తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు
వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు.
సమీక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులు
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : వేసవి దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.మనజీర్ జిలాని సామూన్ ఆదేశించారు. నంద్యాల సెంటినరి హాల్లో శుక్రవారం తాగునీటి సరఫరా, వడగాల్పులు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ రఘువీర్రెడ్డి, జాయింట్ కలెక్టర్ నిశాంతి, అదనపు ఎస్పీ రమణ, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మనోహర్, జడ్పీ డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎండిపోయిన బోర్లు లోతు పెంచడం, ఇతర మరమ్మతులు చేపట్టి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. పాఠశాలలు, గ్రామాల్లో పనిచేయని ఆర్వో ప్లాంట్లను గుర్తించి మరమ్మతులు చేయించాలన్నారు. ఎండ తీవ్రత, వడగాల్పుల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మున్సిపల్, మండల కేంద్రాల్లో చలివేంద్రాలు, చలువపందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు. డీపీవో శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ శ్రీధర్రెడ్డి, డ్వామా పీడీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వరద వస్తోంది.. మురుగు చేరుతోంది
[ 26-07-2024]
తుంగభ్రద.. కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతున్నాయి... పట్టణ మురుగు వరదలో కలుస్తోంది.. నదులు, వంకలు మురుగు కూపాలుగా మారుతున్నాయి. కలుషిత జలం శ్రీశైలం జలాశయం చెంతకు చేరుతోంది.. జీవనదుల్లో ‘కలుషితం’ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. -
అందని బిల్లు.. ఆగిన ఆరోగ్య కేంద్రం
[ 26-07-2024]
గ్రామీణ వైద్య సేవలను ఐదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా అటకెక్కించింది. ఆరోగ్య కేంద్రాలకు నిధులివ్వకుండా నిర్వీర్యం చేసింది. -
కృష్ణమ్మ పరవళ్లు
[ 26-07-2024]
ఎగువన కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది.. బిరబిరా దిగువకు చేరుతోంది.. శ్రీశైల జలాశయానికి జూన్ 9న సుంకేశుల జలాశయం, జులై 17న జూరాల ప్రాజెక్టు నుంచి వరద ప్రవాహం రావడం ప్రారంభమైంది. -
ఒలింపిక్ వేడుక స్ఫూర్తి వేదిక
[ 26-07-2024]
నాలుగేళ్లకోసారి జరిగే ఆటల సంబరం మొదలైంది.. పారిస్ నగరంలో చిరుతలా పరుగెత్తడానికి అథ్లెట్లు.. చేపలా నీటిలో దూసుకెళ్లేందుకు స్విమ్మర్లు..పంచ్లతో విరుచుకుపడేందుకు బాక్సర్లు.. -
అప్రమత్తతే రక్ష.. తూకాల్లో తేడాలొస్తే శిక్ష
[ 26-07-2024]
నిత్యావసరాల ధరలు చుక్కలనంటుతున్నాయి. ఒకవైపు సామాన్యులు ఏ వస్తువు కొనాలన్నా ధరాభారంతో కుంగిపోతున్నారు. మరోవైపు కొనుగోలు చేస్తున్న వస్తువుల్లో కూడా తూకాల్లో తేడాతో మోసపోతున్నారు. -
కలుషితమైనది!
[ 26-07-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నదీజలాలు కలుషితమవుతున్నాయి. తుంగభద్ర, హంద్రీ, కుందూ నదులు, కేసీ, చామకాల్వల్లో పెద్దఎత్తున వ్యర్థాలు పేరుకుపోయి అధ్వానంగా మారాయి. -
జలవనరుల శాఖ ఇంజినీర్ అత్యుత్సాహం
[ 26-07-2024]
అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేల మెప్పునకు కర్నూలు ఇరిగేషన్కు చెందిన ఒక ఇంజినీర్ మరింత ఉత్సాహపడుతున్నారు. -
ప్రాణం తీసిన గుంత
[ 26-07-2024]
ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆ ఆటో ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఐదేళ్ల ఆటంకం
[ 26-07-2024]
గత ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. గురుకుల పాఠశాల విద్యార్థులకు సొంతభవనం లేకపోవడంతో డోన్లోని స్టేడియంలో తరగతులు నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
-
గాజాలో సంక్షోభంపై మౌనంగా ఉండలేను.. నెతన్యాహుతో కమలా హారిస్
-
ఒలింపిక్స్ పోరులో మన భాగ్యాలు.. హైదరాబాద్లో శిక్షణ పొంది అంతర్జాతీయ స్థాయికి
-
డబ్బులు ఊరికే రావు.. మాటల మాయలో పడ్డారో.. ఇల్లు గుల్లే
-
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
-
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక