కరుణ రసం: ట్రంప్లో కొత్తకోణం..!
‘థాంక్స్ గివింగ్స్ డే’ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు ట్రంప్ క్షమాభిక్షను పెడితే అందరూ ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు.. కానీ, ఆ తర్వాత కూడా ఆయన క్షమాభిక్షల పరంపరను కొనసాగిస్తున్నారు..తన పదవీకాలం ముగింపు గడువు దగ్గరపడుతుండటంతో
క్షమాభిక్షల వర్షం..
రెండు రోజుల్లో 41 మందికి దర్యాప్తుల నుంచి ముక్తి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘థాంక్స్ గివింగ్ డే’ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్షమాభిక్ష పెడితే అందరూ ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు.. కానీ, ఆ తర్వాత కూడా ఆయన క్షమాభిక్షల పరంపరను కొనసాగిస్తున్నారు.
తన పదవీకాలం ముగింపు గడువు దగ్గరపడుతుండటంతో ఆయనలో కరుణ రసం పొంగిపొర్లుతోంది. దీంతో రెండు రోజుల్లో 41 మందికి క్షమాభిక్షలు ప్రసాదించారు. వైట్హౌస్ను వీడేలోపు ఇల్లు చక్కదిద్దుకొనే పనిలో పడ్డారు. తన ఆప్తులు.. సొంతపార్టీ వ్యక్తులు, అనుచరులు.. కుటుంబ సభ్యులకు వరుసగా క్షమాభిక్షలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఈ జాబితాలో రష్యన్ గేట్ అనుమానితులు.. యుద్ధ నేరాలకు పాల్పడిన వారు.. ఇవాంక ట్రంప్ మామ వంటి వారు ఉన్నారు. ట్రంప్ వ్యవహారశైలితో.. అధ్యక్షుడి క్షమాభిక్ష అధికారంపై అమెరికాలో చర్చకు తెరలేచింది.
అసలు ఈ క్షమాభిక్షల అధికారం ఏమిటీ..?
అమెరికా చట్టాలను అతిక్రమించిన వారిని, దేశంలో నేరాలు చేసిన వారిని క్షమించే అధికారం ఆ దేశాధ్యక్షుడికి ఉంది. ఈ విషయాన్ని అక్కడి సుప్రీం కోర్టు కూడా ధ్రువీకరించింది. ఈ విషయంలో అమెరికా కాంగ్రెస్ కూడా ఆయన్ను ఏమీ చేయలేదు. ఈ విషయంలో అధ్యక్షుడు ఎవరికీ జవాబుదారీగా ఉండరు. కనీసం కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదు.
అభిసంశనకు గురైన అధికారులు మాత్రం ఈ క్షమాభిక్షకు అనర్హులు. అమెరికాలో ఫెడరల్ చట్టాల పరిధిలో నేరాలకు క్షమాభిక్ష ఇవ్వొచ్చు కానీ.. అక్కడి రాష్ట్రాల పరిధిలోని చట్టాల్లో ప్రస్తావించిన నేరాలకు పాల్పడిన వారికి మాత్రం వర్తించదు.
ఇప్పుడే ఈ హడావుడి ఎందుకు..?
2016 ఎన్నికల్లో ఓటమికి రష్యన్లు ట్రంప్నకు సాయం చేశారని డెమొక్రాట్లు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో బైడెన్ అధికారం చేపట్టగానే ‘రష్యా జోక్యం’పై విచారణను వేగవంతం చేస్తారన్నది ట్రంప్ అనుమానం. ఇది నిజమైతే ఆయన మాజీ సలహాదారు రోజర్ స్టోన్, ప్రచార విభాగం అధ్యక్షుడు పాల్ మ్యాన్ఫోర్ట్ వంటి వారితో పాటు.. తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జరేడ్ కుష్నెర్ వంటి వారిపై దర్యాప్తులు వేగవంతమవుతాయి. అంతిమంగా అవి తన దాకా వస్తాయని ట్రంప్ భయపడుతున్నారు. అంతే కాదు పిల్లలు ఎరిక్ ట్రంప్, ఇవాంక ట్రంప్లతో పాటు.. తన న్యాయసలహాదారుడు రూడీ గులియాని వంటి వారిని బైడెన్ సర్కార్ లక్ష్యాంగా చేసుకుంటుందని భయపడుతున్నారు. ఇప్పటికే మెన్ఫోర్ట్, స్టోన్లతోపాటు అల్లుడు కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్కు కూడా క్షమాభిక్షను ఇచ్చేశారు. బ్లాక్ వాటర్స్ అనే అమెరికా కిరాయి సైన్యంలోని సభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ముందస్తు క్షమాభిక్షలు కూడా..!
ఇక ట్రంప్ ముందస్తుగా కూడా కొందరికి క్షమాభిక్షలను ఇవ్వాలనుకుంటున్నారు. సాధారణంగా కొనసాగుతున్న దర్యాప్తులు, నేర నిరూపణ తర్వాత క్షమాభిక్షలను మంజూరు చేస్తారు. కేసులు నమోదుకానీ నేరాలపై కూడా ముందుస్తుగా క్షమాభిక్షను మంజూరు చేయవచ్చు. దీనిని అమెరికా సుప్రీం కోర్టు 1866లో ధ్రువీకరించింది. రిచర్డ్ నిక్సన్ తన పదవీ కాలంలో పాల్పడిన నేరాలన్నిటికీ ఆయన వారసుడైన 38వ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ నుంచి ముందస్తు క్షమాభిక్షను పొందాడు. వాటర్గేట్ కుంభకోణంలో నిక్సన్ పేరు వచ్చిన విషయం తెలిసిందే. తన కుటుంబీకులకు ట్రంప్ ఇటువంటి క్షమాభిక్షలను ఇచ్చే అవకాశం ఉంది.
గతంలో అధ్యక్షులు చేయలేదా..?
రాజకీయాల్లో బంధుప్రీతికి అమెరికా కూడా మినహాయింపేమీ కాదు. 2001లో కొకైన్ వినియోగించిన కేసులో నేరనిరూపణ అయిన తన సోదరుడు రోజర్కు నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ క్షమాభిక్షను మంజూరు చేశారు. ట్రంప్తో పోలిస్తే క్లింటన్ ఎక్కువ మందికి క్షమాభిక్షను పెట్టారు. మొత్తం 450 మంది ఆయన నుంచి క్షమాభిక్షను పొందారు. వీరిలో డెమొక్రటిక్ పార్టీకి చందాలు ఇచ్చే మార్క్ రిచ్ కూడా ఉన్నారు. ఆయన పన్ను ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
* వియత్నాం-అమెరికా యుద్ధ సమయంలో తప్పనిసరిగా మిలటరీ సర్వీసు చేయాలనే నిబంధనను ఉల్లంఘించిన వేలాది మందికి 1977లో అధ్యక్షుడు జిమ్మీకార్టర్ ముందస్తు క్షమాభిక్షను మంజూరు చేశారు.
స్వీయ క్షమాభిక్షపై ట్రంప్ దృష్టి..!
2018లో ట్రంప్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘నన్ను నేను క్షమించుకొనే హక్కు ఉంది’ అని వాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్రచర్చకు దారితీశాయి. ఏ వ్యక్తి తన కేసుకు తానే తీర్పు చెప్పుకోకూడదనే సూత్రానికి ఇది విరుద్ధమని వాదించారు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా స్వీయ క్షమాభిక్షకు ప్రయత్నించలేదు. ఇప్పుడు అది నిజం అయ్యే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితమే తన న్యాయసలహాదారు రూడీ గులియానీతో ఈ విషయమై చర్చించారు. దీనిపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. ఈ విషయాన్ని టైమ్స్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇదే సమయంలో ట్రంప్ జూనియర్, ఎరిక్, ఇవాంకల క్షమాభిక్ష వ్యవహారాన్ని కూడా చర్చించారు. స్వీయ క్షమాభిక్ష వ్యవహారం మరో న్యాయ పోరాటానికి దారీతీసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు.. ఫెడరల్ చట్టాల నుంచి ట్రంప్ తప్పించుకొన్నా.. అమెరికా రాష్ట్రాల చట్టాలు ఆయన్ను వెంటాడే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల