అధునాతన సౌకర్యాలు.. ఆదర్శ ఫలితాలు
ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
2024-25లో ఆదర్శ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 22 వరకు గడువు
ఆదర్శ కళాశాలలో ఇంటర్ అభ్యసిస్తున్న విద్యార్థులు
డోన్పట్టణం, న్యూస్టుడే: ఉమ్మడి జిల్లాలోని ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్లో చేరేందుకు పదోతరగతి ఉత్తీర్ణులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అధునాతన తరగతి గదులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అన్ని సౌకర్యాలతో ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, విద్యార్థులు కళాశాలలకు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సుల రాకపోకలు, పట్టణానికి దూరంగా ఉన్న గ్రామీణ పేద బాలికలకు వసతిగృహం వంటి సౌకర్యాలతో ఇవి విద్యార్థులను ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు.
ఒక్కో గ్రూపులో 40 సీట్లు
ఆదర్శ కళాశాలల్లో ఇంటర్మీడియట్కు సంబంధించి ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ వంటి గ్రూపుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఒక్కో కళాశాలలో ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున నాలుగు గ్రూపులకు 160 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు. పదోతరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను ఆయా గ్రూపులకు, రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయం ఉన్న వర్గాల వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
దరఖాస్తు చేసుకోవడం ఇలా..
ఆదర్శ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా గానీ, మీ-సేవా కేంద్రాల్లో గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ధ్రువపత్రాలతో దరఖాస్తులను సమర్పించాలి.www.cse.ap.gov.in, www.apms.apcfss.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసిన ఫారంతో పాటు స్టడీ సర్టిఫికెట్, మార్కుల మెమో, ఆధార్లను ఆయా కళాశాలల్లో ఇవ్వాలి.
రుసుములు ఇలా..: దరఖాస్తు రుసుము ఒసి, బిసిలకు రూ. 200లు.ఎస్సీ, ఎస్టీ, పీహెచ్సీలకు రూ. 150లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలో 35 కళాశాలలు
ఆదర్శ కళాశాలల్లో ఇంటర్ ప్రథమసంవత్సరంలో చేరికలకు విద్యార్థుల నుంచి మార్చి 28వ తేదీ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి అభ్యసించి ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రతిభావంతులైన గ్రామీణ విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలో బోధించనున్నారు. కర్నూలు జిల్లాలో 16, నంద్యాల జిల్లాలో 19 మొత్తం 35 కళాశాలల్లో చేరికలకు ఈనెల 22 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
సీట్ల కేటాయింపు ఇలా..
ఆదర్శ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు కల్పించే విషయంలో సీట్ల కేటాయింపులో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 10, బీసీలకు 29, దివ్యాంగులకు 3, బాలికలకు 33.3, ఈడబ్ల్యుఎస్కు 10, ఓసీలకు 37శాతం రిజర్వేషన్ ప్రకారం సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేసిన వారి జాబితాలను ఆయా ఆదర్శ కళాశాలల వద్ద ప్రదర్శిస్తారు. ఎంపిక చేసిన విద్యార్థుల విద్యార్హతకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి ప్రవేశాలు కల్పించే తేదీలు ప్రకటించనున్నారు. జూన్ ఒకటో తేదీ నుంచి సీనియర్ ఇంటర్ తరగతులు జరగనున్నాయి.
ఎక్కడెక్కడ ఉన్నాయంటే..
- కర్నూలు జిల్లాలో: ఆలూరు, ఆస్పరి, సి.బెళగల్, గోనెగండ్ల, గూడూరు (జులేకల్లు), కల్లూరు(పెద్దపాడు), కోడుమూరు, కోసిగి, కృష్ణగిరి, మద్దికెర, మంత్రాలయం, నందవరం, ఓర్వకల్లు, పత్తికొండ, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు (కడివెల్ల) 16 ప్రాంతాల్లో ఆదర్శ కళాశాలలు ఉన్నాయి.
- నంద్యాల జిల్లాలో: ఆళ్లగడ్డ (కోటకందుకూరు), బనగానపల్లి (రవ్వలకొండ), బండి ఆత్మకూరు, బేతంచెర్ల (గోరుమానుకొండ), డోన్, గడివేముల, గోస్పాడు, జూపాడు బంగ్లా, కొలిమిగుండ్ల, మహానంది (ఎం.తిమ్మాపురం), మిడుతూరు, అవుకు, పగిడ్యాల, పాములపాడు, పాణ్యం, రుద్రవరం, శిరివెళ్ల, ఉయ్యాలవాడ, వెలుగోడు ప్రాంతాల్లో ఆదర్శ కళాశాలలు ఉన్నాయి.
- నంద్యాలలో ఆదర్శ పాఠశాలకు భవనం లేనందున ప్రస్తుతం సెరికల్చర్ భవనంలో నిర్వహిస్తున్నారు. ఆదర్శ పాఠశాల, కళాశాల భవనాన్ని నిర్మిస్తున్నారు. భవనం పూర్తైతే అందులో ఇంటర్ తరగతులు ప్రారంభించే అవకాశం ఉంటుంది.
విద్యార్థులు వినియోగించుకోవాలి
ఆదర్శ పాఠశాలలు, కళాశాలల్లో ప్రైవేట్, కార్పొరేట్కు ధీటుగా ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన కొనసాగుతుంది. అధునాతన సదుపాయాలతో పాటు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో బోధిస్తూ ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తూ పురోగతి వైపు నడుస్తున్నాయి. విద్యార్థులకు ప్రయోగ పూర్వకంగా బోధిస్తారు. ప్రతి కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో పరిమితంగా ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున చేరికలుంటాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.
డా.ఇస్రత్ బేగం, నంద్యాలఆదర్శ కళాశాలల జిల్లా కన్వీనరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల