జగ్దేవ్ అరెస్ట్
ఖుర్దా అసెంబ్లీ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత జగ్దేవ్ను శనివారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రశాంత జగ్దేవ్
భువనేశ్వర్, న్యూస్టుడే: ఖుర్దా అసెంబ్లీ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత జగ్దేవ్ను శనివారం అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్ట్ చేశారు. చిలికా అసెంబ్లీ సిటింగ్ ఎమ్మెల్యే జగ్దేవ్ ఈసారి ఖుర్దా అసెంబ్లీ స్థానానికి భాజపా తరఫున పోటీ చేశారు. శనివారం ఇక్కడ పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. సాయంత్రం బెలగడ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన జగ్దేవ్ ప్రిసైడింగ్ అధికారికి దుర్భాషలాడి వీరంగం సృష్టించినట్లు ఆరోపణలు రాగా, బిజద నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాత్రి దీనిపై ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో జగ్దేవ్ను అరెస్ట్ చేసినట్లు తెలిసింది.
బిజదపై చర్యలు తీసుకోవాలి
మూడోవిడత పోలింగ్లో బిజద నేతలు, కార్యకర్తలు కొందరు వీరంగం సృష్టించారని, వారిపై చర్యలు తీసుకోవాలని భాజపా నాయకత్వం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. పూరీ జిల్లాలోని బ్రహ్మగిరి, ఢెంకనాల్ జిల్లాలోని ఛెండిపద, కటక్ జిల్లా అఠాగఢ్ సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న బిజద అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేశారని, బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రిని కలిసిన ఎమ్మెల్యే
[ 27-07-2024]
జయపురం - నవరంగ్పూర్ రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి ఎమ్మెల్యే గౌరీ శంకర్ ముఖం శనివారం రవాణాశాఖ మంత్రి విభుంచి భంషత్ చెన్నాను కలిశారు. -
ఐదేళ్లలో 628 మంది దుర్మరణం
[ 27-07-2024]
ఒడిశాలో గజరాజుల దాడిలో గత ఐదేళ్లలో 628 మంది దుర్మరణం చెందారు. -
ముంచెత్తిన వాన
[ 27-07-2024]
ఎడతెరిపి లేని వర్షాలకు కొరాపుట్ జిల్లా అతలాకుతలం అయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, పల్లెదారులు బురదమమై, కల్వర్టులు కొట్టుకుపోయి బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. -
భువనేశ్వర్ వద్ద పట్టాలు తప్పిన గూడ్స్
[ 27-07-2024]
భువనేశ్వర్ నుంచి అనుగుల్ జిందాల్ స్టీల్ కర్మాగారానికి సరకు లోడుతో శుక్రవారం ఉదయం 9 గంటలకు బయల్దేరిన గూడ్స్ వాణివిహార్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పింది. -
బెంగాల్లో సమ్మె.. రాష్ట్రంలో ఆలూ కొరత
[ 27-07-2024]
రాష్ట్రంలో ఆలూ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. స్టాకు లేకపోవడంతో వ్యాపారులు ఏకపక్షంగా ధరలు పెంచేశారు. ప్రస్తుతం రూ.50లు పలుకుతుండటంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలు కొనుగోలు చేయలేక పోతున్నారు. -
రాయగడ రైల్వే డివిజన్కు రూ.70కోట్లు
[ 27-07-2024]
రాయగడలో రైల్వే డివిజన్ ఏర్పాటు అంశమై ఆశావాహులకు తీపికబురు లభించింది. దీని కోసం రూ.70కోట్లు నిధులు సమకూరుస్తున్నట్లు రైల్వేమంత్రి ఆశ్వినీ వైష్ణవ్ శుక్రవారం వెల్లడించారు. -
నైపుణ్య శిక్షణ.. జీవనోపాధికి రక్షణ
[ 27-07-2024]
రాష్ట్రంలో 17వేల మందికి పైగా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. -
చిలికాను కాపాడాలని..!
[ 27-07-2024]
రాష్ట్రంలోని గంజాం, పూరీ, ఖుర్దా జిల్లాలకు విస్తరించిన చిలికా సరస్సు నీరు కలుషితమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..