పోయేవారే.. మరి వచ్చేవారేరీ..!
ఆర్టీసీలో గత పదేళ్లుగా నూతన నియామకాలు చేపట్టడం లేదు.దీంతో ఉద్యోగుల సంఖ్య ఏటా భారీగా తగ్గిపోతోంది.
ఆర్టీసీలో పదేళ్లుగా నిలిచిన కొలువుల భర్తీ
మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్
మిర్యాలగూడ పట్టణం, న్యూస్టుడే: ఆర్టీసీలో గత పదేళ్లుగా నూతన నియామకాలు చేపట్టడం లేదు.దీంతో ఉద్యోగుల సంఖ్య ఏటా భారీగా తగ్గిపోతోంది. ఫలితంగా ప్రజలకు మెరుగైన సేవలు అందకపోవడంతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న వారిపై పని ఒత్తిడి పెరుగుతుందని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2013లో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 2015లో సుమారు 3,000 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉండగా.. 2021 నాటికి 2,377 మంది, ప్రస్తుతం 2,005 మంది మాత్రమే ఉన్నారు. ఏటా సుమారు 120 మంది ఉద్యోగ విరమణ చేస్తున్నప్పటికీ నూతన నియామకాలు చేపట్టకపోవడంతో సిబ్బంది సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.
ఉద్యోగులపై ఒత్తిడి..
ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 2021లో 1,227 మంది కండక్టర్లు, 1,150 డ్రైవర్లు ఉండగా..2023లో కండక్టర్లు 1,104 మంది, డ్రైవర్లు 901 మందికి తగ్గారు. రెండేళ్లలో డ్రైవర్లు 249, కండక్టర్లు 123 మంది.. మొత్తమ్మీద 372 మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేశారు. నూతన ఉద్యోగాల నియామకం చేపట్టకపోవడంతో ఉన్న వారిపై పని ఒత్తిడి పెరుగుతుందని కార్మికులు వాపోతున్నారు. అదనపు విధులు, అదనపు పనిగంటలు చేయాల్సి వస్తుండడంతో కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గతేడాది స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రవేశ పెట్టగా పదుల సంఖ్యలో కార్మికులు వీఆర్ఎస్ తీసుకున్నారు. ఒత్తిడి కారణంగా అనేక మంది అనారోగ్యంతో మరణిస్తున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.
భారీగా పెరిగిన అద్దె బస్సులు..
మరో వైపు ఆర్టీసీలో అద్దె బస్సుల హవా నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల్లో ఆర్టీసీ బస్సులతో సమానంగా అద్దె బస్సులు ఉండగా..నార్కట్పల్లి డిపోలో మాత్రం ఆర్టీసీ బస్సులు 3, అద్దె బస్సులు 11 ఉన్నాయి. 2021లో ఆర్టీసీ బస్సుల సంఖ్య 484 ఉండగా..ప్రస్తుతం 387కు తగ్గాయి. దీంతో ప్రయాణికులను చేరవేసేందుకు అద్దె బస్సులే దిక్కయ్యాయి. అయితే అద్దె బస్సుల్లో డ్రైవర్లు ప్రైవేట్ వారే ఉండడంతో ఆర్టీసీ డ్రైవర్లకు విధులు కేటాయించడం కష్టంగా మారింది. దీంతో తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడతారేమోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
100/100
[ 27-07-2024]
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో భాగంగా జాబ్కార్డుదారులకు నూరు రోజుల పనిదినాలు కల్పించడంలో యాదాద్రి జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. -
రామోజీ ఫిల్మ్ సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
హద్దులు చెరిపి.. ఆక్రమించి..!
[ 27-07-2024]
నకిరేకల్ శివారులో 124 కి.మీ వద్ద ఏఎంఆర్పీ ప్రధాన కాల్వ భూమి హద్దురాళ్లను తొలగించి గట్టువెంట పడేశారు. భూమిని ఆక్రమించి సాగుచేసుకుంటున్నారు. -
చెత్తకుప్పలు.. రోగాలతో తిప్పలు
[ 27-07-2024]
పురపాలికల్లో రహదారుల పక్కనే చెత్తాచెదారం దర్శనమిస్తోంది. ఇంటింటా చెత్త సేకరణకు సిబ్బంది ప్రతి వీధిలో వాహనంతో పర్యటించి సేకరణ చేపట్టాల్సి ఉన్నా.. పూర్తిస్థాయిలో సేకరణ జరగడం లేదు. -
బంతే..భవిష్యత్తుగా..!
[ 27-07-2024]
పారిస్ ఒలింపిక్స్ క్రీడా సంగ్రామం మొదలైంది. ఈ పోటీల్లో మన దేశం నుంచి 117 మంది అథ్లెట్స్ పాల్గొంటున్నారు. -
నెలకో తీరు.. హుషారు
[ 27-07-2024]
చిన్నతనం నుంచే పిల్లల్లో మానసిక, శారీరక చురుకుదనం ఉండాలని తల్లిదండ్రులు తపన పడుతుంటారు. రకరకాల తినుబండారాలు, రంగుల బొమ్మలు చేతికిచ్చినా.. ఏదో తెలియని వెలితి వారి మనసును తొలిచేస్తుంటుంది. ఆ వెలితిని ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో పూడ్పించేసుకోవచ్చు. ఇక్కడ చిన్నారుల అభిరుచికి తగ్గట్టుగానే నిత్యం పోషకాహారం అందిస్తారు. ఆడిస్తారు. పాడిస్తారు. -
చేపా.. చేపా... చెరువుకు దూరమేనా..?
[ 27-07-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చెరువుల్లో చేప పిల్లలు వదిలేందుకు గుత్తేదారులు ఎవరూ ముందుకు రావటం లేదు. మత్స్యకారుల జీవనోపాధి కోసం గత సర్కారు ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. -
బావిలోకి దిగి ఊపిరాడక మృతి
[ 27-07-2024]
బావిలోకి మోటారు మరమ్మతుల కోసం దిగిన రైతు మృతి చెందిన ఘటన శుక్రవారం మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో చోటు చేసుకుంది. -
స్వామి కల్యాణం.. అమ్మవారి ఊంజల్ సేవోత్సవం
[ 27-07-2024]
యాదాద్రి పంచనారసింహుల పుణ్యక్షేత్రంలో ఆషాఢమాసం మూడో శుక్రవారం స్వామి, అమ్మవార్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు ఆచారంగా జరిగాయి. -
గోదావరి.. @ గోపీడాన్
[ 27-07-2024]
అమ్మాయిలు కేవలం వంటింటికే పరిమితమయ్యే రోజులు కావివి. అన్నింట్లో సగం, ఆకాశంలో..అవకాశాల్లో సగం అనే నినాదంతో ముందుకెళ్తున్న కాలం ఇది. -
వనాలపై దృష్టి.. సంపద సృష్టి
[ 27-07-2024]
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రకృతి సంపద వనాలు లక్ష్యాలకు చేరువలో ఉన్నాయి. గ్రామ పంచాయతీలకు సంపదను సృష్టించాలనే లక్ష్యంతో వీటిని ఏర్పాటు చేయడానికి సంకల్పించారు. -
బస్తీ.. సైకిల్పై గస్తీ..!
[ 27-07-2024]
గతంలో పోలీస్ కానిస్టేబుళ్లు సైకిళ్లపైనే గస్తీ తిరిగే వారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా దశాబ్దాల నుంచి ద్విచక్రవాహనాలపై తిరుగుతున్నారు.. -
ఏ వీధి చూసినా.. భౌ..భౌ..
[ 27-07-2024]
నాలుగు నెలల క్రితం పహాడీనగర్లో ద్విచక్రవాహనంపై పిల్లలను స్కూల్కు దింపేందుకు వెళ్తున్న వ్యక్తిని కుక్కల గుంపు వెంబడించంది.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల