logo

మండలంలో వైభవంగా చెన్నకేశవ స్వామి రథోత్సవం

మండలంలోని మల్ల వేముల సమీపంలోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నారు.

Published : 25 May 2024 12:50 IST

చాగలమర్రి: మండలంలోని మల్ల వేముల సమీపంలోని శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నారు. ఈ ఉత్సవాల్లో  భాగంగా శనివారం స్వామి అమ్మవార్లకు రథోత్సవం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి రథోత్సవాన్ని తిలకించేందుకు నంద్యాల, కర్నూలు,  కడప జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉత్సవ విగ్రహాలతో రథోత్సవం ఆలయ పురివీధుల గుండా అత్యంత వైభవంగా జరిగింది. ఈ  కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ జగదీశ్వర్ రెడ్డి, ఈవో నరసయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు