Ponguleti: దత్తత గ్రామం వాసాలమర్రిని కేసీఆర్ ఆగం చేశారు: మంత్రి పొంగులేటి

తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పర్యటించారు. గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలను ఆయన పంపిణీ చేశారు. కేసీఆర్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని.. అభివృద్ధి చేస్తానని చెప్పి ఆగం చేశారని విమర్శించారు.
‘‘ఇక్కడి ప్రజలకు నాడు ఇచ్చిన హామీలేవీ కేసీఆర్ నెరవేర్చలేదు. రాష్ట్రానికే వాసాలమర్రిని రోల్ మోడల్ చేస్తానన్నారు. కానీ ఈ చిన్న గ్రామాన్ని ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారో ప్రత్యక్షంగా చూశాం. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటూ బొమ్మలు చూపించి ఓట్లేయించుకున్నారు. ఏ గ్రామంలోనూ ఇళ్లు కట్టలేదు. భారాస ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.6వేల కోట్ల వడ్డీ కడుతున్నాం. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం’’ అని పొంగులేటి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                జీరో దందా.. తలో వంద..!
[ 04-11-2025]
ఉమ్మడి నల్గొండ జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులతో పాటు కంకర, ఇసుక నిల్వలను తీసుకెళ్లే వాహన చోదకుల అతివేగానికి అంతే లేకుండా పోయింది. - 
                            
                                
                                పరుగుతీస్తోంది.. అమ్మాయి..!
[ 04-11-2025]
భారత మహిళల జట్టు తొలిసారిగా ప్రపంచకప్ సాధించి.. విశ్వవిజేతగా నిలిచింది. మన క్రీడాకారిణులు చూపిన ప్రతిభ దేశంలోని కోట్లాది అభిమానుల గుండెలో నిలిచింది. - 
                            
                                
                                స్మార్ట్గా వాడేద్దాం!
[ 04-11-2025]
దసరా, దీపావళి పండగల వేళ జిల్లాలో వేల సంఖ్యలో అత్యాధునిక, కొత్త స్మార్ట్ ఫోన్లను యువతీయువకులు కొనుగోలు చేశారు. - 
                            
                                
                                విద్యుత్తుతో జర పైలం
[ 04-11-2025]
వర్షాల నేపథ్యంలో.. విద్యుత్తు ఉపకరణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల గోడలు తడిసిపోవడంతో విద్యుత్తు ప్రమాదాలకు ఆస్కారం ఉంది. కొన్ని ఇళ్లల్లో స్విచ్ఛ్ బోర్డులు, ఫ్యూజులు, మీటర్ల వద్ద తీగలు అస్తవ్యస్తంగా ఉంటాయి. - 
                            
                                
                                లేకపాయె.. ఇంగితజ్ఞానం
[ 04-11-2025]
ఓ వ్యక్తి నలుగురిలో చేయకూడని పని ఏదైనా చేస్తే వెంటనే.. కామన్ సెన్స్ లేదా అని అతడిని కోప్పడతారు. ఇటీవలి కాలంలో కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం అనేక మందిలో కనిపించడం లేదు. - 
                            
                                
                                బస్సు ప్రమాదమా.. బయటపడేదిలా..!
[ 04-11-2025]
ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా సంస్థ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగిన ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. - 
                            
                                
                                మరమ్మతులకు నీళ్లు.. స్నానానికి చన్నీళ్లు
[ 04-11-2025]
కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీ) విద్యార్థినులకు శీతాకాలంలో వేడి నీళ్లు అందించాలనే ఉన్నత ఆశయంతో ప్రభుత్వం సోలార్ వాటర్ హీటర్లు అందజేసింది. ఎనిమిదేళ్ల కిందట వాటిని ప్రతి పాఠశాలలో భవనంపై బిగించారు. - 
                            
                                
                                పట్టుదల ఉంటే.. విజయాలు వెంటే
[ 04-11-2025]
ఆ యువకుడికి చిన్నప్పటి నుంచి ప్రజాసేవ..ప్రజలతో మమేకమయ్యే ఉద్యోగం సాధించడమే లక్ష్యం. - 
                            
                                
                                ఆసనలక్ష్మి
[ 04-11-2025]
కఠినమైన ఆసనాలను అవలీలగా వేస్తూ.. ప్రతి కదలికలో సమతుల్యత పాటిస్తూ అబ్బుర పరుస్తున్నారు సూర్యాపేటకు చెందిన పి.నాగలక్ష్మి. - 
                            
                                
                                సాహితీ ఘని
[ 04-11-2025]
భువనగిరి పట్టణంలోని పహాడినగర్కు చెందిన డాక్టర్ షేక్ అబ్దుల్ ఘని గంజ్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. - 
                            
                                
                                బడిలో..సరిగమలు
[ 04-11-2025]
ఎంపిక చేసిన పీఎంశ్రీ పాఠశాలలకు కేంద్ర ప్రభుత్వం సంగీత, వాయిద్య పరికరాలను ఇదివరకే అందజేసిన విషయం తెలిసిందే. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


