బాధిత కుటుంబానికి రూ.25 లక్షలు చెల్లించండి
రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది.
కర్నూలు న్యాయవిభాగం, న్యూస్టుడే : రహదారి ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబానికి బీమా పరిహారం చెల్లించాల్సిందేనని ఆదిత్య బిర్లా సంస్థను జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశించింది. కర్నూలు జిల్లా గూడూరు మండలానికి చెందిన మెడికల్ రిప్రజెంటేటివ్ ఓంప్రకాశ్ 2021 నుంచి 2024 వరకు చెల్లుబాటయ్యేలా ఆదిత్య బీమా సంస్థ నుంచి రూ.25 లక్షల బీమా పాలసీ తీసుకున్నారు. అదే సంవత్సరం అక్టోబరు 4వ తేదీన మరో ఇద్దరు మిత్రులతో కలిసి మోటారు సైకిల్పై ఓంప్రకాశ్ వెళ్తుండగా అకస్మాత్తుగా పంది అడ్డు రావటంతో ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించటం నిబంధనలకు విరుద్ధమంటూ బీమా పరిహారం ఇచ్చేందుకు ఆదిత్యబిర్లా సంస్థ నిరాకరించటంతో బాధిత కుటుంబసభ్యులు కమిషన్ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలను కమిషన్ అధ్యక్షులు కరణం కిషోర్కుమార్, సభ్యులు నారాయణరెడ్డి, నజీమకౌసర్తో కూడిన బెంచి శుక్రవారం పరిశీలించింది. ముగ్గురు ప్రయాణించటంతో ప్రమాదం జరగలేదని, పంది అడ్డు రావటంతోనే జరిగిందని పేర్కొంటూ బీమా పరిహారం రూ.25 లక్షలతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.50 వేలు ఇవ్వాలని తీర్పు ఇచ్చింది.
పరిహారం ఇవ్వాల్సిందే
కర్నూలు న్యాయవిభాగం, న్యూస్టుడే : అగ్నిప్రమాదానికి సంబంధించిన ఘటనలో ప్రమాద బీమా పరిహారం చెల్లించాలంటూ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ శుక్రవారం తీర్పు ఇచ్చింది. ఆదోని పట్టణానికి చెందిన సభాకౌసర్ ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద 2019 సంవత్సరంలో రూ.25 లక్షలతో పవర్లూమ్, హ్యాండ్లూమ్ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. చోళమండలం జనరల్ ఇన్సురెన్స్ సంస్థ వద్ద రూ.15 లక్షలకు ప్రమాద బీమా తీసుకున్నారు. 2020, అక్టోబరు 30న కురిసిన భారీ వర్షంతో సంస్థ ఆవరణలోకి భారీగా నీరు చేరటంతో విద్యుదాఘాతం చోటుచేసుకుని అగ్నిప్రమాదం జరిగింది. యంత్రాలు కాలిపోవటంతో రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రమాద ఘటనను ధ్రువీకరించారు. బాధితులు పరిహారం కోరుతూ బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోగా సదరు బీమా సంస్థ సర్వేయర్ ఘటనాస్థలాన్ని పరిశీలించి రూ.1.75 లక్షలు మాత్రమే నష్టం జరిగినట్లు నివేదిక అందించారు. దీంతో బాధితుడు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ను ఆశ్రయించారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన కమిషన్ అధ్యక్షులు కరణంకిషోర్కుమార్, సభ్యులు నారాయణరెడ్డి, నజీమాకౌసర్తో కూడిన బెంచి సంస్థ యజమానికి రూ.7.5 లక్షలను 9 శాతం వడ్డీతో చెల్లించటంతోపాటు కోర్టు ఖర్చుల కింద మరో రూ.60 వేలు ఇవ్వాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు