NEET UG: నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
61 నుంచి 17కు తగ్గిన టాపర్ల సంఖ్య

దిల్లీ: పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. గతంలో వెల్లడించిన మార్కులతో 61 మంది టాపర్లుగా నిలవగా, సవరించిన మార్కులతో ఆ సంఖ్య 17కు తగ్గింది. మరోవైపు వేల మంది విద్యార్థుల మార్కులు, ర్యాంకుల్లో గణనీయమైన మార్పు కనిపించింది. అర్హత సాధించిన వారి సంఖ్య, కటాఫ్ మార్కులు స్వల్పంగా తగ్గాయి. ఫిజిక్స్ సబ్జెక్టులో ఓ ప్రశ్నకు సంబంధించిన జవాబుపై వివాదం నెలకొన్న నేపథ్యంలో సరైన సమాధానాన్ని సూచించేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. అది సూచించిన జవాబును పరిగణనలోకి తీసుకొని మళ్లీ మూల్యాంకనం చేసి తాజాగా ఫలితాలను విడుదల చేశారు. ఈ క్రమంలో 4,20,000 మంది విద్యార్థుల మార్కులు 5 పాయింట్ల మేర తగ్గాయి. వారిలో 720కి 720 మార్కులు సాధించిన 61 మంది విద్యార్థుల్లోని 44 మంది కూడా ఉన్నారు. ఇది వారి ర్యాంకులపై ఏ మేర ప్రభావం చూపుతుందన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తొలి 100 మందిలో నిలిచినవారిలో ఆరుగురికి 716 మార్కులు రాగా, 77 మందికి 715 మార్కులు వచ్చాయి. 13,15,853 మంది క్వాలిఫై కాగా, గత జాబితాతో పోలిస్తే 415 మంది అర్హత సాధించలేకపోయారు. తాజా ఫలితాల్లో జనరల్, ఆర్థికంగా బలహీన వర్గాలకు కటాఫ్ 720-162 మధ్య ఉండగా, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 161-127 మధ్య ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


