శీతాకాలంలో చైనా సరిహద్దులు భగభగ..!
భారత్-చైనా మధ్య ఎల్ఏసీ వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. అక్టోబర్ 12 నుంచి ఇరు దేశాల సైనిక కమాండర్లు ఏడో సారి భేటీ కానున్నారు. ప్రతిభేటీలో ఏదో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చి వివాదం చిక్కుముడి పడటమేకానీ.. ఉపశమనం లభించింది లేదు. గత భేటీలో అదనపు దళాలను తరలించ కూడదని ఇరు దేశాలు
* ఏర్పాట్లలో తలమునకలైన భారత సైన్యం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత్-చైనా మధ్య ఎల్ఏసీ వివాదం ఇప్పట్లో తెగేలా లేదు. అక్టోబర్ 12 నుంచి ఇరు దేశాల సైనిక కమాండర్లు ఏడో సారి భేటీ కానున్నారు. ప్రతి భేటీలో ఏదో ఒక కొత్త అంశం తెరపైకి వచ్చి వివాదం చిక్కుముడి పడటమే కానీ.. ఉపశమనం లభించింది లేదు. గత భేటీలో అదనపు దళాలను తరలించ కూడదని ఇరు దేశాలు నిర్ణయించాయి. కానీ, చైనా మాత్రం సరిహద్దుల సమీపానికి ఆయుధాల తరలింపు ఏమాత్రం తగ్గించలేదు. దీంతో భారత దళాలు చైనాను నమ్మి వెనక్కి తగ్గే అవకాశం లేదు. దీంతో ఈ సారి శీతాకాలం కూడా వెనక్కి తగ్గకూడదని సైన్యం నిర్ణయించింది. దీంతో కీలక స్థానాల్లో, పర్వతాలపై పట్టు కొనసాగించాలని నిర్ణయించుకొంది. దీనికి తగ్గట్లు ఏర్పాట్లు చేసుకొంటోంది.
ప్రత్యేకమైన వింటర్ గ్రేడ్ డీజిల్ డిపోల ఏర్పాటు..!
లద్దాఖ్లో వాడేందుకు అవసరమైన ప్రత్యేకమైన వింటర్ గ్రేడ్ డీజిల్ను సైన్యం సమకూర్చుకుంటోంది. అతి శీతల ప్రదేశాల్లో సాధారణ డీజిల్లోని పారఫిన్ వ్యాక్స్ చిక్కబడిపోతుంది. ఫలితంగా వాహనాల ఇంజిన్లో ఇది ప్రవహించకుండా అడ్డుపడుతుంది. డీజిల్ పంపు నుంచి వాహన ట్యాంకులోకి కూడా దీనిని పంపించడం కష్టంగా మారుతుంది. కిరోసిన్ కలపడం, వేడిచేయడం వంటివి చేస్తే సమస్యలు వస్తాయి. అందుకే.. ఇటువంటి సమస్యలను అధికమించడానికి సైన్యం ప్రత్యేకంగా వింటర్ డీజిల్ను వాడుతుంది. ఇది మైనస్ 33 డిగ్రీల చలిలో కూడా స్వేచ్ఛగా ప్రవహిస్తుంది. పానిపట్ రిఫైనరీలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీటిని ప్రత్యేకంగా తయారు చేస్తోంది.
దాదాపు 40వేల మంది సైనికుల శీతాకాల అవసరాలు తీర్చేలా భారీ అండర్ గ్రౌండ్ ఇంధన ట్యాంకులను సిద్ధం చేసింది. ఒక్కోదానిలో దాదాపు 4లక్షల లీటర్ల ఇంధనం పడుతుంది. కొన్ని ప్రత్యేక అవసరాల నిమిత్తం కిరోసిన్ కూడా నిల్వ చేస్తోంది. అంతేకాదు శీతాకాలంలో హిమ శిఖరాలు మరింత గడ్డకట్టుకుపోతాయి.. దీంతో సైన్యానికి తాగునీటికి ఇబ్బంది తలెత్తుతుంది. ఈ సమస్య నివారించడానికి నీటి వనరులను కూడా సైన్యం సమకూర్చుకుంటోంది. నీటి వనరులను గుర్తించడానికి సైన్యం భూవిజ్ఞాన శాస్త్రవేత్తలను నియమించింది. దౌలత్బేగ్ ఓల్డీ, డెప్సాంగ్, పాంగాంగ్ ప్రాంతాల్లో వీరు మంచినీటి కోసం అన్వేషణ సాగిస్తున్నారు.
హిమగిరులకు జంబో విమానాలు
భారత్ వాయుసేన అమ్ములపొదిలో భారీ విమానాలు లద్దాఖ్ దిశగా క్యూకట్టాయి. సీ-17 గ్లోబ్మాస్టర్, ఐఎల్-76, సీ-130జే వంటి భారీ విమానాలు ఉపయోగించి సైన్యానికి అవసరమైన సామగ్రిని చేరవేస్తున్నారు. దీంతోపాటు దాదాపు 6,000 ట్రక్కులు రేషన్ను నిరంతరాయంగా చేరవేస్తున్నాయి. దుస్తులు, టెంట్లు, చమురు వంటి కీలకసామగ్రి వీటిల్లో ఉంటోంది.
మొబైల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్స్(ఏటీసీ)..
భారీ సంఖ్యలో యుద్ధ, రవాణా విమానాలు, హెలికాప్టర్లు లద్దాఖ్ ప్రాంతానికి చేరుకోవడంతో.. లేహ్లోని ఏటీసీకి అదనంగా పలు మొబైల్ ఏటీసీలను ఏర్పాటు చేశారు. సైన్యం ఆధ్వర్యంలో మొబైల్ ఏటీసీలను ఇక్కడకు రప్పించారు. ఇవి టీవీ ఛానళ్లు వినియోగించే ఓబీ వ్యాన్లను పోలి ఉంటాయి.
కస్ఘర్కు చైనా బాంబరు..
మరోపక్క ఎల్ఏసీ సమీపంలోకి ఆయుధాల చేరవేతను చైనా మానలేదు. కారాకోరం పాస్కు 475 కిలోమీటర్ల దూరంలోని షిన్జియాంగ్ రీజియన్లోని కస్ఘర్ వైమానిక స్థావరంలో కీలక బాంబర్ విమానాలను మోహరిస్తోంది. హెచ్-6 బాంబర్లును ఇటీవల భారత్కు చెందిన ఓపెన్సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణులు గుర్తించారు. వీటికి చైనాకు చెందిన కేడీ-63 క్రూజ్ క్షిపణులను అమర్చినట్లు గుర్తించారు. వీటిని గాల్లో నుంచి భూఉపరితలంపై లక్ష్యాలను ఛేదించేందుకు ప్రయోగిస్తారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణించి బాంబింగ్ చేయడానికి వాడతారు. ఇరు దేశాల సైనిక కమాండర్ల ప్రకటన తర్వాత ఈ క్షిపణులతో ఉన్న విమానాలు కనిపించడం సందేహాస్పదంగా మారింది. ఈ విమానాలు చైనా వాయుసేనకు చెందిన 36వ ఎయిర్ డివిజన్లోని 108 రెజిమెంట్కు చెందినవిగా భావిస్తున్నారు. ఇవన్నీ భారత్లో దాడులు చేయాలన్న చైనా ఉద్దేశాలను వెల్లడిస్తున్నాయి.
కొత్తగా 1959 నాటి చైనా ప్రీమియర్ ఝావో ఎన్లై ప్రతిపాదించిన ఎల్ఏసీని అంగీకరిస్తామని కొన్నాళ్ల క్రితం చైనా ప్రతినిధి ఒక ఆంగ్లపత్రికకు తెలిపారు. ఇది భారత్కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రస్తుత ఎల్ఏసీ ఆధారంగానే 1993, 1996, 2005లో ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు దానిని గుర్తించకపోతే ఆ ఒప్పందాల అమలు అటకెక్కుతుంది. ఫలితంగా ఎల్ఏసీ వద్ద తీవ్రమైన ఉద్రిక్తత నెలకొంది. భారత సరిహద్దుల్లో ఉద్రిక్తతను పెంచాలనే చైనా ఉవ్విళ్లూరుతోంది.. అందుకే భారత్కు ఏమాత్రం ఆమోదయోగ్యంకాని ప్రతిపాదనలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల