logo

Kurnool: గాలిమర యంత్రం కూలీ వ్యక్తి మృతి

కర్నూలు జిల్లా లోని కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో గత కొన్ని నెలలుగా గాలి మరల పనులు కొనసాగుతున్నాయి.

Published : 25 May 2024 15:49 IST

గూడూరు: కర్నూలు జిల్లా లోని కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గాల పరిధిలో గత కొన్ని నెలలుగా గాలి మరల పనులు కొనసాగుతున్నాయి. నిన్న గాలి వానకు ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలం పెద్ద నేలటూరు పులకుర్తి గ్రామాల మధ్యల పవన విద్యుత్ ఫ్యాన్ల క్రేన్ ప్రమాదవశాత్తు గొల్ల చంద్ర కారుపై పడింది. ఈప్రమాదంలో కోడుమూరు పట్టణం కొండపేటలో అద్దె భవనంలో నివాసముంటున్న గొల్ల చంద్ర అనే వ్యక్తి మృతి చెందాడు. చంద్ర తన కారును గాలిమర పనులు చేసే ఉద్యగులను తరలిచేందుకు అద్దెకు పెట్టాడు. ఘటనలో ఇద్దరు తీవ్ర గాయల పాలయ్యారు. వీరు పెంచికలపాడు విశ్వ భారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటనలో కార్ నుజ్జు నుజ్జు అయింది. గాలి మరల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు అంటున్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని