Kavitha: నాడు అన్నీ తానై.. నేడు పార్టీకే దూరమై
కవిత సస్పెన్షన్పై భారాస శ్రేణుల్లో చర్చ

ఈనాడు, నిజామాబాద్: ఉమ్మడి జిల్లా నుంచి శాసన మండలికి ప్రాతినిధ్యం వహిస్తున్న కవిత భారాస నుంచి సస్పెండ్ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కొన్నేళ్లుగా గులాబీ శ్రేణులను తనదైన నాయకత్వ పటిమతో ఏకతాటిపై నడిపించిన ఆమె.. అటు తెలంగాణ జాగృతి కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల క్రతువుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్న సమయంలో కవితపై భారాస వేటు వేసింది.
- తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో భారాస కార్యక్రమాల నిర్వహణలో చురుగ్గా వ్యవహరించారు. నేతలు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్పై పూర్తిస్థాయి పట్టు సాధించి పార్టీని ముందుకు నడిపించారు.
 - 2019లో భారాస అభ్యర్థిగా నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత కొంత కాలం పార్టీ శ్రేణులకు దూరంగా ఉన్నారు. కొన్నాళ్లకు మళ్లీ నియోజకవర్గాల్లో పర్యటనలు కొనసాగించారు. రాష్ట్రస్థాయి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు.
 - 2023లో కవితపై లిక్కర్ కేసు నమోదైంది. 2024 మార్చిలో జైలుకు వెళ్లారు. నాలుగు నెలల తర్వాత విడుదలయ్యారు. అప్పటి నుంచి ఉమ్మడి జిల్లా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల, బోధన్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో ఏదో ఒకచోటు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. గతంలో ‘తెలంగాణ జాగృతి’ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ చురుగ్గా ఉండేవారు. తాజా పరిణామాల నేపథ్యంలో ప్రధాన అనుచరులు, అభిమానులు డోలాయమానంలో పడ్డారు. తమ నాయకురాలితో కొనసాగుతారా? భారాసలో ఉండిపోతారా? అనేది వేచిచూడాలి.
 
మెట్టినిల్లు... ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం..
మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత అత్తింటి ఊరు.. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని పొతంగల్. ఈ జిల్లా నుంచే ఎంపీగా గెలిచారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటుపడటంతో 2020 అక్టోబరులో ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కవిత పోటీచేసి గెలుపొందారు. 2021, డిసెంబరులో శాసనమండలి ఎన్నికల్లో ఏకగ్రీవమయ్యారు. 2022, జనవరి 19న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్కు కవిత రాసిన లేఖ మే 23న బహిర్గతం అయ్యింది. ఈ తరుణంలో ఆమె పలువురు పార్టీ నేతలపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామంపై జిల్లాలో భారాస నేతలు పెద్దగా స్పందించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                            
                                
                                ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ఎంపీడీవో గ్రామసభ
[ 03-11-2025]
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు ఇంకా నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో ఎంపీడీవో లలిత కుమారి సోమవారం గ్రామసభలు నిర్వహించారు. - 
                            
                                
                                ఇళ్ల నిర్మాణాలు ఎందుకు చేపట్టడం లేదు?: ఎంపీడీవో
[ 03-11-2025]
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు తప్పనిసరిగా పనులు ప్రారంభించాలని ఎంపీడీవో శ్రీనిధి అన్నారు. - 
                            
                                
                                కారు - ద్విచక్రవాహనం ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
[ 03-11-2025]
కారు- ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. - 
                            
                                
                                అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్టు
[ 03-11-2025]
అంతరాష్ట్ర గంజాయి ముఠాను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు నారాయణపేట జిల్లా ఎస్పీ వెల్లడించారు. - 
                            
                                
                                సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలని నిరసన
[ 03-11-2025]
సెంట్రల్ లైటింగ్, రోడ్డు పనులను వెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని బిచ్కుంద మున్సిపల్ పరిధిలోని యువత డిమాండ్ చేశారు. - 
                            
                                
                                కలెక్టరేట్లో కలకలం.. మహిళ వద్ద పురుగుల మందు
[ 03-11-2025]
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో పోలీసులు తనిఖీ చేయగా ఓ మహిళ వద్ద పురుగుల మందు డబ్బా ఉంది. - 
                            
                                
                                మహిళ క్రికెట్ సూపర్హిట్
[ 03-11-2025]
‘2025 మహిళల వరల్డ్ కప్’లో భారత జట్టు విజయదుందుభి మోగించింది. క్రీడాకారిణులు సెమీస్, ఫైనల్స్లో పోరాడి సాధించిన విజయాలు యువతలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయి. గత కొన్నేళ్లుగా యువతులలో క్రికెట్పై ఆసక్తి పెరుగుతూ వస్తోంది. - 
                            
                                
                                కన్నేస్తే మాయం.. కొనేస్తే ఆగం
[ 03-11-2025]
జిల్లాలో గత పది నెలల్లో ద్విచక్ర వాహన దొంగలు పేట్రేగిపోయారు. దొంగల కన్నుపడితే చాలు, వాహనం మాయమవుతోంది. ఈ ఘటనలు నిజామాబాద్తో పాటు బోధన్, ఆర్మూర్ వంటి పట్టణాల్లో.. - 
                            
                                
                                ఉచిత శిక్షణ.. భవితకు నిచ్చెన
[ 03-11-2025]
బీసీ స్టడీ సర్కిల్.. నిరుద్యోగులకు వరంలా మారింది. శిక్షణతో కొలువుల సాధనకు ప్రోత్సాహం అందిస్తోంది.. యువత ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తోంది.. - 
                            
                                
                                ‘కొత్తలు’ తిన్నారా?
[ 03-11-2025]
‘కొత్త’ పండుగ.. ఇదేంటి అని నేటితరం అనుకోవచ్చు. కానీ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రతి ఏడాది కొత్త తినడం ఆనవాయితీగా వస్తుంది. సాధారణంగా ఖరీఫ్ పంటలు చేతికి వచ్చిన తర్వాత మొదటి సారి. - 
                            
                                
                                మారండి.. ‘జంక్ఫుడ్’ మానండి.. పిల్లల రక్తంలో ఇన్ఫెక్షన్ కేసులు!
[ 03-11-2025]
పిల్లలు మారాం చేయగానే తల్లిదండ్రులు జంక్ఫుడ్ కొని ఇవ్వడం నేడు అలవాటుగా మారింది. ఇలా తినడం పిల్లలకు వ్యసనంలా తయారైంది. కొంత కాలం వరకు ఇది బాగానే ఉన్నా లోలోపల సమస్య ఎక్కువై ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి దారి తీస్తోంది. - 
                            
                                
                                ప్రదక్షిణ చేస్తేనే.. ధ్రువీకరణ
[ 03-11-2025]
పౌరులకు సత్వర, పారదర్శక సేవలు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకొస్తూ పకడ్బందీ చర్యలు చేపడుతున్నా.. క్షేత్రస్థాయి సిబ్బంది అలసత్వంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. - 
                            
                                
                                ఇంట.. ఆరోగ్య పంట
[ 03-11-2025]
మునగకాయ ముట్టుకుంటే మండుతోంది. బెండను చూస్తే గుండె దడే. క్యాలీఫ్లవర్ను కొనాలంటే కాళ్లు వణుకుతున్నాయి. ఏ కూరగాయను కొందామన్నా ధర చూస్తే దిమ్మ తిరుగుతోంది. ఇదీ.. సగటు పట్టణవాసి పరిస్థితి. - 
                            
                                
                                చందాలు వేసి.. చదును చేసి
[ 03-11-2025]
ఇటీవల కురిసిన వర్షాలకు తెవివి దక్షిణ ప్రాంగణంలోని క్రీడా మైదానంలో పొదలు, మొక్కలు మొలిచాయి. ఇక్కడ క్రీడలు ఆడలేని పరిస్థితి. దీంతో ఇక్కడ పరిశుభ్రతా చర్యలు తీసుకోవాలని ప్రాంగణ విద్యార్థులు ఉన్నతాధికారులకు విన్నవించారు. - 
                            
                                
                                పటంలో ఒకలా.. పట్టణంలో మరోలా..!
[ 03-11-2025]
కామారెడ్డి పురపాలికకు సమర్పించే పటాల్లో ఒకలా.. నిర్మాణాలు మరోలా చేపడుతూ కొందరు యజమానులు, వ్యాపారులు యథేచ్ఛగా నిబంధనలకు అతిక్రమిస్తున్నారు. అనుమతులు, నిర్మాణాల సరళిపై పట్టణ ప్రణాళిక విభాగం ఎప్పటికప్పుడు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

కరూర్ తొక్కిసలాట ఘటన..విజయ్ కార్యాలయానికి సీబీఐ
 - 
                        
                            
అభిమాని హత్య కేసు.. దర్శన్, పవిత్రపై నేరాభియోగాలు
 - 
                        
                            

కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. అదరగొట్టిన ‘మంజుమ్మల్ బాయ్స్’.. విజేతలు వీళ్లే
 - 
                        
                            

ఏపీలో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న హిందుజా గ్రూప్!
 - 
                        
                            

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
 - 
                        
                            

క్యూ2 ఫలితాలు.. ఎయిర్టెల్ లాభం డబుల్
 


