కాల్వల్లో మన్ను.. వీధుల్లో మడుగు
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు.
ముంపు బారిన కాలనీలు
కాల్వల్లో సిల్టు తీయని వైనం
మూడేళ్లుగా పట్టించుకోని అధికారులు
నగరంలో ఆనంద్ థియేటర్ సమీపంలో వంతెన వద్ద పరిస్థితి
పురపాలకాల్లో ఏటా ఇంటి పన్ను 15 శాతం పెంచుతున్నారు.. కుళాయి పన్ను చెల్లించకుంటే కనెక్షన్ తొలగిస్తున్నారు.. వీధుల్లోకి వరద వస్తే మాత్రం పట్టించుకోవడం లేదు. కాల్వల్లో పేరుకుపోయిన పూడిక (సిల్టు)ను ఏటా ఏప్రిల్, మే నెలల్లో తొలగించాలి.. గత మూడేళ్లు పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడ వ్యర్థాలు, పూడిక పేరుకుపోవడంతో వరద నీరు ముందుకెళ్లే పరిస్థితి లేదు.. చిన్నపాటి వర్షం వచ్చినా కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.. పట్టణ ప్రజలకు కునుకులేకుండా పోయింది.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కర్నూలు నగరపాలకం, పురపాలికల్లో దాదాపు 16-18 లక్షల జనాభా జీవనం సాగిస్తోంది. ఆయా ప్రాంతాల్లో పాతిక శాతం వార్డులు ముంపు సమస్యలు ఎదుర్కొంటున్నాయి.
న్యూస్టుడే, కర్నూలు కార్పొరేషన్, నంద్యాల, డోన్, ఎమ్మిగనూరు,ఆదోని పురపాలిక
మూడేళ్లుగా పూడిక తీయలేదు
డోన్ పట్టణంలో 32 వార్డులు ఉన్నాయి. అన్ని రకాల కాల్వలు కలిపి 117.50 కి.మీ.ల మేర విస్తరించి ఉన్నాయి. పెద్ద కాల్వలో 2020లో 10 కి.మీ.ల మేర పూడిక తీశారు. అప్పటినుంచి నేటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం, పూడిక పేరుకుపోయింది. వరద నీరు ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో చిన్నపాటి వర్షం కురిసినా శ్రీరామనగర్, తారకరామానగర్, సుజాతమ్మనగర్ కాలనీలు ముంపుబారిన పడుతున్నాయి. పట్టణంలోని మురుగు ముందుకెళ్లేలా రూ.కోట్లు వెచ్చించి స్టార్మ్ వాటర్ డ్రైన్స్ను నిర్మించారు. వాటికి అనుబంధంగా కచ్చా, సీసీ డ్రైన్లు చేపట్టారు. పలుచోట్ల ఆక్రమణకు గురికావడంతో వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది.
40 వేల మందికి నరకం
నంద్యాల పురపాలకం, న్యూస్టుడే: చిన్నపాటి వర్షానికే జిల్లా కేంద్రం నంద్యాలలోని వీధులు మడుగులను తలపిస్తున్నాయి. సంజీవనగర్ గేట్, బైటిపేట, హరిజనవాడ, ఉప్పరిపేట, ఎంహెచ్ఎస్రోడ్డు, చాంద్బాడా, గుడిపాటిగడ్డ, పురపాలక కార్యాలయం, పద్మావతినగర్, సలీంనగర్, శ్యాంనగర్, సంచిపట్టల వీధి, సరస్వతీనగర్, దేవనగర్, భైర్మల్వీధి ప్రాంతాలు ముంపుబారిన పడుతున్నాయి. ఏటా వర్షాకాలంలో 40 వేల మంది ఇబ్బంది పడుతున్నారు. గాంధీచౌక్ నుంచి ప్రభుత్వ వైద్యశాల వరకు 2017లో రహదారులను విస్తరించారు. ఇరువైపులా ఫుట్పాత్లు నిర్మించారు.. ఇప్పటివరకు పూడిక తీయలేదు.. వ్యర్థాలు నిండిపోవడంతో చిన్నపాటి వర్షం వచ్చినా నీరు ముంచెత్తుతోంది. పట్టణంలో 383.55 కి.మీ మేర కాల్వలు విస్తరించి ఉన్నాయి. పలుచోట్ల ఆక్రమణలకు గురికావడం.. కల్వర్టులు దెబ్బతినడంతో నీరు ముందుకెళ్లే పరిస్థితి లేకపోవడంతో వరద రోడ్లపైకి దూసుకొస్తోంది.
మూడు వేల మందికి తిప్పలు
చేనేతపురి ఎమ్మిగనూరు పట్టణంలో పాత ఆంజనేయస్వామి ఆలయం వీధిలో 350 మీటర్ల పొడవు ఉన్న ప్రధాన కాల్వలో పూడిక పేరుకుపోయింది. వరద నీరు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు.. చిన్నపాటి వర్షం వచ్చినా 11వ వార్డును ముంచెత్తుతోంది. క్విబుల్లా కాలనీ, చంద్రయ్య కొట్టాలలో ఉన్న 600 మీటర్ల పెద్ద కాల్వ, చెన్నకేశవ కాలనీలో 750 మీటర్ల కాల్వలో పూడిక పేరుకుపోయింది. వర్షం వచ్చిన ప్రతిసారి మూడు వేల మంది ఇళ్లల్లోకి నీరు చేరుతోంది. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతున్నా పుర అధికారులు, పాలకవర్గం స్పందించడం లేదు.
రెండేళ్ల కిందట మమ అనిపించారు
కర్నూలు నగరంలో 52 వార్డులో ఆరు లక్షల మంది నివాసం ఉంటున్నారు..నగరంలో మురుగు వెళ్లేందుకు 1,400 కి.మీ.ల మేర కాల్వలు నిర్మించారు.. వాటిలో పెద్దఎత్తున పూడిక పేరుకుపోవడంతో నీరంతా రోడ్లపైకి చేరుతోంది. గాంధీనగర్, ఐదు రోడ్ల కూడలి, ఆనంద్ థియేటర్ సమీపంలో, కిడ్స్ వరల్డ్, పాతనగరం జమ్మిచెట్టు సమీపంలో, బుధవారపేట, శ్రీరామనగర్, ముజఫర్నగర్, శరీన్నగర్ తదితర ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. పూడిక తీసేందుకు ప్రత్యేకంగా 180 మంది కార్మికులు ఉన్నారు. కాల్వల్లో పూడిక తీయడానికి రెండేళ్ల కిందట ప్రతి వార్డుకు రూ.20 వేలు కేటాయించారు. నిధులు సరిపోకపోవడంతో నామమాత్రంగా చేసి వదిలేశారు. తర్వాత తట్టెడు మట్టి ఎత్తలేదు..ఫలితంగా చిన్న వర్షం పడినా రహదారులపై మురుగు ఏరులై పారుతోంది.
ముంపు బారిన 15 కాలనీలు
ఆదోని పట్టణంలో 42 వార్డులు ఉండగా రెండు లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఏటా వర్షాకాలంలో 12 నుంచి 15 కాలనీలు ముంపు బారిన పడుతున్నాయి.. ఫలితంగా 30 వేల మంది అవస్థలు పడుతున్నారు. పట్టణంలో ప్రధాన రహదారితో పాటు సట్టాబజారు, కూరగాయల మార్కెట్, సర్వజన ఆసుపత్రి రహదారి, హన్సాజీపేట, గీతామార్కెట్ వంటి ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. పాతబస్తీ, బుడ్డేకల్లు వీధి, వాల్మీకినగర్ దిగువ ప్రాంతం, ప్రకాశ్నగర్, అరుణ్జ్యోతినగర్, శివశంకర్నగర్, గౌళిపేట, వడ్డెగేరి, బోయగేరి, బొబ్బులమ్మగుడి, మట్కర్వీధి తదితర ప్రాంతాలు చిన్నపాటి వర్షానికే చెరువులను తలపిస్తున్నాయి. పట్టణం మీదుగా 12-15 కి.మీ మేర ఆవుదూడ, ఎర్రవంకలు ప్రవహిస్తున్నాయి. 190 కి.మీ మేర మురుగు కాల్వలు ఉన్నాయి. చాలాచోట్ల ఆక్రమణకు గురయ్యాయి. పూడిక తీయడం లేదు.. దీంతో వర్షపు నీరు ముందుకు వెళ్లే మార్గం లేక కాలనీలను ముంచెత్తుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలి
[ 27-07-2024]
ఎస్పీ జి.బిందు మాధవ్ ఆర్టీసి, ట్రాన్స్కో, నేషనల్ హైవే అథారిటీ, మున్సిపల్, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. -
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి
[ 27-07-2024]
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి