చుక్కలు కలిసిన ఆ రాత్రి..!
భారత సైన్యం అక్కడో చుక్క.. అక్కడో చుక్క పెట్టినట్లు పొంతన లేకుండా వ్యహరించింది. ఆగస్టు 29-30 రాత్రి ఆ చుక్కలను మొత్తాన్ని కలిపి చైనాకు అసలు బొమ్మ చూపించింది. ఆ చిత్రాన్ని చూసిన డ్రాగన్ అదో పద్మవ్యూహామని అర్థం చేసుకొని దిమ్మరపోయింది.
చైనాను ‘ఆగస్ట్ ఫూల్’ చేసింది ఇలా..!
కైలాస్ రేంజిపై పట్టుకు ఇండియన్ ఆర్మీ వ్యూహం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత సైన్యం అక్కడో చుక్క.. ఇక్కడో చుక్క పెట్టినట్లు పొంతన లేకుండా వ్యహరించింది. ఆగస్టు 29-30 రాత్రి ఆ చుక్కల మొత్తాన్ని కలిపి చైనాకు అసలు బొమ్మ చూపించింది. ఆ చిత్రాన్ని చూసిన డ్రాగన్ అదో పద్మవ్యూహమని అర్థం చేసుకొని షాక్కు గురైంది. ప్రత్యర్థులతో బేరాలకు దిగాలంటే వారికి సంబంధించినవి ఏవో ఒకటి మన వద్ద ఉండాలి.. సాధారణంగా పొరుగు దేశం చైనా ఈ సూత్రం అనుసరిస్తుంది. పొరుగు దేశాల భూభాగాలు ఆక్రమించి అప్పుడు చర్చల నాటకానికి తెరతీస్తుంది. ఆ తర్వాత ఆక్రమించుకొన్న దానిలో కొంత భూభాగం వెనక్కి ఇచ్చి మిగిలినదానిని మింగేస్తుంది. రెండడుగులు ముందుకు.. ఒక అడుగు వెనక్కి సూత్రం అన్నమాట..! భారత్ దగ్గర కూడా పాంగాంగ్ సరస్సు వద్ద శిఖరాలు, డెప్సాంగ్ మైదానాలు వంటి ప్రాంతాలను ఆక్రమించి ఇలాంటి సూత్రాన్నే అనుసరించాలనుకుంది. కానీ, చైనా తీరుతో సహనం నశించిన భారత సైన్యం తాను కూడా ఓ రెండడుగులు ముందుకు వేసి కైలాస్ రేంజిపై పట్టు సాధించింది. ఇప్పుడు రాజీ అంటే ఇద్దరూ రెండడగులు వెనక్కి వేయాల్సిందే.. ఇదే చైనాకు మింగుడుపడటంలేదు. అంతకంటే ఎక్కువగా.. ఆగస్టులో భారత్ కైలాస్ రేంజిని ఆక్రమించిన తీరు దానికి నిద్రపట్టనివ్వడంలేదు. భారత్ మాత్రం మరో సియాచిన్ తరహాలో శీతాకాలాన్ని ఎదుర్కొనేందుకు ఏర్పాట్లు చేసుకుపోతోంది. సరైనా రాజీ ఫార్ములా లేకపోతే వెనక్కి తగ్గేదే లేదని భారత్ తెగేసి చెబుతోంది. దీంతో చర్చలు కొలిక్కి రావడంలేదు.
నెలల ముందు నుంచి ఏర్పాట్లు..
హిమాలయ పర్వతాల్లో చైనాతో ఘర్షణ వాతావరణం తలెత్తగానే భారత్ ఒక్కసారిగా అప్రమత్తమైంది. చైనా తీరు చూస్తుంటే అంత తేలిగ్గా వెనక్కి తగ్గేట్లు లేదని భారత్కు అర్థమైంది. దీంతో చైనాతో బలంగా బేరం చేసే శక్తిని సాధించేందుకు ఉన్న అవకాశాలను గుర్తించాలని ప్రభుత్వం సైన్యాన్ని పురమాయించింది. వాస్తవాధీన రేఖ వద్ద కొన్ని ప్రదేశాల్లో భారత్ పైచేయి సాధిస్తే చైనాను దారిలోకి తీసుకురావచ్చని సైన్యం గుర్తించడంతో ప్రభుత్వం కూడా దానికి పచ్చజెండా ఊపింది. దీంతో పశ్చిమ బెంగాల్లోని పనఘడ్ మౌంటెన్ స్ట్రైక్ కోర్ (పర్వత యుద్ధతంత్ర యోధులు)ను రంగంలోకి దించింది. దీంతోపాటు ఉత్తరాఖండ్ చక్రాతలోని స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్(ఎస్ఎఫ్ఎఫ్) కూడా రంగంలోకి దిగింది.
కేవలం ఒకే విమానంలో..
ఆగస్టు నెల మొదట్లో మౌంటేన్ స్ట్రైక్ కోర్(ఎంఎస్సీ)లోని ఒక బృందాన్ని 24గంటల్లో సిద్ధం కావాలని ఆదేశించింది. సైనికుల వద్ద వారి వ్యక్తిగత సాధనా సంపత్తి తప్ప ఎటువంటి పెద్ద ఆయుధాలు లేకుండా జాగ్రత్తపడాలని ఆదేశించింది. లెఫ్టినెంట్ జనరల్ సవ్నీత్ సింగ్ నేతృత్వంలోని బృందం ఆగమేఘాలపై లద్దాఖ్ చేరుకొంది. ఇందుకు ఒకే విమానం ఉపయోగించినట్లు సమాచారం. భారత్ వైపు భారీగా దళాల కదలిక ఉంటే తేలిగ్గా చైనా పసిగట్టేస్తుంది. ప్రధానంగా డ్రాగన్ ఉపగ్రహాల కళ్లుగప్పడం కోసమే ఇలా చేశారు. దీంతో ఎంఎస్సీ దళం ఎటువంటి అసాధారణ ఆయుధాలు లేకుండా రావడంతో చైనాకు అనుమానం రాలేదు. చైనా కన్నుగప్పేందుకు ఎంఎస్సీ, ఎస్ఎఫ్ఎఫ్ దళాలు కూడా లక్ష్యం వేపు కాకుండ వేర్వేరు ప్రదేశాల్లో తిరిగాయి. దీనికి తోడు భారత్ అదనపు దళాల తరలింపు ప్రక్రియ కూడా అదే సమయంలో జరిగింది. దీంతో భారత్ కైలాశ్ రేంజిపై కాకుండా మరెక్కడో తన దృష్టి సారించిందని చైనా భావించింది. భారత్కు కావాల్సింది అదే.
అసలు బొమ్మ కళ్లకు కనిపించిందప్పుడే..
ఆగస్టు 29-30 అర్ధరాత్రి ఆపరేషన్ మొదలైంది. వేర్వేరు ప్రదేశాల్లో ఉన్న దళాలు, ఆయుధాలు, ఇతర వనరులు ఒక దగ్గరకు చేరాయి. ఈ దళాలు మెరుపు వేగంతో కైలాస్ రేంజిగా పేరున్న పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలను స్వాధీనం చేసుకొన్నాయి. ఆగస్టు చివరి వరకు ఈ శిఖరాలు భారత్, చైనాల స్వాధీనంలో లేవు. వీటిల్లో రెచిన్ లా, రజాంగ్లా శిఖరాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ స్పంగూర్ గ్యాప్ ప్రాంతంపై భారత్కు పట్టు పెంచాయి. చైనా స్థావరాలు ఉన్న మాల్డో గారిసన్పై ఈ శిఖరాల నుంచి గురిపెట్టవచ్చు. దీంతో చైనా ఆధిపత్యం ఒక్కసారిగా చేజారింది. దీంతో చైనా దృష్టి పాంగాంగ్ దక్షిణ శిఖరాలవైపు మళ్లిన సమయంలో పారాఎస్ఎఫ్కు చెందిన ఓ చిన్న దళం ఫింగర్-4పై చైనా దళాల ఉన్న ప్రదేశం కంటే ఎత్తయిన చోటుకు చేరుకుంది. అక్కడి నుంచి కింద ఉన్న చైనాపోస్టు స్పష్టంగా కనిపిస్తుంది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ విషయం బాహ్యప్రపంచానికి తెలిసింది. నాటి నుంచి జరిగిన కోర్ కమాండర్ల స్థాయి చర్చల్లో చైనా కైలాస్ రేంజి నుంచి ఉపసంహరణ అంశాన్ని తీసుకొస్తూనే ఉందంటే భారత్ ఆధిపత్యం అర్థం చేసుకోవచ్చు. భారత్ ఆ శిఖరాలపైకి సాయుధ వాహనాలు, యుద్ధ ట్యాంకులను కూడా చేర్చడంతో చైనాపై ఒత్తిడి పెరిగింది.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.