రాయగడ జిల్లా కాంగ్రెస్లో అయోమయం
ప్రస్తుతం ఎన్నికల సందడిలో నాయకులంతా నిమగ్నమై ఉన్నారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
బిజదకుమార్ గమాంగ్(జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు)
దుర్గా ప్రసాద్ పండా(కొరాపుట్ లోకసభ నియోజకవర్గ పీˆసీˆసీˆ ఇన్ఛార్జ్జి)
గుణుపురం, న్యూస్టుడే: ప్రస్తుతం ఎన్నికల సందడిలో నాయకులంతా నిమగ్నమై ఉన్నారు. తమ అభ్యర్థిని గెలిపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాయగడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. దీంతో జిల్లాలోని పార్టీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది బిజయకుమార్ గమాంగ్కు జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించింది. మొదట పార్టీ కార్యక్రమాల్లో కొంత ఉత్సాహంగా కనిపించినా ప్రస్తుతం ఆయన జోరు తగ్గిందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. టికెట్ కోసం బిజయగమాంగ్, ఆయన కుమారుడు అవినాష్ గమాంగ్లతోపాటు ఏడుగురు దరఖాస్తు చేసుకున్నారు. అవినాష్ గమాంగ్కు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధికార ప్రతినిధి హోదా ఇచ్చారు. గుణుపురంలో బిజయగమాంగ్ తమ్ముని కుమారుడు సత్యజిత్ గమాంగ్కు టికెట్ కేటాయించడంతో గమాంగ్ కొంత అసంతృప్తికి గురయ్యారు. అవినాష్ గమాంగ్, బిజయగమాంగ్ సతీమణితోపాటు పలువురు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల రాయగడలో జరిగిన పార్టీ సమావేశానికి బిజయ్ హాజరు కాలేదు. కొరాపుట్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సప్తగిరి ఉలకా గుణుపురం సమితిలో పర్యటించినా ఈయన పాల్గొనలేదు. ఈ విషయమై బిజయ గమాంగ్ వివరణ ఇస్తూ తాను పార్టీకి దూరంగా లేనని, తనకు ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని చెప్పారు. తన కుమారుడి రాజీనామా విషయం వ్యక్తిగతమన్నారు. పీసీసీ కార్యదర్శి, కొరాపుట్ లోకసభ ఇన్ఛార్జి దుర్గా ప్రసాద్ పండాతో మాట్లాడగా తాము ఎప్పుడూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునికి దూరంగా ఉంచాలని ప్రయత్నించలేదన్నారు. ఏఐసీసీ పరిశీలికుడు బిజయగమాంగ్ ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చారని పండా అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకిల్పై వెళ్లి ఓటేసిన కేంద్ర మాజీ మంత్రి
[ 02-06-2024]
పంచాయతీ వార్డు సభ్యుడు కూడా హంగు, ఆర్భాటం ప్రదర్శిస్తున్న ఈ రోజుల్లో కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ సైకిల్పై పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. -
ముగిసిన పోలింగ్
[ 02-06-2024]
రాష్ట్రంలో చివరిదైన నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు శనివారం ప్రధాన ఎన్నికల అధికారి (ఎస్ఈసీ) నికుంజ బిహారీ ధొళో భువనేశ్వర్లో పేర్కొన్నా అక్కడక్కడా స్వల్ప ఘటనలు, కొట్లాటలు జరిగాయి. -
కొరాపుట్ సింహాసనం ఎవరికో?
[ 02-06-2024]
కొరాపుట్ లోక్సభ స్థానం ఫలితాలపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. కొరాపుట్, రాయగడ జిల్లాలకు చెందిన 7 నియోజకవర్గాలతో కూడిన లోక్సభ స్థానంలో 1957 నుంచి 18 సార్లు జరిగిన ఎన్నికల్లో 16 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందడం విశేషం. -
రవుర్కెలాలో 18కి పెరిగిన మృతుల సంఖ్య
[ 02-06-2024]
రవుర్కెలా ఉక్కు నగరంలో వడదెబ్బ మృతుల సంఖ్య 18కి పెరిగింది. శనివారం చికిత్స పొందుతున్న బాధితుల్లో ఆరుగురు తుదిశ్వాస విడిచినట్లు రవుర్కెలా అదనపు కలెక్టరు (ఏడీఎం) అశుతోష్ కులకర్ణి విలేకరులకు చెప్పారు. -
‘పద్మశ్రీ’ మగుణి కన్నుమూత
[ 02-06-2024]
ప్రాచీనమైన తోలుబొమ్మలాటను విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మగుణి చరణ్ కువర్ (88) శనివారం ఉదయం కేంఝర్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. -
కొంచెం తీరిక... పుస్తకాలతో తీరేను బడలిక
[ 02-06-2024]
పూర్వాశ్రమంలో రచయితగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పర్యావరణవేత్త. ఆయన రచించిన పుస్తకాల్లో ‘ది గార్డ్న్ ఆఫ్ లైఫ్’ ఆంగ్ల రచన దేశవిదేశాల్లో పాఠకుల మన్ననందుకుంది. చెట్లు, కాండాలు, బెరళ్లు, లతలు, పుష్పాల్లో ఔషధీయ గుణాలున్నాయని అందులో వివరించారు. -
దోపిడీ ముఠా అరెస్ట్
[ 02-06-2024]
నవరంగపూర్లో జరిగిన చోరీ కేసులో పోలీసులు శనివారం ఓ ముఠాను అరెస్ట్ చేశారు. ఎస్పీ రోహిత్ వర్మా మీడియా సమావేశంలో తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14వ తేదీన సదరు సమితి దంగరబేజి గ్రామంలో సునీల్ సాహు ఇంట్లో చోరీకి యత్నించి విఫలమయ్యారు. -
అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డున పడ్డ కుటుంబం
[ 02-06-2024]
అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కుటుంబం రోడ్డున పడ్డ ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. నందహండి సమితి జడబంద గూడ పంచాయతీ ముదులిగూడ గ్రామానికి చెందిన పద్మన్ బిశోయి ఆవాస్ యోజన ఇల్లు కోసం భార్య కనక పేరిట దరఖాస్తు చేసుకున్నారు. -
పోలింగ్ కేంద్రంలో తమలపాకుల అలంకరణ
[ 02-06-2024]
పూరీ జిల్లా కాకట్పూర్ మోడల్ పోలింగ్ కేంద్రాన్ని తమలపాకులతో అలంకరించారు.