ఇమ్రాన్ నోటి దురుసు.. అమెరికా ఆంక్షలు..!
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..! ఈ సామెత ఇమ్రాన్ఖాన్కు ఇంకా తెలిసినట్లు లేదు. ఆయన టర్కీ ఖలీఫా రాజ్యస్థాపనలో తలమునకలై మిత్రులను కూడా దూరం చేసుకొంటున్నారు. ఫలితం ఆ దేశ సైన్యానికి ఆయుధాల (మెయింటెనెన్స్) నిర్వహణ కనకష్టంగా
* వందల కొద్దీ యుద్ధవిమానాల భవిష్యత్తు అగమ్యగోచరం
* దిక్కుతోచని స్థితిలో దాయాది ఎయిర్ఫోర్స్
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు..! ఈ సామెత ఇమ్రాన్ఖాన్కు ఇంకా తెలిసినట్లు లేదు. ఆయన టర్కీ ఖలీఫా రాజ్యస్థాపనలో తలమునకలై.. మిత్రులను కూడా దూరం చేసుకొంటున్నారు. ఫలితం ఆ దేశ సైన్యానికి ఆయుధాల (మెయింటెనెన్స్) నిర్వహణ కష్టంగా మారి మూలనపడే పరిస్థితి నెలకొంది. ఇక చైనా అన్నయ్య సాయం చేస్తాడనుకుంటే.. అమెరికా ఆంక్షలు కట్టిపడేశాయి. దీంతో ఆ దేశ ప్రధాన ఫైటర్ జెట్ జే-17కు ఇంజిన్లు దొరకడం కష్టంగా మారింది. ఇక మిగిలిన ఫ్రాన్స్ మిరేజ్ విమానాలను మెల్లిగా డంపింగ్యార్డ్కు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ కష్టాలు రెట్టింపయ్యాయి. ‘చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా’ అన్నట్లు చేశారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్.
బెడిసికొట్టిన పాక్ డ్రామా..
ఫ్రాన్స్ గత కొంతకాలంగా అంతర్గత ఉగ్రవాదంతో అవస్థలు పడుతోంది. శరణార్థులుగా వచ్చిన వారు మతం పేరుతో దాడులకు పాల్పడుతుండటంతో ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మానియేలు మాక్రోన్కు తలనొప్పిగా మారింది. 2022లో ఎన్నికలు ఉండటంతో చకచక దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తీవ్రవాద భావజాల వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను టర్కీ అధ్యక్షుడు ఎర్డగాన్తో కలిసి ఇమ్రాన్ఖాన్ తీవ్రంగా విమర్శించారు. ఇది ఒక రకంగా ఫ్రాన్స్ అంతర్గత విషయంలో జోక్యం చేసుకోవడమే. అంతేకాదు ఆయన మంత్రి వర్గంలో షామహమూద్ ఖరేషీ అనే మంత్రిగారు మరో అడుగు ముందుకేసి పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో ఓ తీర్మానం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం ఫ్రాన్స్ నుంచి పాకిస్థాన్ రాయబారిని వాపస్ తీసుకోవాలని నిర్ణయించారు. ఇంతకీ ఫ్రాన్స్లో అసలు పాక్కు రాయబారి ఉన్నారా..? అంటే. సమాధానం లేదు. అప్పటికీ మూడు నెలల క్రితమే ఫ్రాన్స్లోని పాక్ రాయబారి మొయిన్ ఉల్ హక్ను బదిలీపై చైనాకు పంపించారు. ఆ తర్వాత ఎవరినీ నియమించలేదు. మరి ఎవరిని వెనక్కి పిలుస్తున్నారో ఇమ్రాన్ఖాన్కే తెలియాలి. దీనికి తోడు ఫ్రాన్స్ వస్తువులను బహిష్కరించాలని కూడా అక్కడి నేతలు పిలుపునిచ్చారు.
ఈ డ్రామ మొత్తం గమనించిన ఫ్రాన్స్ ఇక పాక్ను ఉపేక్షించకూడదని నిర్ణయించింది. పాక్ ఎయిర్ఫోర్స్లోని మిరేజ్ విమానాలను అప్గ్రేడ్ చేయకూడదని.. ఆ దేశ నావికాదళంలోని ఫ్రాన్స్లో తయారైన అగోస్టా 90బీని కూడా ఇక పట్టించుకోకూడదని ఇమ్మానియేలు మాక్రోన్ హుకుం జారీ చేశారు. దీంతో పాక్ బిత్తరపోయింది. ఆ దేశ వైమానిక దళంలో 87 మిరేజ్-3, 92 మిరేజ్-5 యుద్ధవిమానాలు ఉన్నాయి. ఇప్పుడు వాటిని అప్గ్రేడ్ చేయడం ఇక దాదాపు అసాధ్యం. అంతేకాదు పాక్ వద్ద ఉన్న మూడు అగోస్టా 90బీ సబ్మెరైన్ల అప్గ్రేడింగ్ కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
చైనా జే-17ను ఏం చేయాలి..
పాక్ తరచూ గొప్పగా చెప్పుకొనే విమనం చైనా తయారీ జే-17. ఇప్పుడు దాని గొప్పతనం ప్రపంచానికి తెలిసిపోయింది. ఈ విమానానికి గుండెకాయ వంటి ఆర్డీ-93 ఇంజిన్ను రష్యాలోని రోసోబోర్న్ ఎక్స్పోర్ట్ నుంచి కొనుగోలు చేసి అమర్చారు. అమెరికా 2018లో రష్యాలో ఆయుధ విక్రయ ఏజెన్సీ రోసోబోర్న్ ఎక్స్పోర్ట్పై ఆంక్షలు విధించింది. దీంతో ఈ సంస్థ డాలర్లలో ట్రేడ్ చేయలేదు. ఓ పక్క ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉండటంతో పాకిస్థానీ కరెన్సీకి విలువ లేదు. అలా అని ఎయిర్ఫోర్స్లోని విమానాల ఇంజిన్లు సర్వీసు లేకుండా పనిచేయవు. నిర్ణీత గంటలు విమానాలు గాల్లో తిరిగాక దాని ఇంజిన్ను కచ్చితంగా మార్చాల్సి ఉంటుంది. ఇప్పుడు జే-17లకు ఆర్డీ-93 ఇంజిన్లు, స్పేర్పార్టులు లభించడంలేదు. దీంతో పాక్లో అత్యవసర పరిస్థితుల్లో వెంటనే గాల్లోకి లేచేందుకు సిద్ధంగా ఉన్న యుద్ధ విమానాల సంఖ్య తగ్గిపోతోంది. నాలుగు వైమానిక స్థావరాల్లో కలిపి పాక్ వద్ద 100 జే-17లు ఉన్నాయి. మరో ఇరవై వరకు ట్రైనర్ రకం జే-17లు ఉన్నాయి. వీటన్నిటికి ఇంజిన్ అవసరాలు తీవ్రంగా ఉన్నాయి. పాకిస్థాన్లోనే కొత్తగా తయారు కానున్న జే-17 బ్లాక్3 మోడల్కు కూడా ఈ కొరత సెగ తగిలింది. ఇక తప్పని పరిస్థితుల్లో ఆర్డీ-93 ఇంజిన్ను తొలగించి.. చైనా తయారీ ఇంజిన్ను అమర్చాల్సి ఉంటుంది. చైనా ఇంజిన్ నాణ్యత రష్యా ఇంజిన్ల నాణ్యతతో పోలిస్తే ఘోరంగా ఉంటుంది. అందుకే డ్రాగన్ ప్రధాన ఫైటర్ జెట్లలో కూడా రష్యా ఇంజిన్లు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత