దోస్త్కు వేళాయె..!
డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల
తెవివి పరిధిలో 33,630 సీట్లు
న్యూస్టుడే, తెవివి క్యాంపస్: డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దోస్త్(డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. సోమవారం నుంచి తొలి విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో 74 డిగ్రీ కళాశాలల్లో 33,630 సీట్లు అందుబాటులో ఉన్నట్లు వర్సిటీ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశాల కోసం తమ హాల్ టికెట్ నంబరుతో దోస్త్ వెబ్సైట్ https://gg.gov.in లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
మూడు విడతల్లో కేటాయింపులు
డిగ్రీ కళాశాలల్లో మూడు విడతల్లో సీట్ల భర్తీ ప్రక్రియ చేపట్టనున్నారు. విద్యార్థులు రూ.200 రుసుము చెల్లించి రాష్ట్రంలో నచ్చిన కళాశాలలో సీటు కోసం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ నెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. జూన్ 3వ తేదీన తొలి విడత సీట్ల కేటాయింపు జరుగుతుంది. జూన్ 4 నుంచి 10 మధ్యలో సెల్ఫ్ రిపోర్టు చేయాలి.
రూ.400 రుసుముతో రెండో దశ రిజిస్ట్రేషన్ జూన్ 4-13 వరకు చేసుకోవాలి. జూన్ 4-14 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం. జూన్ 18న సీట్ల కేటాయింపు. జూన్ 19-24 మధ్యలో రిపోర్టు చేయాలి.
మూడో దశలో జూన్ 19-25 వరకు రూ.400 రుసుముతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జూన్ 19-25 వరకు వెబ్ ఆప్షన్లు, జూన్ 29న సీట్ల కేటాయింపు, జూన్ 29 నుంచి జులై 3వ తేదీ మధ్యలో సెల్ఫ్ రిపోర్టు చేయాలి.
జూన్ 29 - జులై 5వ తేదీ మధ్యలో డిగ్రీ సీట్లు పొందిన విద్యార్థులంతా ఆయా కళాశాలల్లో రిపోర్టు చేయాలి. జులై 1 నుంచి కళాశాలల్లో పునశ్చరణ జరుగుతుంది. జులై 8వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించనున్నారు.
కొత్త కోర్సులు
డిగ్రీ కోర్సులకు ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఉపాధి అవకాశాలు ముమ్మరంగా కల్పించేందుకు మరికొన్ని కొత్త కోర్సుల ప్రారంభానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి బీ.కామ్ ఫైనాన్స్తో పాటు బీఎస్సీ బయో మెడికల్ సైన్స్, బీఏ స్పెషల్, బీఏ పబ్లిక్ పాలసీ లాంటి నూతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దశదిశలా ప్రగతి సాగాలి
[ 02-06-2024]
ప్రత్యేక రాష్ట్ర సాధన పోరాటంలో ఉమ్మడి నిజామాబాద్ది ప్రత్యేక స్థానం. అభివృద్ధిలోనూ ప్రత్యేక ముద్ర కనిపించినా.. ఆశించిన ఫలితాలు దక్కలేదు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయింది. నేటితో 11వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహించుకుంటోంది. -
ఉద్యమానికి ఊపిరై.. స్వరాష్ట్ర సాధకులై
[ 02-06-2024]
నిజాం చెర నుంచి విముక్తి కోసం జరిగిన విమోచనోద్యమంలో ఇందూరు ప్రస్థానం ప్రత్యేకమైంది. అప్పటి హైదరాబాద్ రాష్ట్రం ఇండియన్ యూనియన్లో విలీనం అయ్యేవరకు ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు వీరులు పోరాట పటిమతో ఉద్యమం చేపట్టారు. -
రాష్ట్ర గీతం సృష్టికి ఇందూరే స్ఫూర్తి
[ 02-06-2024]
రాష్ట్ర గీతంగా గుర్తించడం అందెశ్రీకి దక్కిన గౌరవం. తెలంగాణ తొలిదశ ఉద్యమానికి దాశరథి ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’ ఊపిరిలూదితే.. మలి దశ పోరాటంలో అందరిలో స్ఫూర్తి నింపింది అందెశ్రీ గీతం.. -
తండా రోడ్డు తవ్వేశారు...
[ 02-06-2024]
రైతుల మధ్య ఏర్పడిన పంచాయితీ రోడ్డు తవ్వేయడానికి కారణమైంది. మంచిప్పకు చెందిన ఓ రైతు శివలాల్ తండాకు వెళ్లే రోడ్డును పొక్లెయిన్తో శనివారం తవ్వించేశారు. -
ఉపాధి కల్పిస్తానని మోసం
[ 02-06-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రంలో దక్కన్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ పేరిట విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పి యువతను మోసగించిన ఘటన శనివారం వెలుగుచూసింది. -
డిగ్రీ పరీక్షల్లో ముగ్గురి డిబార్
[ 02-06-2024]
తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో శనివారం జరిగిన డిగ్రీ పరీక్షల్లో నిజామాబాద్లోని ఇందూరు ఉషోదయ, బోధన్లోని ఎస్వీ, ఎల్లారెడ్డి ప్రభుత్వ కళాశాల కేంద్రాల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు చూచిరాతకు పాల్పడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు వర్సిటీ అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. -
అక్రమ కుళాయిలపై కొరడా
[ 02-06-2024]
నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న అక్రమ కుళాయిలపై కొరడా ఝలిపించేందుకు నగరపాలక సంస్థ కమిషనర్ మకరందు రంగం సిద్ధం చేశారు. -
కలెక్టరేట్లో వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు కలెక్టరేట్లో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు ఆదివారం ఉదయం 8.45కు వినాయక్నగర్లోని అమరవీరుల