చుక్కలు కలిసిన ఆ రాత్రి..!
భారత సైన్యం అక్కడో చుక్క.. అక్కడో చుక్క పెట్టినట్లు పొంతన లేకుండా వ్యహరించింది. ఆగస్టు 29-30 రాత్రి ఆ చుక్కలను మొత్తాన్ని కలిపి చైనాకు అసలు బొమ్మ చూపించింది. ఆ చిత్రాన్ని చూసిన డ్రాగన్ అదో పద్మవ్యూహామని అర్థం చేసుకొని దిమ్మరపోయింది.
చైనాను ‘ఆగస్ట్ ఫూల్’ చేసింది ఇలా..!
కైలాస్ రేంజిపై పట్టుకు ఇండియన్ ఆర్మీ వ్యూహం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత సైన్యం అక్కడో చుక్క.. ఇక్కడో చుక్క పెట్టినట్లు పొంతన లేకుండా వ్యహరించింది. ఆగస్టు 29-30 రాత్రి ఆ చుక్కల మొత్తాన్ని కలిపి చైనాకు అసలు బొమ్మ చూపించింది. ఆ చిత్రాన్ని చూసిన డ్రాగన్ అదో పద్మవ్యూహమని అర్థం చేసుకొని షాక్కు గురైంది. ప్రత్యర్థులతో బేరాలకు దిగాలంటే వారికి సంబంధించినవి ఏవో ఒకటి మన వద్ద ఉండాలి.. సాధారణంగా పొరుగు దేశం చైనా ఈ సూత్రం అనుసరిస్తుంది. పొరుగు దేశాల భూభాగాలు ఆక్రమించి అప్పుడు చర్చల నాటకానికి తెరతీస్తుంది. ఆ తర్వాత ఆక్రమించుకొన్న దానిలో కొంత భూభాగం వెనక్కి ఇచ్చి మిగిలినదానిని మింగేస్తుంది. రెండడుగులు ముందుకు.. ఒక అడుగు వెనక్కి సూత్రం అన్నమాట..! భారత్ దగ్గర కూడా పాంగాంగ్ సరస్సు వద్ద శిఖరాలు, డెప్సాంగ్ మైదానాలు వంటి ప్రాంతాలను ఆక్రమించి ఇలాంటి సూత్రాన్నే అనుసరించాలనుకుంది. కానీ, చైనా తీరుతో సహనం నశించిన భారత సైన్యం తాను కూడా ఓ రెండడుగులు ముందుకు వేసి కైలాస్ రేంజిపై పట్టు సాధించింది. ఇప్పుడు రాజీ అంటే ఇద్దరూ రెండడగులు వెనక్కి వేయాల్సిందే.. ఇదే చైనాకు మింగుడుపడటంలేదు. అంతకంటే ఎక్కువగా.. ఆగస్టులో భారత్ కైలాస్ రేంజిని ఆక్రమించిన తీరు దానికి నిద్రపట్టనివ్వడంలేదు. భారత్ మాత్రం మరో సియాచిన్ తరహాలో శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకుపోతోంది. సరైనా రాజీ ఫార్ములా లేకపోతే వెనక్కి తగ్గేదే లేదని భారత్ తెగేసి చెబుతోంది. దీంతో చర్చలు కొలిక్కి రావడంలేదు.
నెలల ముందు నుంచి ఏర్పాట్లు..
హిమాలయ పర్వతాల్లో చైనాతో ఘర్షణ వాతావరణం తలెత్తగానే భారత్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. చైనా తీరు చూస్తుంటే అంత తేలిగ్గా వెనక్కి తగ్గేట్లు లేదని భారత్కు అర్థమైంది. దీంతో చైనాతో బలంగా బేరం చేసే శక్తిని సాధించేందుకు ఉన్న అవకాశాలను గుర్తించాలని ప్రభుత్వం సైన్యాన్ని పురమాయించింది. వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని ప్రదేశాల్లో భారత్ పైచేయి సాధిస్తే చైనాను దారిలోకి తీసుకురావచ్చని సైన్యం గుర్తించడంతో ప్రభుత్వం కూడా దానికి పచ్చజెండా ఊపింది. దీంతో పశ్చిమ బెంగాల్లోని పనఘడ్ మౌంటెన్ స్ట్రైక్ కోర్ (పర్వత యుద్ధతంత్ర యోధులు)ను రంగంలోకి దించింది. దీంతోపాటు ఉత్తరాఖండ్ చక్రాతలోని స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్(ఎస్ఎఫ్ఎఫ్) కూడా రంగంలోకి దిగింది.
కేవలం ఒకే విమానంలో..
ఆగస్టు నెల మొదట్లో మౌంటేన్ స్ట్రైక్ కోర్(ఎంఎస్సీ)లోని ఒక బృందాన్ని 24గంటల్లో సిద్ధం కావాలని ఆదేశించింది. సైనికుల వద్ద వారి వ్యక్తిగత సాధనా సంపత్తి తప్ప ఎటువంటి పెద్ద ఆయుధాలు లేకుండా జాగ్రత్తపడాలని ఆదేశించింది. లెఫ్టినెంట్ జనరల్ సవ్నీత్ సింగ్ నేతృత్వంలోని బృందం ఆగమేఘాలపై లద్దాఖ్ చేరుకొంది. ఇందుకు ఒకే విమానం ఉపయోగించినట్లు సమాచారం. భారత్ వైపు భారీగా దళాల కదలిక ఉంటే తేలిగ్గా చైనా పసిగట్టేస్తుంది. ప్రధానంగా డ్రాగన్ ఉపగ్రహాల కళ్లుగప్పడం కోసమే ఇలా చేశారు. దీంతో ఎంఎస్సీ దళం ఎటువంటి అసాధారణ ఆయుధాలు లేకుండా రావడంతో చైనాకు అనుమానం రాలేదు. చైనా కన్నుగప్పేందుకు ఎంఎస్సీ, ఎస్ఎఫ్ఎఫ్ దళాలు కూడా లక్ష్యం వేపు కాకుండ వేర్వేరు ప్రదేశాల్లో తిరిగాయి. దీనికి తోడు భారత్ అదనపు దళాల తరలింపు ప్రక్రియ కూడా అదే సమయంలో జరిగింది. దీంతో భారత్ కైలాశ్ రేంజిపై కాకుండా మరెక్కడో తన దృష్టి సారించిందని చైనా భావించింది. భారత్కు కావాల్సింది అదే.
అసలు బొమ్మ కళ్లకు కనిపించిందప్పుడే..
ఆగస్టు 29-30 అర్ధరాత్రి ఆపరేషన్ మొదలైంది. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న దళాలు, ఆయుధాలు, ఇతర వనరులు ఒక దగ్గరకు చేరాయి. ఈ దళాలు మెరుపు వేగంతో కైలాస్ రేంజిగా పేరున్న పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలను స్వాధీనం చేసుకొన్నాయి. ఆగస్టు చివరి వరకు ఈ శిఖరాలు భారత్, చైనాల స్వాధీనంలో లేవు. వీటిల్లో రెచిన్ లా, రజాంగ్లా శిఖరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ స్పంగూర్ గ్యాప్ ప్రాంతంపై భారత్కు పట్టు పెంచాయి. చైనా స్థావరాలు ఉన్న మాల్డో గారిసన్పై ఈ శిఖరాల నుంచి గురిపెట్టవచ్చు. దీంతో చైనా ఆధిపత్యం ఒక్కసారిగా చేజారింది. దీంతో చైనా దృష్టి పాంగాంగ్ దక్షిణ శిఖరాలవైపు మళ్లిన సమయంలో పారాఎస్ఎఫ్కు చెందిన ఓ చిన్న దళం ఫింగర్-4పై చైనా దళాల ఉన్న ప్రదేశం కంటే ఎత్తయిన చోటుకు చేరుకుంది. అక్కడి నుంచి కింద ఉన్న చైనాపోస్టు స్పష్టంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ విషయం బాహ్యప్రపంచానికి తెలిసింది. నాటి నుంచి జరిగిన కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో చైనా కైలాస్ రేంజి నుంచి ఉపసంహరణ అంశాన్ని తీసుకొస్తూనే ఉందంటే భారత్ ఆధిపత్యం అర్థం చేసుకోవచ్చు. భారత్ ఆ శిఖరాలపైకి సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులను కూడా చేర్చడంతో చైనాపై ఒత్తిడి పెరిగింది.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది. -
మద్దతు ధరలపై దద్దరిల్లిన రాజ్యసభ
పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించే అంశమై కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో రాజ్యసభలో విపక్షాలు తీవ్ర నిరసన తెలిపాయి. -
సంక్షిప్త వార్తలు (6)
ఒకవేళ మీరు నెలనెలా రూ.10 వేలు సిప్ల రూపంలో పొదుపు చేస్తున్నా- అతిగా తినడం, వ్యాయామం చేయకపోవడం వల్ల మీ ఆరోగ్యం, ఫిట్నెస్ స్థాయిలు మెరుగ్గా లేవనుకోండి. -
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం