సేవలు వృద్ధి.. ‘లక్ష్య’ సిద్ధి
ప్రసూతి, నవజాత శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిష్ఠాత్మకంగా ‘లక్ష్య’ పురస్కారాలు ప్రధానం చేస్తోంది.
జహీరాబాద్ ఆసుపత్రికి దక్కిన పురస్కారం
నాణ్యతా ప్రమాణాల్లో రాష్ట్రంలో తొలి స్థానం
ఆసుపత్రిలో బాలింతల వార్డు
న్యూస్టుడే, జహీరాబాద్, అర్బన్: ప్రసూతి, నవజాత శిశు మరణాలు తగ్గించడమే లక్ష్యంగా జాతీయ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రతిష్ఠాత్మకంగా ‘లక్ష్య’ పురస్కారాలు ప్రధానం చేస్తోంది. కాన్పు, బాలింతల వార్డుల్లో మెరుగైన వైద్యసేవలు సహా జాతీయ ఆరోగ్య మిషన్ మార్గదర్శకాల ప్రకారం నాణ్యతా ప్రమాణాలు పాటించడం తప్పనిసరి. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ వైద్య విధాన పరిషత్తు ప్రాంతీయ ఆసపత్రికి సదరు అవార్డు దక్కడం విశేషం. లక్ష్య కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్న ఆసుపత్రిగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
అంతర్రాష్ట్ర సరిహద్దులో..
అంతర్రాష్ట్ర సరిహద్దు పట్టణమైన జహీరాబాద్లోని వంద పడకల ఆసుపత్రికి డివిజన్తో పాటు వికారాబాద్ జిల్లాలోని మర్పల్లి, బంట్వారం సహా కర్ణాటక సరిహద్దు గ్రామాల ప్రజలు వైద్యానికి వస్తుంటారు. సాధారణ, ప్రసూతి సేవలు ఇక్కడి వైద్యులు చక్కగా అందిస్తున్నారు. నిత్యం వెయ్యి మంది ఔట్పేషంట్లు ఉంటుండగా, నెలలో 350 కాన్పులు జరుగుతున్నాయి. వీటిలో 70 శాతం వరకు సాధారణం కాగా, 30 శాతం లోపు శస్త్ర చికిత్స కాన్పులు చేస్తున్నారు.
మూడేళ్లు ప్రోత్సాహకాలు..
పురస్కారానికి ఎంపికైన ఆసుపత్రులకు జాతీయ ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వ శాఖ, జాతీయ ఆరోగ్య మిషన్ సంయుక్తంగా మూడేళ్ల పాటు ప్రోత్సాహకాలు అందించనుంది. రూ.5 లక్ష చొప్పున మూడేళ్ల వరకు అందిస్తారు. ఈ నిధులను ప్రసూతి ఆపరేషన్ థియేటర్ ఆధునికీకరణకు కేటాయించడంతో పాటు వైద్యులు, సిబ్బంది పనితీరుకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తారు.
నవజాత శిశువును పరీక్షిస్తున్న వైద్యుడు శేషురావు
నిబంధనల మేర..
లక్ష్య పథకానికి సంబంధించి కేంద్రం పలు నిబంధనలు నిర్దేశించింది. ప్రసూతి గదిలో అన్ని సౌకర్యాలతో పాటు నవజాతి శిశువులకు చక్కని సేవలు అందించాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలి. ఆయా వాటి ప్రకారం మార్కులు కేటాయిస్తారు. గత జనవరి 20, 21వ తేదీల్లో కేంద్ర అధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ వైద్యుల బృందం ఆసుపత్రిని సందర్శించి ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో ప్రసూతి, నవజాత శిశు వైద్యసేవలను ప్రత్యక్షంగా పరిశీలించారు. జాతీయ స్థాయిలో నివేదిక సమర్పించడంతో పాటు స్కోరు కేటాయించారు. ఇందులో లేబర్ రూమ్ (ప్రసూతి) 94 శాతం, బాలింతలు, నవజాత శిశు వార్డుకు 95 శాతం స్కోర్ ఇవ్వడంతో జహీరాబాద్ ఆసుపత్రి రాష్ట్రంలోనే ముందంజలో నిలిచింది.
సమష్టి కృషికి గుర్తింపు
డా.శేషురావు, ఆసుపత్రి పర్యవేక్షకులు
వైద్యులు, సిబ్బంది సమష్టి కృషికి గుర్తింపుగా పురస్కారం దక్కింది. జాతీయ స్థాయి లక్ష్య పథకంలో రాష్ట్రంలో మొదటి స్థానం దక్కడం సంతోషంగా ఉంది. మరింత బాధ్యతగా మెరుగైన సేవలు అందిస్తాం.
పైసా ఖర్చులేకుండా..
స్వప్న, గర్భిణి, పీచేర్యాగడి
జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నారు. మొదటి కాన్పుకు ఇక్కడికే వచ్చాను మళ్లీ ఇప్పుడు రెండో సారి వచ్చాను. పైసా లేకుండా ప్రభుత్వం సేవలు అందిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?