్లు గతంలో కేంద్రం ప్రకటించింది. -
యాప్లతో డ్రగ్స్ సరఫరా
[ 02-06-2024]
రెండు వేర్వేరు కేసుల్లో నగరంలో డ్రగ్స్ విక్రయిస్తున్న వి.లక్ష్మిపతి(28), ఒకారో కాస్మోస్ రమ్సీ(38)లను టీఎస్ న్యాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. -
పనిచేసే సంస్థకు ఉద్యోగుల కన్నం
[ 02-06-2024]
డిజిటల్ చెల్లింపులకు సంబంధించిన క్యూఆర్ కోడ్ మార్చేసి ప్రైవేటు సంస్థలో రూ.4.15 కోట్లు కొట్టేసిన మోసంలో సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) పోలీసులు ఇద్దర్ని అరెస్టు చేశారు. -
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో ముగ్గురి అరెస్టు
[ 02-06-2024]
నకిలీ పాస్పోర్టుల కుంభకోణంలో తెలంగాణ సీఐడీ మరో ముగ్గుర్ని అరెస్టు చేసింది. ఇందులో ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉండడం గమనార్హం.