logo

Nandyala: పోలీసుల అధికారిపై చర్యలు తీసుకోవాలి

వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్న గోస్పాడు ఎస్ఐ నాగార్జునరెడ్డిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్ శనివారం డిమాండ్ చేశారు.

Published : 25 May 2024 16:19 IST

 

రైతునగరం(నంద్యాల): వైకాపాకు అనుకూలంగా పనిచేస్తున్న గోస్పాడు ఎస్ఐ నాగార్జునరెడ్డిపై అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సహాయ కార్యదర్శి బాబాఫకృద్దీన్ శనివారం డిమాండ్ చేశారు. ఈ నెల 21న గోస్పాడు మండలం పసురపాడు గ్రామానికి చెందిన సీపీఐ మండల సహాయ కార్యదర్శి జిలానీ బాషాపై అదే గ్రామానికి చెందిన వైకాపా నాయకుడు అమరలింగేశ్వర్‌రెడ్డి దుర్భాషలాడుతూ, దౌర్జన్యానికి పాల్పడ్డారన్నారు. బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా జరిగిన సంఘటనపై ఎస్‌ఐ ఎలాంటి విచారణ జరపలేదన్నారు.

AP news, telugu news, police

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని