కరుణ రసం: ట్రంప్లో కొత్తకోణం..!
‘థాంక్స్ గివింగ్స్ డే’ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు ట్రంప్ క్షమాభిక్షను పెడితే అందరూ ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు.. కానీ, ఆ తర్వాత కూడా ఆయన క్షమాభిక్షల పరంపరను కొనసాగిస్తున్నారు..తన పదవీకాలం ముగింపు గడువు దగ్గరపడుతుండటంతో
క్షమాభిక్షల వర్షం..
రెండు రోజుల్లో 41 మందికి దర్యాప్తుల నుంచి ముక్తి
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘థాంక్స్ గివింగ్ డే’ సందర్భంగా రెండు టర్కీ కోళ్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్షమాభిక్ష పెడితే అందరూ ఆ దృశ్యాన్ని చూసి ముచ్చటపడ్డారు.. కానీ, ఆ తర్వాత కూడా ఆయన క్షమాభిక్షల పరంపరను కొనసాగిస్తున్నారు.
తన పదవీకాలం ముగింపు గడువు దగ్గరపడుతుండటంతో ఆయనలో కరుణ రసం పొంగిపొర్లుతోంది. దీంతో రెండు రోజుల్లో 41 మందికి క్షమాభిక్షలు ప్రసాదించారు. వైట్హౌస్ను వీడేలోపు ఇల్లు చక్కదిద్దుకొనే పనిలో పడ్డారు. తన ఆప్తులు.. సొంతపార్టీ వ్యక్తులు, అనుచరులు.. కుటుంబ సభ్యులకు వరుసగా క్షమాభిక్షలు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఈ జాబితాలో రష్యన్ గేట్ అనుమానితులు.. యుద్ధ నేరాలకు పాల్పడిన వారు.. ఇవాంక ట్రంప్ మామ వంటి వారు ఉన్నారు. ట్రంప్ వ్యవహారశైలితో.. అధ్యక్షుడి క్షమాభిక్ష అధికారంపై అమెరికాలో చర్చకు తెరలేచింది.
అసలు ఈ క్షమాభిక్షల అధికారం ఏమిటీ..?
అమెరికా చట్టాలను అతిక్రమించిన వారిని, దేశంలో నేరాలు చేసిన వారిని క్షమించే అధికారం ఆ దేశాధ్యక్షుడికి ఉంది. ఈ విషయాన్ని అక్కడి సుప్రీం కోర్టు కూడా ధ్రువీకరించింది. ఈ విషయంలో అమెరికా కాంగ్రెస్ కూడా ఆయన్ను ఏమీ చేయలేదు. ఈ విషయంలో అధ్యక్షుడు ఎవరికీ జవాబుదారీగా ఉండరు. కనీసం కారణం కూడా చెప్పాల్సిన అవసరం లేదు.
అభిసంశనకు గురైన అధికారులు మాత్రం ఈ క్షమాభిక్షకు అనర్హులు. అమెరికాలో ఫెడరల్ చట్టాల పరిధిలో నేరాలకు క్షమాభిక్ష ఇవ్వొచ్చు కానీ.. అక్కడి రాష్ట్రాల పరిధిలోని చట్టాల్లో ప్రస్తావించిన నేరాలకు పాల్పడిన వారికి మాత్రం వర్తించదు.
ఇప్పుడే ఈ హడావుడి ఎందుకు..?
2016 ఎన్నికల్లో ఓటమికి రష్యన్లు ట్రంప్నకు సాయం చేశారని డెమొక్రాట్లు బలంగా విశ్వసిస్తున్నారు. దీంతో బైడెన్ అధికారం చేపట్టగానే ‘రష్యా జోక్యం’పై విచారణను వేగవంతం చేస్తారన్నది ట్రంప్ అనుమానం. ఇది నిజమైతే ఆయన మాజీ సలహాదారు రోజర్ స్టోన్, ప్రచార విభాగం అధ్యక్షుడు పాల్ మ్యాన్ఫోర్ట్ వంటి వారితో పాటు.. తన పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జరేడ్ కుష్నెర్ వంటి వారిపై దర్యాప్తులు వేగవంతమవుతాయి. అంతిమంగా అవి తన దాకా వస్తాయని ట్రంప్ భయపడుతున్నారు. అంతే కాదు పిల్లలు ఎరిక్ ట్రంప్, ఇవాంక ట్రంప్లతో పాటు.. తన న్యాయసలహాదారుడు రూడీ గులియాని వంటి వారిని బైడెన్ సర్కార్ లక్ష్యాంగా చేసుకుంటుందని భయపడుతున్నారు. ఇప్పటికే మెన్ఫోర్ట్, స్టోన్లతోపాటు అల్లుడు కుష్నెర్ తండ్రి చార్లెస్ కుష్నెర్కు కూడా క్షమాభిక్షను ఇచ్చేశారు. బ్లాక్ వాటర్స్ అనే అమెరికా కిరాయి సైన్యంలోని సభ్యులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.
ముందస్తు క్షమాభిక్షలు కూడా..!
ఇక ట్రంప్ ముందస్తుగా కూడా కొందరికి క్షమాభిక్షలను ఇవ్వాలనుకుంటున్నారు. సాధారణంగా కొనసాగుతున్న దర్యాప్తులు, నేర నిరూపణ తర్వాత క్షమాభిక్షలను మంజూరు చేస్తారు. కేసులు నమోదుకానీ నేరాలపై కూడా ముందుస్తుగా క్షమాభిక్షను మంజూరు చేయవచ్చు. దీనిని అమెరికా సుప్రీం కోర్టు 1866లో ధ్రువీకరించింది. రిచర్డ్ నిక్సన్ తన పదవీ కాలంలో పాల్పడిన నేరాలన్నిటికీ ఆయన వారసుడైన 38వ అధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ నుంచి ముందస్తు క్షమాభిక్షను పొందాడు. వాటర్గేట్ కుంభకోణంలో నిక్సన్ పేరు వచ్చిన విషయం తెలిసిందే. తన కుటుంబీకులకు ట్రంప్ ఇటువంటి క్షమాభిక్షలను ఇచ్చే అవకాశం ఉంది.
గతంలో అధ్యక్షులు చేయలేదా..?
రాజకీయాల్లో బంధుప్రీతికి అమెరికా కూడా మినహాయింపేమీ కాదు. 2001లో కొకైన్ వినియోగించిన కేసులో నేరనిరూపణ అయిన తన సోదరుడు రోజర్కు నాటి అధ్యక్షుడు బిల్ క్లింటన్ క్షమాభిక్షను మంజూరు చేశారు. ట్రంప్తో పోలిస్తే క్లింటన్ ఎక్కువ మందికి క్షమాభిక్షను పెట్టారు. మొత్తం 450 మంది ఆయన నుంచి క్షమాభిక్షను పొందారు. వీరిలో డెమొక్రటిక్ పార్టీకి చందాలు ఇచ్చే మార్క్ రిచ్ కూడా ఉన్నారు. ఆయన పన్ను ఎగవేత కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
* వియత్నాం-అమెరికా యుద్ధ సమయంలో తప్పనిసరిగా మిలటరీ సర్వీసు చేయాలనే నిబంధనను ఉల్లంఘించిన వేలాది మందికి 1977లో అధ్యక్షుడు జిమ్మీకార్టర్ ముందస్తు క్షమాభిక్షను మంజూరు చేశారు.
స్వీయ క్షమాభిక్షపై ట్రంప్ దృష్టి..!
2018లో ట్రంప్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. ‘నన్ను నేను క్షమించుకొనే హక్కు ఉంది’ అని వాఖ్యానించారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు తీవ్రచర్చకు దారితీశాయి. ఏ వ్యక్తి తన కేసుకు తానే తీర్పు చెప్పుకోకూడదనే సూత్రానికి ఇది విరుద్ధమని వాదించారు. గతంలో ఏ అధ్యక్షుడు కూడా స్వీయ క్షమాభిక్షకు ప్రయత్నించలేదు. ఇప్పుడు అది నిజం అయ్యే అవకాశం ఉంది. కొన్నాళ్ల క్రితమే తన న్యాయసలహాదారు రూడీ గులియానీతో ఈ విషయమై చర్చించారు. దీనిపై భిన్నాభిప్రాయలు ఉన్నాయి. ఈ విషయాన్ని టైమ్స్ పత్రిక వెలుగులోకి తెచ్చింది. ఇదే సమయంలో ట్రంప్ జూనియర్, ఎరిక్, ఇవాంకల క్షమాభిక్ష వ్యవహారాన్ని కూడా చర్చించారు. స్వీయ క్షమాభిక్ష వ్యవహారం మరో న్యాయ పోరాటానికి దారీతీసే అవకాశం కూడా ఉంది. అంతేకాదు.. ఫెడరల్ చట్టాల నుంచి ట్రంప్ తప్పించుకొన్నా.. అమెరికా రాష్ట్రాల చట్టాలు ఆయన్ను వెంటాడే అవకాశం ఉంది.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM