వేతనాలు రాక వెతలు
పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కష్టపడి పని చేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు.
చెత్త సేకరిస్తున్న పంచాయతీ కార్మికులు
న్యూస్టుడే, సిద్దిపేట అర్బన్: పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కష్టపడి పని చేస్తున్న కార్మికులకు సకాలంలో వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు గ్రామాల్లో పేరుకున్న చెత్తాచెదారం తొలగిస్తున్నారు. ప్రతి నెల కార్మికులకు వేతనాలు రావడంల లేదు. కుటుంబాలను పోషించుకోవడానికి అవస్థలు పడుతున్నామని గ్రామ పంచాయతీ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 499 పంచాయతీలు ఉండగా దాదాపు 2500 మంది కార్మికులు పనులు చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం ఒక్కొక్క కార్మికుడికి ప్రతి నెల రూ.8500 అందిస్తోంది. కొద్ది నెలలుగా పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల కాకపోవడంతో వేతనాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని అధికారులు చెబుతున్నారు. కొన్ని మేజర్ పంచాయతీలకు ఇతరత్రా ఆదాయం వస్తోంది. మిగతాచోట్ల ఇబ్బందిగా మారిందని పంచాయతీ కార్యదర్శులు వాపోతున్నారు.
అధిక పనిభారం
పంచాయతీలకు ప్రభుత్వం ప్రతి నెల జమ చేస్తున్న నిధుల్లో నుంచి ముందుగా వేతనాలను చెల్లించేవారు. ప్రతి నెల 5వ తేదీలోగా కార్మికుల ఖాతాల్లో జమ చేసేవారు. ప్రస్తుతం కార్యదర్శులు బిల్లులు చేసి చెక్కులు వేస్తున్నా నగదు కార్మికుల ఖాతాల్లో జమ కావడం లేదు. నిధులున్నా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం మల్టీపర్పస్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో కార్మికులు అన్ని రకాల పనులు చేయాల్సి వస్తోంది. సిబ్బందిపై పని భారం పెరిగింది. పెద్ద పంచాయతీల్లో నలుగురు, ఐదుగురు, చిన్నవాటిల్లో ఇద్దరు, ముగ్గురు ఉన్నారు. ట్రాక్టరుపై ఉదయం వేళ ఇంటింటికీ తిరుగుతూ చెత్త సేకరిస్తారు. డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేస్తున్నారు.
అప్పులు చేయాల్సి వస్తోంది
- మహేశ్, పంచాయతీ కార్మికుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
కార్మికులకు మూడు నెలలుగా వేతనాలు రావడం లేదు. ఈ నెల 13న కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టాం. ఇంకా అందలేదు. కుటుంబ పోషణ భారమై అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం తక్షణం స్పందించి ఖాతాల్లో జమ చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన బడి.. వసతులు కొరవడి
[ 27-07-2024]
జిల్లావ్యాప్తంగా ‘మన ఊరు- మన బడి’ పథకం పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో ‘మన ఊరు- మన బడి’ పేరుతో మెరుగైన వసతుల కల్పనకు శ్రీకారం చుట్టారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వెలుగులు నిరంతరం.. బిల్లులు భారం
[ 27-07-2024]
జిల్లా కేంద్రం మెదక్ పురపాలిక పరిధిలోని చాలా కాలనీల్లో రాత్రీపగలు తేడా లేకుండా వీధి దీపాలు వెలుగుతూనే ఉంటున్నాయి. -
అదను దాటుతోంది.. ఆగస్టుపైనే ఆశలు
[ 27-07-2024]
ఆశించిన మేర వర్షాలు కురవకపోవడంతో ఉన్న నీటి వనరులతోనే రైతులు వరి సాగుకు శ్రీకారం చుట్టారు. వారం రోజుల కిందటి వరకు నాట్లు నత్తనడకన సాగాయి. -
గురిపెట్టు.. పతకం పట్టు
[ 27-07-2024]
ఒలింపిక్స్.. ఈ విశ్వ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులు నిరంతరం తపిస్తుంటారు. ఇందుకు అహర్నిశలు శ్రమిస్తుంటారు. -
తల్లిదండ్రుల చెంతకు చేర్చిన ఆధార్ నమోదు
[ 27-07-2024]
పదేళ్ల కిందట తప్పిపోయిన ముగ్గురు మానసిక దివ్యాంగులు ఎట్టకేలకు తల్లిదండ్రుల చెంతకు చేరారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి దుర్మరణం
[ 27-07-2024]
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడగా, తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన దుబ్బాక మండలం అప్పనపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. -
రసాయన రహితం.. ఆరోగ్య భరితం
[ 27-07-2024]
మహిళామణులు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమంతా బాగుంటుంది. ఇంటి బాధ్యతలు మోసే వారు రుతు సమయంలో నానాపాట్లు పడుతుంటారు. -
గుంతల్లో నీరు.. గమ్యమెలా చేరేది?
[ 27-07-2024]
జహీరాబాద్ పట్టణం నుంచి జహీరాబాద్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లోని వివిధ గ్రామాలను కలుపుతూ బీదర్ పట్టణానికి వెళ్లే అల్గోల్ రహదారిపై జహీరాబాద్ శివారులో పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. -
చుక్క చుక్క.. మొక్కకు చేరేలా..
[ 27-07-2024]
సూక్ష్మ సేద్యం విధానంలోతక్కువ నీటి వసతితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటల సాగు సాధ్యమవుతుంది. ఈ విధానం ద్వారా ప్రతి నీటి చుక్క మొక్కకు చేరుతుంది. -
కొత్త లైన్లకు సర్వే పూర్తి
[ 27-07-2024]
దశాబ్దాలుగా జహీరాబాద్ ప్రాంతవాసులు రైల్వే మంత్రిత్వ శాఖకు చేస్తున్న విజ్ఞప్తులు ఎట్టకేలకు ఫలించే అవకాశాలున్నాయి. -
వీధి వ్యాపారులకు ఆత్మనిర్భరం
[ 27-07-2024]
వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్ స్వనిధి పథకం వరంలా మారింది. -
వాన హోరు.. సాగు జోరు..
[ 27-07-2024]
జోరుగా కురుస్తున్న వర్షాలతో సాగు ఊపందుకుంది. నెలన్నర రోజుల పాటు జల్లులకే పరిమితమైన వానలు.. ఇప్పుడు జోరుగా కురుస్తుండటంతో రైతులు ఉత్సాహంగా పొలాలు దున్నుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ