బిసంకటక్లో గెలిచేదెవరు?
రాయగడ జిల్లాలో గత 13వ తేదీన ఎన్నికలు జరగ్గా ఓట్ల్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు, అభ్యర్థుల మధ్య ఉత్కంఠ నెలకొంటోంది.
జగన్నాథ్ సరక, నీలమాధవ హికాక, జగన్నాథ నుండ్రుకా, నీలమాధవ ఉలక
గుణుపురం, న్యూస్టుడే: రాయగడ జిల్లాలో గత 13వ తేదీన ఎన్నికలు జరగ్గా ఓట్ల్ల లెక్కింపు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ నాయకులు, అభ్యర్థుల మధ్య ఉత్కంఠ నెలకొంటోంది. అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు ఏయే కేంద్రాల్లో తమకు ఎన్ని ఓట్లు పడ్డాయో లెక్కలేసుకుంటున్నారు. రాయగడ జిల్లాలో అతి ప్రాధాన్యం గల నియోజకవర్గం బిసంకటక్ అని చెప్పాలి. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో బిజద అభ్యర్థిగా జగన్నాథ్ సరక, కాంగ్రెసు నుంచి నీలమాధవ హికాక, భాజపా తరఫున జగన్నాథ్ నుండ్రుకా, రేబల్ కాంగ్రెసు అభ్యర్థిగా నీలమాధవ ఉలక, మరో నలుగురు పోటీ చేశారు. ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు. ఈ నియోజకవర్గం బిజదకు ఛాలెంజ్గా తీసుకున్నారు. మంత్రి జగన్నాథ్ సరకా ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు బిజద తరఫున పోటీ చేసి గెలుపొందడమే కాకుండా, మంత్రిగానూ పనిచేశారు. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారు. రాష్ట్ర బిజద కార్యదర్శి సుధీర్ దాస్ బిజద అభ్యర్థి గెలుపునకు ఎంతగానో కృషి చేశారు.
కాంగ్రెసు తరఫున పోటీ చేస్తున్న నీలమాధవ హికాక గత ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఈ అయిదేళ్లు తన బలాన్ని పెంచుకున్నారు. బిజద అసంతృప్తులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేశారు. ఈ సారి తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో బిజదలో పలు పదవుల్లో కొనసాగిన జగన్నాథ్ నుండ్రుకా ఈ సారి భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున బరిలో నిలిచి గట్టి పోటీ ఇచ్చారనే చెప్పవచ్చు. కమలం గాలులు వీస్తుండడంతో తాను గెలుస్తానని ఆయన అంటున్నారు. మాజీ మంత్రి స్వర్గీయ డొంబురు ధర ఉలక తనయుడు నీలమాధవ ఉలక నాయకులు, కార్యకర్తల మద్దతుతో స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు. ప్రజలు తమవైపు ఉన్నారని తన విజయం తథ్యమని ఉలకా అంటున్నారు. నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారన్నది జూన్ నాలుగు వరకు వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
[ 27-07-2024]
జయపురం - నవరంగ్పూర్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్యే గౌరీ శంకర్ ముఖం శనివారం రవాణాశాఖ మంత్రి విభుంచి భంషత్ చెన్నాను కలిశారు. -
ఐదేళ్లలో 628 మంది దుర్మరణం
[ 27-07-2024]
ఒడిశాలో గజరాజుల దాడిలో గత ఐదేళ్లలో 628 మంది దుర్మరణం చెందారు. -
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి