మానవత్వం చాటుకున్న బస్సు చోదకుడు, కండక్టర్
మల్కాన్గిరి జిల్లా కోరుకొండ సమితి ఎం.వి. 36 గ్రామం కూడలి వద్ద గాయాలతో ఉన్న వృద్ధురాలిని ఆరోగ్య కేంద్రంలో చేర్పించి బస్సు చోదకుడు, కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. వివరాలకు వస్తే...
వృద్ధురాలిని మోసుకెళ్తున్న చోదకుడు, పక్కన కండక్టర్
మల్కాన్గిరి, న్యూస్టుడే: మల్కాన్గిరి జిల్లా కోరుకొండ సమితి ఎం.వి. 36 గ్రామం కూడలి వద్ద గాయాలతో ఉన్న వృద్ధురాలిని ఆరోగ్య కేంద్రంలో చేర్పించి బస్సు చోదకుడు, కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. వివరాలకు వస్తే... ఆదివారం ఉదయం ఎం.వి. 36 గ్రామం ముఖ్య రహదారిపై ఓ పికప్ వ్యాన్, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ద్వి చక్ర వాహనంపై ఉన్న వృద్ధురాలికి గాయాలయ్యాయి. అంబులెన్స్కు సమాచారం ఇచ్చినా రావడానికి ఆలస్యం కావడంతో, బలిమెల నుంచి మల్కాన్గిరికి వెళ్తున్న లక్ష్మీబస్సు చోదకుడు ధన గాదవా, కండక్టర్ శివ ముదులి వృద్ధురాలిని కోరుకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వృద్ధురాలు సదరు సమితి తర్లకోట పంచాయతీ సి.కాలనీకి చెందిన యమున దిశారి (75)గా తెలిసింది. చోదకుడు, కండక్టర్లను పలువురు ప్రశంసించారు.
క్షతగాత్రులను ఆదుకున్న ఐఐసీ
జయపురం, న్యూస్టుడే: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు క్షతగాత్రులను బొరిగుమ్మ ఐఐసీ జుగల్ కిశోర్షా సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. జయపురం- బొరిగుమ్మ జాతీయ రహదారి 26పైన ఆదర్శ్ విద్యాలయం సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు అంబులెన్స్ చోదకుడు ఫోన్ అందుబాటులో లేకపోవటంతో, ఐఐసీ జుగల్ కిశోర్ షాకు సమాచారం ఇచ్చారు. ఆయన సొంత వాహనంలో బాధితులను బొరిగుమ్మ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమించడంతో ఆదివారం జయపురంలోని జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరు జయంతిగిరి పంచాయతీ బహుదూరగూడకు చెందిన గంగాబొత్రగా గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల