సాగు చేయాలా వద్దా!
ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే గండ్లు పూడ్చే పనులు ప్రారంభిస్తామని మూడేళ్లుగా జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు.
ఇసుక కాలువ ఆయకట్టు రైతుల మల్లగుల్లాలు
పోలవరం, న్యూస్టుడే
గండికి ఎదురుగా రాళ్లతో నిండిన పొలం
ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. అనుమతులు వచ్చిన వెంటనే గండ్లు పూడ్చే పనులు ప్రారంభిస్తామని మూడేళ్లుగా జలవనరుల శాఖాధికారులు చెబుతున్నారు. ఆ మాటలు వినీవినీ విసిగిపోయిన రైతులు ఏటా గండ్లు తాత్కాలికంగా పూడ్చుకుంటున్నా, కొండవాగుల ఉద్ధృతికి అవి ఎక్కడా ఆగడంలేదు. గతేడాది ఆగస్టు 25న ‘ఖరీఫ్ వ్యవసాయం ఇంతేనా?’, ‘అటు వరద.. ఇటు వాగులు’ శీర్షికలతో ‘ఈనాడు’లో వచ్చిన కథనాలపై కలెక్టర్ ప్రసన్న వెంకటేశ్ స్పందించారు. వెంటనే పరిశీలించి నివేదిక అందజేయాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి రామకృష్ణ, జలవనరుల శాఖ ఎస్ఈ శ్రీనివాసరావు, డ్వామా పీడీ రాంబాబులను ఆదేశించారు. వారు ఆగస్టు 26న వచ్చి చూసి వెళ్లడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. అయితే ఇప్పటి వరకూ పనులు ప్రారంభించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. అధికారులకు చెప్పి ప్రయోజనం ఏమిటి.. తలో రూ.వెయ్యి వేసుకుని తాత్కాలికంగా గండ్లు పూడ్చటమా లేక వ్యవసాయం వదిలి వేయడమా అని తర్జనభర్జనలు పడుతున్నారు.
ప్రతిపాదనలు పంపాం.. ఇసుక కాలువ గండ్ల విషయమై జలవనరుల శాఖ ఈఈ రమేష్బాబును సంప్రదించగా రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేసి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. మరి సమయం దగ్గర పడుతోందన్న విషయాన్ని ప్రస్తావించగా తమ శాఖ పరిధిలో నిధులు లేవన్నారు.
పోలవరం సమీపంలో కుడిగట్టుకు పడిన గండి
మూడు గండ్లు
కొండలపై నుంచి మెత్తప్పకోట, సున్నాలగండి మీదుగా మైదాన ప్రాంతానికి వచ్చి పడే వాగుల ఉద్ధృతికి పోలవరం సమీపంలోని ఇసుక కాలువ కుడిగట్టుకు మూడు చోట్ల గండ్లు పడుతున్నాయి. మూడేళ్లుగా ఏటా ఈ తంతు జరుగుతూనే ఉంది. గతంలో గండ్లు పడిన వెంటనే అధికారులు తాత్కాలికంగా ఇసుక బస్తాలు వేయించి అడ్డుకట్ట వేసేవారు. 2019, 2020లో గండ్లు పూడ్చే పనులకు జలవనరుల శాఖ అధికారులు బిల్లులు చేసినా మంజూరు కాకపోవడంతో ఇక పనులు చేయడం మావల్ల కాదంటూ గుత్తేదారులు చేతులెత్తేశారు. దాంతో గట్టు పక్కనున్న రైతులే ఎంత పటిష్ఠంగా గండ్లు పూడ్చినా, వాగుల ధాటికి ఆగడం లేదు. కారణం గట్టుకు ఆనుకుని ఎడమ వైపు పునరావాస కాలనీలు నిర్మించడంతో వాగు ఉద్ధృతి అంతా కుడిగట్టుపైనే పడుతోందని, అక్కడ కాంక్రీట్ గోడ నిర్మించకపోతే పచ్చని పొలాలు ఎందుకూ పనికి రావని రైతులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆవగింజంత అభివృద్ధి లేదు
[ 27-07-2024]
సాంకేతిక సౌరభాలు వెదజల్లి విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన నూజివీడు ట్రిపుల్ ఐటీకి గత అయిదేళ్లుగా వైకాపా గ్రహణం పట్టింది. -
అత్తిలిలో ఆగేదెప్పుడో
[ 27-07-2024]
రూ. కోట్లు వెచ్చించారు.. చక్కటి భవనాలు, సౌకర్యాలు కల్పించారు. టికెట్ల విక్రయాలు తక్కువగా ఉన్నాయన్న సాకుతో కరోనా సమయంలో అత్తిలి స్టేషన్లో పలు రైళ్ల హాల్ట్ రద్దు చేశారు. -
పట్టణాలకు బీపీఎస్ నిధులు
[ 27-07-2024]
ఉమ్మడి జిల్లాలో పట్టణాలకు దాదాపు అయిదేళ్ల తర్వాత బీపీఎస్ నిధులు విడుదలయ్యాయి. -
తీపి కబురు కోసం ఎదురుచూపులు!
[ 27-07-2024]
వైకాపా పాలనలో ఆకాశాన్నంటిన నిత్యావసరాల ధరలతో పేదలకు పప్పన్నం కూడా కరవైంది. -
స్నాతకోత్సవానికి ముస్తాబు
[ 27-07-2024]
జాతీయ సాంకేతిక విద్యా సంస్థ ఏపీ నిట్ ఆరో స్నాతకోత్సవానికి ముస్తాబవుతోంది. ఆగస్టు 17న కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. -
జలదిగ్బంధంలోనే గ్రామాలు
[ 27-07-2024]
వేలేరుపాడు మండలంలోని మారుమూల కొయిదా, కట్కూరు పంచాయతీల పరిధిలోని పేరంటాలపల్లి, కాకిస్నూరు, టేకుపల్లి, కొయిదా, కాచారం, పూసుగొంది, తాళ్లగొంది, టేకూరు, కట్కూరు, భూరెడ్డిగూడెం, చింతలపాడు, కుంకుడుకొయ్యలపాకలు, ఎర్రతోగు, యడవల్లి గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరణ కాలేదు. -
కొండను తవ్వి.. ఎలుకను పట్టి
[ 27-07-2024]
ముదినేపల్లి మండలంలో గతేడాది జూన్ 19 నుంచి ఈ ఏడాది జూన్ 7 వరకు నిర్వహించిన పనులపై ఇటీవల 16వ విడత సామాజిక తనిఖీ నిర్వహించారు. -
ఇంకెన్నాళ్లీ అవస్థలు
[ 27-07-2024]
కొన్ని దశాబ్దాలుగా కొల్లేరు సరస్సుపై వంతెన నిర్మాణం స్వప్నంగానే మిగిలిపోవడంతో రాకపోకలకు కోమటిలంక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సాధన తోడైతే.. ఎంత బరువైనా తేలికే!
[ 27-07-2024]
ఏలూరు నగరానికి చెందిన పేద, మధ్య తరగతి కుటుంబాల యువతులు వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ చూపుతున్నారు. -
బడికెళ్లాలంటే పడవెక్కాల్సిందే!
[ 27-07-2024]
పాఠశాలల్లో ఉండే వివిధ సమస్యలతో విద్యార్థులు సతమతమవుతుంటే కనకాయలంకకు చెందిన విద్యార్థులు బడికెళ్లే మార్గమే లేక పాట్లు పడుతున్నారు. -
గోదావరి చూపిస్తానంటూ చిన్నారిపై అత్యాచారం !
[ 27-07-2024]
ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ చిన్నారికి గోదావరి వరద చూపిస్తానంటూ నమ్మబలికి వెంట తీసుకెళ్లిన ఆమె సమీప బంధువు.. అనంతరం అత్యాచారానికి పాల్పడిన దారుణం కుక్కునూరు మండలంలోని ఓ గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది.
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు