గ్రామీణంలో పెరిగిన ఇంటర్నెట్ వినియోగం.. ఎంత శాతమంటే?
డిజిటల్ దిశగా దేశం దూసుకెళ్తోంది. మరోవైపు కొవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: డిజిటల్ దిశగా దేశం దూసుకెళ్తోంది. మరోవైపు కొవిడ్ నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం, ఆన్లైన్ విద్యకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్ వాడకం గణనీయంగా పెరిగింది. గడచిన ఏడాది వ్యవధిలోనే గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాల వినియోగం ఏకంగా 400 శాతానికి చేరినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. పల్లెలకూ ఇంటర్నెట్ సేవలు చేరువ చేసేందుకు కేంద్రం ‘భారత్నెట్’ ప్రాజెక్టు చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులోని వైఫై విభాగంలో ఇప్పటికే 13 లక్షలమంది వినియోగదారులు నమోదయ్యారు. ఈ డిసెంబరు నాటికి 20 లక్షల మంది బ్రాడ్బ్యాండ్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు పొందగలరని అధికారవర్గాలు వెల్లడించాయి.
మారుమూలలకూ చేర్చేందుకు..
‘భారత్నెట్’ ప్రాజెక్టులో భాగంగా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు(ఫైబర్ టు హోం), వైఫై హాట్స్పాట్ల ఏర్పాటు, నిర్వహణను ప్రభుత్వ కామన్ సర్వీస్ సెంటర్స్(సీఎస్సీ)లు చూసుకుంటాయి. ఈ ప్రాజెక్టు తొలి విడతలో భాగంగా 1.15 లక్షల పంచాయతీలకు కనెక్షన్లు ఇవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు 98 వేలకు ఇచ్చారు. మరోవైపు ఈ ఏడాది జూన్నాటికి ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న పంచాయతీలు కలిపి 13 వేల టెరాబైట్ల డేటా వినియోగించడం గమనార్హం. 2020లో ఇది ఆరువేల టెరాబైట్లు ఉండగా, 2019లో 300 నుంచి 400 మధ్య ఉంది. ‘గతేడాది మార్చి నుంచి 4.50 లక్షల కొత్త కనెక్షన్లు . ఇందులో 3.25 లక్షల కనెక్షన్లు.. పోలీస్స్టేషన్లు, గ్రామ పంచాయతీలు, తపాలా కార్యాలయాలు, అంగన్వాడీలు, రేషన్ దుకాణాలు, ఆసుపత్రులు తదితర ప్రభుత్వ సంస్థలకు ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ ఆవశ్యకత, అవసరాన్ని ఈ గణాంకాలు స్పష్టంగా సూచిస్తున్నాయి. విద్య, ఇతర సమాచారాన్నీ అభివృద్ధి చేస్తే మరింత డిజిటల్ సాధికారత సాధించవచ్చని సీఎస్సీ ఈ-గవర్నెన్స్ సంస్థ సీఈవో దినేష్ త్యాగి అభిప్రాయపడ్డారు. మొబైల్ డేటా కనెక్షన్లకు ఉద్దేశించిన ‘సీఎస్సీ వైఫై చౌపల్’కూ 13 లక్షల మంది వినియోగదారులున్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి శనివారం బాధ్యతలు స్వీకరించారు. -
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందని అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్రెడ్డి తెలిపారు. -
భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు 52.1 అడుగుకు చేరుకుంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ను పెంచుతూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. -
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
నీతి ఆయోగ్ సమావేశం రాష్ట్రపతి భవన్లో ప్రారంభమైంది. వికసిత్ భారత్-2047 అజెండాగా జరిగే ఈ భేటీలో ఏపీ అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించనున్నారు. -
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
మదనల్లె సబ్కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసుపై విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో ఆరో రోజు విచారణ చేపట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు