logo

Nandyala: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి గాయాలు

నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి బేస్ క్యాంప్ సమీపంలో ఎలుగు బంటి దాడి కలకలం రేపింది.

Published : 25 May 2024 19:02 IST

సున్నిపెంట సర్కిల్: నల్లమల అటవీ ప్రాంతంలోని ఇష్టకామేశ్వరి బేస్ క్యాంప్ సమీపంలో ఎలుగు బంటి దాడి కలకలం రేపింది. కుడుముల బయన్న అనే వ్యక్తిపై శనివారం ఎలుగుబంటి దాడి చేసింది. నక్కంటి రేంజ్ ఆఫీసర్ పి.ఎం.డి. ఆరిఫ్ ఖాన్ తెలిపిన వివరాల మేరకు.. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం, గాంధీ నగర్‌కు చెందిన కుడుముల బయన్న అనే వ్యక్తి మోదుగామాని పెంట సమీపంలో పాలగడ్డలకు వెళ్లిన సమయంలో ఎలుగుబంటి దాడి చేసినట్లు చెప్పారు. తప్పించుకొని ఇష్టకామేశ్వరి బేస్ క్యాంప్ ఏరియాకు వచ్చేసరికి ఫారెస్ట్ సిబ్బంది సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి మార్కాపురానికి తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని