కశ్మీర్లోకి టర్కీ విషం..!
పాకిస్థాన్ కొత్త ఆప్త మిత్ర దేశం టర్కీ.. ఇప్పుడు కశ్మీర్లో నేరుగా తలదూర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశంపై వ్యాఖ్యలు చేసి భారత్ నుంచి హెచ్చరికలను అందుకొంది. తాజాగా సిరియా నుంచి కిరాయి ఉగ్రమూకను కశ్మీర్లోకి తరలించాలని కుట్రలు పన్నుతోంది.
* బయటపెట్టిన గ్రీకు పత్రిక
* భారత్ దెబ్బకు నిస్సహాయ స్థితికి పాక్ ఉగ్రసంస్థలు
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పాకిస్థాన్ కొత్త ఆప్త మిత్ర దేశం టర్కీ.. ఇప్పుడు కశ్మీర్లో నేరుగా తలదూర్చేందుకు ప్రయత్నాలు మొదలుపెడుతోంది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశంపై వ్యాఖ్యలు చేసి భారత్ నుంచి హెచ్చరికలను అందుకొంది. తాజాగా సిరియా నుంచి కిరాయి ఉగ్రమూకను కశ్మీర్లోకి తరలించాలని కుట్రలు పన్నుతోంది. ఈ విషయాన్ని గ్రీకు జర్నలిస్టు ఆండ్రెస్ మౌంటుజోర్లియస్ తన కథనంలో పేర్కొన్నాడు. పెంటపోస్టగ్మా అనే గ్రీకు పత్రిక ఈ మేరకు విస్తృత కథనాన్ని ప్రచురించింది. ఇది ఇప్పుడు సంచలనం రేపుతోంది. దక్షిణాసియాలో పరపతి పెంచుకొని సౌదీ అరేబియాను సవాల్ చేయాలన్నది టర్కీ పన్నాగంగా దీనిలో వెల్లడించారు. ఇందుకు కశ్మీర్ను పావుగా వాడుకోవడానికి సిద్ధమవుతోంది. కొన్నాళ్ల క్రితం అజర్ బైజన్- అర్మేనియా యుద్ధంలో పాల్గొనేందుకు కిరాయి మూకలను పాక్, టర్కీలు ఉసిగొల్పిన విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. కశ్మీర్లో ఉగ్రవాదులను రాష్ట్రీయ రైఫిల్స్ ఏరివేయడం.. బీఎస్ఎఫ్ సరిహద్దులను బిగించడంతో పాక్ మూకలకు పాలుపోవడంలేదు.
సులేమానీ షా బ్రిగేడ్కు అప్పగింత..?
కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచే పనిని సులేమానీ షా బ్రిగేడ్కు అప్పగించినట్లు గ్రీకు పత్రిక పేర్కొంది. ఈ బ్రిగేడ్ సిరియన్ నేషనల్ ఆర్మీలో పనిచేసిందని వెల్లడించింది. దీని నాయకుడు అబూ ఎమ్సా ఐదు రోజుల క్రితమే ఆఫ్రిన్లో తన బృంద సభ్యులతో సమావేశమై కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచాలనే టర్కీ లక్ష్యాన్ని వెల్లడించినట్లు ఈ పత్రిక పేర్కొంది. కిరాయి బృందంలో ఒక్కోరికి 2వేల డాలర్లు ఇస్తారని అబు వెల్లడించాడు. కశ్మీర్ కూడా కరభాకు వలే పర్వత ప్రాంతమని పేర్కొన్నాడు. అంతేకాదు.. కశ్మీర్ వెళ్లాలనుకునేవారి పేర్లను టర్కీ అధికారులు నమోదు చేసుకొన్నారని ఆ పత్రిక వెల్లడించింది. ఇలాంటి కార్యక్రమాలనే ఎజాజ్, గెరాబ్లుస్, బప్, అఫ్రిన్,ఇడ్లిబ్ ప్రాంతాల్లో నిర్వహించారని పేర్కొంది. ఈ కథనాన్ని దిల్లీలోని టర్కీ రాయబారి ఓజ్కాన్ ట్రోన్లర్ ఖండించారు. గ్రీకు పత్రిక ఆధార రహిత కథనం ప్రచురించిందని పేర్కొన్నారు.
జైషేకు ‘సరుకు’ పంపిణీ కష్టమైంది..
కశ్మీర్ సరిహద్దులను పూర్తిగా మూసివేయడం.. సరిహద్దు వాణిజ్యాన్ని ఆపివేయడం.. సెన్సర్లు, కెమెరాలు ఇతర నిఘా సాధనాల వినియోగాన్ని బలగాలు గణనీయంగా పెంచాయి. దీంతో పాక్ నుంచి ఆయుధ సరఫరా కష్టంగా మారిపోయింది. ఇటీవల జమ్ము నగ్రోటా టోల్ ప్లాజ వద్ద ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఆ తర్వాత జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ రవూఫ్ అష్గర్ కశ్మీర్లోని తమ శ్రేణులకు పంపిన ఓ సందేశం బయటకు పొక్కింది. దీనిలో ‘వస్తువులు’ పంపడం కష్టంగా మారింది అని పేర్కొన్నాడు. జైషే చీఫ్ మసూద్ అజర్కు అష్గర్ చిన్నతమ్ముడు. మసూద్ చికిత్స చేయించుకుంటుండటంతో.. ఇప్పుడు జైషేకు అష్గర్ అనధికారిక చీఫ్గా వ్యవహరిస్తున్నాడు.
చైనా డ్రోన్లు వినియోగం..
ఆయుధ రవాణాకు పాక్ డ్రోన్లను వినియోగించడం మొదలుపెట్టింది. చైనాలో తయారైన పెద్ద డ్రోన్లను వినియోగించడం ప్రారంభించింది. పంజాబ్, జమ్మూకశ్మీర్ ప్రాంతాల్లో వీటి సంచారం గణనీయంగా పెరిగినట్లు సమాచారం. కశ్మీర్లో పర్వత ప్రాంతాలు ఎక్కువగా ఉండటంతో ఆయుధాలను డ్రోన్ల ద్వారా పంజాబ్ ప్రాంతంలో జారవిడిచి.. అక్కడి నుంచి కశ్మీర్కు తరలిస్తున్నారు. డ్రోన్లతో దాడులు చేసే అంశాలను కూడా పాక్ ఐఎస్ఐ ఏప్రిల్లో లష్కరే , జైషే కమాండర్లతో చర్చించింది. అక్టోబర్లో ఇలాంటి డ్రోన్లను భారత్ కూల్చింది.
సొరంగాలు తవ్వుకొని..
నవంబర్ 19న భారత్లో ప్రవేశించిన ఉగ్రవాదులు కంచెను తెంచుకొని రాలేదు. పకడ్బందీగా తవ్విన ఓ 200 మీటర్ల సొరంగంలో నుంచి భారత్లోకి అడుగు పెట్టారు. సరిహద్దుల వెంట సొరంగాలు కొత్తేమీ కాదు. కానీ.. ఇటీవల కాలంలో మాత్రం వీటి వినియోగం పెరిగిపోయింది. ఇటీవల ఎన్కౌంటర్ సమయంలో స్వాధీనం చేసుకొన్న 11 ఏకే7 తుపాకులను ఈ మార్గంలో తరలించారు. దీంతోపాటు ఎటువంటి కవ్వింపు చర్య లేకుండా పాక్ వైపు కాల్పులు మొదలయ్యాయంటే చొరబాట్లకు ప్రయత్నాలు జరుగుతున్నట్లే అన్న విషయం భద్రతా దళాలు గుర్తించాయి. ముజఫరాబాద్లో లష్కరే క్యాంపులు, ఖైబర్ కనుమల్లో హిజ్బుల్ ముజాహుద్దీన్ మూకలకు శిక్షణ ఇస్తున్నారు. దీంతో మరో ఉగ్రసంస్థ అల్ బదర్ మాత్రం బంగ్లాదేశ్ మార్గంలో భారత్లోకి చొరబడాలనే పన్నాగాలు పన్నుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల