ఫోన్ చేసుకుంటానంటూ రూ.98 వేలకు బురిడీ
ఫోన్ చేసుకుంటానంటూ చరవాణి తీసుకుని ఓ అపరిచిత వ్యక్తి రూ.98 వేలను వేరే ఖాతాలో తరలించిన సంఘటన కురిచేడులో శుక్రవారం చోటుచేసుకుంది.
నిధులు మళ్లించిన అపరిచిత వ్యక్తి
కురిచేడు, న్యూస్టుడే: ఫోన్ చేసుకుంటానంటూ చరవాణి తీసుకుని ఓ అపరిచిత వ్యక్తి రూ.98 వేలను వేరే ఖాతాలో తరలించిన సంఘటన కురిచేడులో శుక్రవారం చోటుచేసుకుంది. బాధితుడు కాటం కృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కాటంవారిపల్లెకి చెందిన కాటం కృష్ణారెడ్డి నిత్యావసర వస్తువుల దుకాణంతో ఉపాధి పొందుతున్నారు. శుక్రవారం ఉదయం ఓ అపరిచిత వ్యక్తి వచ్చి నిత్యావసర వస్తువులు తీసుకున్నాడు. తన వద్ద నగదు లేదని, స్నేహితుడు ఆన్లైన్లో పంపుతాడని చెప్పి ఓ ఫోన్ నెంబర్ ఇచ్చి దానికి ముందస్తుగా ఓ రూపాయిని ఫోన్ పే చేయమని కోరాడు. దీంతో కృష్ణారెడ్డి తన ఫోన్పే నుంచి ఆ ఖాతాకు ఓ రూపాయి పంపుతుండగా, అపరిచిత వ్యక్తి అతని పాస్వర్డ్ గమనించాడు. తర్వాత ఫోన్ చేసి స్నేహితుడితో మాట్లాడతానంటూ కృష్ణారెడ్డి చరవాణి తీసుకుని ఫోన్పే ద్వారా రూ.98 వేలు వేరే ఖాతాకు మళ్లించాడు. మాయమాటలు చెప్పి వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. అనుమానం వచ్చి కొంతసేపటి తర్వాత కృష్ణారెడ్డి తన ఫోన్పేలో నగదు చూసుకోగా, రూ.98 వేలు వేరే ఖాతాకు మళ్లినట్లు గుర్తించారు. ఆ పరిసరాల్లో పరిశీలించగా అపరిచితుడి జాడ లేకపోవడంతో ఖాతా సంఖ్య ఆధారంగా అతని కోసం ఆరా తీస్తున్నారు. దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాకెవరిస్తారు డబ్బులు!
[ 27-07-2024]
ఎన్నికలంటే ప్రజాస్వామ్యానికి పెద్ద పండగ. ఓటు హక్కు కలిగిన వయోజనులందరూ పాల్గొనే క్రతువు. ఇందుకు ఖర్చూ భారీగానే ఉంటుంది. -
దళితుల భూమిలో వైకాపా గద్ద
[ 27-07-2024]
అధికారమే పెట్టుబడిగా వైకాపా నేతలు చెలరేగిపోయారు. గత అయిదేళ్లపాటు తమ అరాచకాన్ని కొనసాగించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భూములను ఆక్రమించుకున్నారు. -
శాకంబరి.. శరణు శరణు
[ 27-07-2024]
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమిచ్చారు. -
104 మంది ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు రద్దు
[ 27-07-2024]
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఉపాధ్యాయ అక్రమ బదిలీల ఉత్తర్వులను తాజాగా రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. -
కార్గిల్ వీరులారా వందనం
[ 27-07-2024]
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు వదిలిన అమర వీరులకు జిల్లావ్యాప్తంగా శుక్రవారం నివాళి అర్పించారు. -
పేర్లు మారుస్తారే.. పనులు చేయలేరా!
[ 27-07-2024]
‘ఒకరి పేరుపై ఉన్న భూములను నిబంధనలకు విరుద్ధంగా మరొకరి పేరుపై మార్చడం వంటి పనులైతే చేస్తారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
వైకాపా నేత అక్రమ కట్టడాల కూల్చివేతకు ఆదేశాలు
[ 27-07-2024]
గత అయిదేళ్ల పాలనలో ఓ వైకాపా నేత బరి తెగించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం