logo

సున్నిపెంటకు చేరుకున్న మధ్యప్రదేశ్ సీఎం

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సున్నిపెంట హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు.

Published : 25 May 2024 12:23 IST

సున్నిపెంట సర్కిల్‌:  శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకునేందుకు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో సున్నిపెంట హెలీప్యాడ్‌ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు భాజపా నాయకులు ఘన స్వాగతం పలికారు. భాజపా జిల్లా కోఆర్డినేటర్ అభిరుచి మధు, జిల్లా ఇన్‌ఛార్జి రమేష్ నాయుడు, బనగానపల్లి ఇన్‌ఛార్జి బి. వి. సుబ్బారెడ్డి, మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు,  స్థానిక నాయకులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని