ఆ రోజు ఆగకుంటే... సాధారణ మృతిగానే మిగిలేది!
అంత్యక్రియలకు ఒక్క రోజు ఆగకపోయి ఉంటే.. ఓ హత్య, సాధారణ మృతిగా మిగిలిపోయేది. అయిదుగురు కలిసి పన్నిన కుట్ర ఎప్పటికీ బహిర్గతం కాకపోయేది.
డాక్టర్ విజయకుమార్ హత్య కేసులో అయిదుగురికి జీవిత ఖైదు
న్యూస్టుడే, నెల్లూరు (నేర విభాగం)
అంత్యక్రియలకు ఒక్క రోజు ఆగకపోయి ఉంటే.. ఓ హత్య, సాధారణ మృతిగా మిగిలిపోయేది. అయిదుగురు కలిసి పన్నిన కుట్ర ఎప్పటికీ బహిర్గతం కాకపోయేది. ఎట్టకేలకు దాన్ని హత్యగా గుర్తించిన న్యాయస్థానం అయిదుగురికి జీవిత ఖైదు విధించింది. జన విజ్ఞాన వేదిక సభ్యులు, నెల్లూరు ఆసుపత్రి అధినేత డాక్టర్ విజయకుమార్ హత్య కేసులో న్యాయస్థానం దాదాపు ఎనిమిదేళ్ల అనంతరం సంచలన తీర్పు వెలువరించింది. ఒకరు, ఇద్దరు కాదు.. ఏకంగా అయిదుగురికి జీవిత ఖైదు.. రూ.అయిదు వేల చొప్పున జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి.సత్యవాణి శుక్రవారం తీర్పు వెలువరించడం సంచలనంగా మారింది.
అసలేం జరిగిందంటే...
2015, మే 28వ తేదీ.. నెల్లూరులోని రాజరాజేశ్వరీ దేవస్థానం సమీప ప్రాంతం.. ఇంటి యజమాని డాక్టర్ విజయకుమార్కు గుండెనొప్పి వచ్చిందంటూ కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని ఇంటికి తరలించి.. అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మలేషియాలో ఉంటున్న విజయకుమార్ కుమార్తె ఇక్కడకు వచ్చేందుకు ఒక రోజు పడుతుందని తెలుసుకున్న కుటుంబ సభ్యులు.. అతి కష్టం మీద అంత్యక్రియలను మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నారు.
హత్యకు సుపారీ రూ.అయిదు లక్షలు
డాక్టర్ విజయకుమార్ హత్యకు ఎం.గంగరాజుతో రూ.అయిదు లక్షలు సుపారీ మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. తొలుత రూ. 30వేలు అడ్వాన్స్గా ఇచ్చినట్లు.. హత్య అనంతరం మిగతా నగదు ఇస్తామని ఒప్పందం జరిగింది. అడ్వాన్స్ ఇచ్చిన అనంతరం గంగరాజు నుంచి ఒత్తిడి పెరగడం.. ఆ క్రమంలోనే హత్య చేసినట్లు తేలింది. కోర్టు శిక్ష వేసిన అయిదుగురిలో భార్య వి.ఉషారాణి, కుమారుడు సుందరయ్య, కె.శ్రీధర్, ఎం.గంగరాజు, పి.రాజ ఉన్నారు.
డాక్టర్ విజయకుమార్ (పాతచిత్రం)
స్నేహితుడి ఫిర్యాదుతో...
విజయకుమార్ స్నేహితుడు.. శేషారెడ్డి తన మిత్రుడి మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ వేదాయపాళెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కేసు అటు పోలీసుశాఖలో, ఇటు రాజకీయంగానూ సంచలనమైంది. నాటి ఎస్పీ గజరావు భూపాల్.. ఈ సంఘటనపై ప్రత్యేక దృష్టిసారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని ఒత్తిడి రాగా- అందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఆ క్రమంలో నాడు పెద్ద కథే నడిచింది. తమ భర్త మృతదేహాన్ని వదిలేయాలంటూ భార్య, మరోవైపు కుమారుడు కన్నీరుమున్నీరవుతూ పోలీసులను వేడుకున్నారు. అంత్యక్రియల కోసం వాహనం కూడా సిద్ధం చేశారు. ఇంతలో ఒక రోజు గడవగానే.. మృతదేహం రంగు మారింది. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఎలాగైనా అంత్యక్రియలు తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో ఎస్పీ అంతిమ యాత్ర ఆపేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాంతో నాటి ఎస్సై జగత్సింగ్.. వాహనం ముందుకు కదిలితే ఒప్పుకొనేది లేదంటూ.. వాహనం ఎదుట భీష్మించారు. నాడు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎట్టకేలకు పోలీసులు ఫోరెన్సిక్ వైద్యుడు శశికాంత్ ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయించారు. డాక్టర్ విజయకుమార్ గుండెనొప్పితో చనిపోలేదని.. హత్యేనని వైద్యులు నిర్ధారించారు. నాటి నుంచి ఈ కేసు చర్చల్లోకి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ పాపం.. పసివాడికి శాపం
[ 27-07-2024]
జగనన్న పాపం.. విద్యార్థికి శాపంగా మారింది. ఉన్నత లక్ష్యాలతో ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్న విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడింది. గత ప్రభుత్వం నాడు- నేడు పనులతో పాఠశాలల్లో మౌలిక వసతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టింది. -
ఖ‘నిజం’.. తేలేనా?
[ 27-07-2024]
వైకాపా ప్రభుత్వంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జరిగిన అక్రమ మైనింగ్పై చర్యలకు రంగం సిద్ధమైంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రకృతి సంపదలైన క్వార్ట్జ్, సిలికా, మైకా ఇతర ఖనిజాలను దోచుకున్నారు. -
ఆక్రమించుకో.. ఇళ్లు నిర్మించుకో!
[ 27-07-2024]
వేగంగా విస్తరిస్తున్న పట్టణాల జాబితాలో కందుకూరు చేరడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎక్కడ ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే అక్కడ ఆక్రమణదారులు వాలిపోతున్నారు -
ఆత్మగౌరవానికి పెద్దపీట
[ 27-07-2024]
సిబ్బందిని కుర్చీలో కూర్చోబెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎస్పీ కృష్ణకాంత్. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 24 మంది సిబ్బందిని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. -
బిట్రగుంటలో పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
బోగోలు మండలం బిట్రగుంట రైల్వేస్టేషన్ యార్డులో మరోసారి గూడ్స్ రైలు వ్యాగిన్ పట్టాలు తప్పింది. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4.45 గంటలకు ఈ ఘటన జరిగింది. -
లింగసముద్రంలో తెదేపా, వైకాపా వర్గీయుల ఘర్షణ
[ 27-07-2024]
స్థానిక మీ సేవ కేంద్రం సమీపంలో ఆర్అండ్బీ రోడ్డు స్థలంలో వైకాపా నాయకుడు నిర్మించిన షెడ్ను తొలగించే విషయంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య శుక్రవారం ఘర్షణ చోటుచేసుకుంది. -
విద్యుత్తు చౌర్యం నేరం
[ 27-07-2024]
విద్యుత్తును దొంగిలించడం చట్టపరంగా నేరమనీ, అటువంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ చీఫ్ జనరల్ మేనేజర్ ఆదిశేషయ్య హెచ్చరించారు. -
అవినీతికి పాల్పడలేదు
[ 27-07-2024]
జొన్నవాడ మల్లికార్జునస్వామి కామాక్షితాయి దేవస్థానంలో శాశ్వతమైన అభివృద్ధి పనులు తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మాజీ ఛైర్మన్ పుట్టా లక్ష్మీసుబ్రహ్మణ్యం నాయుడు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం