logo

శుకనంపై చిరుత దాడి

సున్నిపెంటలోని వెస్ట్రన్‌ కాలనీలో  ఓ ఇంటి ఆవరణలో  పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది.

Published : 18 May 2024 12:56 IST

సున్నిపెంట సర్కిల్ : సున్నిపెంటలోని వెస్ట్రన్‌ కాలనీలో  ఓ ఇంటి ఆవరణలో  పెంపుడు శునకంపై చిరుత పులి దాడి చేసి హతమార్చింది. వివరాల్లోకి వెళితే.. స్థానికంగా నివాసం ఉండే  నల్లబోతుల మల్లికార్జున అనే వ్యక్తి.. తన  ఇంటి ఆవరణలో ఉన్న పెంపుడు శునకంపై చిరుత  శనివారం తెల్లవారుజామున దాడిచేసినట్లు  తెలిపారు. సమాచారం అందుకున్న  అటవీ శాఖ అధికారులు ఘటనాస్థలికి  చేరుకుని చిరుత అడుగులను గుర్తించినట్లు చెప్పారు. సున్నిపెంటలోని వెస్ట్రన్‌ కాలనీ నలమల అటవీ ప్రాంతానికి సమీపంలో ఉండటంతో  చిరుత పులి సంచరిస్తోందని,  ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ శ్రీశైలం రేంజ్‌ అధికారి నరసింహులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని