logo

CPM: కార్యకర్తల కృషి అభినందనీయం

2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాణ్యం అసెంబ్లీ పరిధిలో సీపీఎం పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు చేసిన కృషి అభినందనీయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

Updated : 25 May 2024 18:12 IST

రైతునగరం(నంద్యాల): 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాణ్యం అసెంబ్లీ పరిధిలో సీపీఎం పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు చేసిన కృషి అభినందనీయమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అనంతరం పాణ్యం నియోజకవర్గ సీపీఎం పార్టీ అభ్యర్థి గౌస్ దేశాయ్ మాట్లాడారు. శనివారం స్థానిక సీపీఎం పార్టీ కార్యాలయంలో కార్యకర్తల అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు పార్టీ ప్రచారంతో పాటు నిర్మాణాత్మకంగా బలపడడానికి దోహదపడిందన్నారు. రమేష్‌ కుమార్, ఏసురత్నం, నాగరాజు, రాజశేఖర్, ఎల్లయ్య, తోట మద్దులు, రత్నమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని