జనసేనలోకి చేరికలు
అరాచక పాలనతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధోగతి పాల్జేశారని పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు.
దిమ్మిడిజోలలో సర్పంచి రజినికి కండువా వేసి ఆహ్వానిస్తున్న జయకృష్ణ, నాయకులు
భామిని, న్యూస్టుడే: అరాచక పాలనతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధోగతి పాల్జేశారని పాలకొండ కూటమి అభ్యర్థి నిమ్మక జయకృష్ణ అన్నారు. శనివారం భామిని మండలం దిమ్మిడిజోలలో ప్రచారం చేశారు. దిమ్మిడిజోల సర్పంచి దంపతులు వలురౌతు రజిని, రామారావుతో పాటు 57 మందికి జయకృష్ణ, కూటమి నాయకులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మణిగ పంచాయతీ సర్పంచి దంపతులు కొండగొర్రి మంగమ్మ, చంటిబాబుతో పాటు 27 మంది జనసేన తీర్థం పుచ్చుకున్నారు. అనంతగిరి, పోలవరం, లోవగూడ, బాలేరు, మనుమకొండలో 70 మంది వైకాపాను వీడి జనసేనలోకి వచ్చారు. అనంతరం వీధుల్లో నాయకులు పాదయాత్ర చేస్తూ ప్రచారం చేశారు. ఎంపీ అభ్యర్థిని కొత్తపల్లి గీత, ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణను గెలిపించాలని కోరారు. జనసేన ఉపాధ్యక్షుడు గర్భాన సత్తిబాబు, నియోజకవర్గ పరిశీలకుడు కలమట సాగర్, కన్వీనర్ నిమ్మల నిబ్రం, తెదేపా మండల అధ్యక్షుడు బి.రవినాయుడు, కార్యదర్శి ఎం.జగదీశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడంచెల భద్రత: ఎస్పీ
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టే జేఎన్టీయూ, లెండీ ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ దీపిక ఎం.పాటిల్ తెలిపారు. -
నీరివ్వలేం.. నిధులివ్వండి
[ 02-06-2024]
ఓ పక్క ఖరీఫ్ సీజన్ ఆసన్నమౌతోంది.. మరోపక్క జలాశయాల పరిధిలోని పంట కాలువలు పూడికలు, పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్నాయి.. మరికొన్ని రోజుల్లో పంటలకు సాగు నీరు అందించాల్సి ఉన్నా.. ఇంతవరకు తట్ట మట్టి కూడా తీయలేదు. -
చట్టంలో ఉచితం.. ఫీజులు చెల్లించాలనడం నిజం..!
[ 02-06-2024]
విద్యాహక్కు చట్టం-2009 అనుసరించి 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలు జరుగుతున్నాయి. -
ఖరీఫ్కు జలగండం
[ 02-06-2024]
భానుడి భగభగలతో జిల్లాలోని నీటి వనరులు అడుగంటుతున్నాయి. ఇప్పటికే చెరువులన్నీ ఎండిపోగా.. జలాశయాల పరిస్థితి ఆ దిశగానే సాగుతోంది. -
సంక్షోభ వసతిగృహాలు..!
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. త్వరలో పాఠశాలలు తెరచుకోనున్నాయి. దూర ప్రాంతాల విద్యార్థులు వసతి గృహాల్లో చేరనున్నారు. -
లెక్కింపులో పొరపాట్లు రానివ్వొద్దు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్ణీత సమయం ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. -
సర్కారుదే పాపం.. పండుటాకులకు శాపం!
[ 02-06-2024]
సంక్షేమానికి పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకొన్న వైకాపా ప్రభుత్వ పెద్దలు సామాజిక పింఛన్ల పంపిణీలో మాత్రం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. -
వర్షంతో ఉపశమనం
[ 02-06-2024]
ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు శుక్రవారం అర్ధరాత్రి గంట సమయం పాటు కురిసిన వర్షం ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. -
గిరిజన గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా
[ 02-06-2024]
మండలంలోని రాయమానుగూడ, లక్కాయిగూడ, దేవనాపురం కుసిమి తదితర గ్రామాల్లో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ ఇమ్మాది శనివారం పర్యటించారు. -
ఎగ్జిట్ పోల్స్తో కూటమిలో జోష్
[ 02-06-2024]
రాష్ట్రంలో అధికారం దక్కేదెవరికి.. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఫలితంపై 18 రోజులుగా ఆయా పార్టీల నాయకులు, శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠకు శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రజామద్దతు ఎవరికో తేల్చేశాయి. -
కీచక హోంగార్డు, స్నేహితుడి అరెస్టు
[ 02-06-2024]
ఇటీవల డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామ సమీపంలో ఒక తోటలో మహిళను అత్యాచారం చేసిన ఘటనలో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన హోంగార్డు రాజ్కుమార్ను, ఇతడికి సహకరించిన ఎం.తమ్మయ్యను దిశా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు.