పాక్ను ఇప్పుడేమనాలి..!
పాకిస్థాన్కు అరబ్ ప్రపంచలోని ఎటువంటి విలువ లేదని జరుగుతున్న పరిణామలు చెబుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలను పెట్టుకోగానే.. పాకిస్థాన్కు పూనకం వచ్చింది.. టర్కీ ఎగదోయడంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు
* టర్కీ తోకపట్టుకున్నందుకు తలబాదుకోలేక..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పాకిస్థాన్కు అరబ్ ప్రపంచంలో ఎటువంటి విలువ లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకోగానే.. పాకిస్థాన్కు పూనకం వచ్చింది. టర్కీ ఎగదోయడంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోపక్క పాక్ను ఎగదోసిన టర్కీ మాత్రం ఇజ్రాయెల్తో సంబంధాలను నెరుపుతోంది. తాజాగా ఇజ్రాయెల్లో తన రాయబారిని నియమించింది. ఈ పరిణామం పాక్ను ప్రపంచం ముందు వెర్రిదాన్ని చేసింది.
ఆగస్టు నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-ఇజ్రాయెల్ ‘అబ్రహం అకార్డ్’పై సంతకం చేయడంతో గల్ఫ్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. చాలా ముస్లిం దేశాలు యూఏఈ, సౌదీల నాయకత్వం నుంచి బయటకు వచ్చేస్తాయని.. వాటికి తాము నాయకత్వం వహించవచ్చని టర్కీ, పాక్లు భావించాయి. అబ్రహం అకార్డ్ తర్వాత టర్కీ, పాక్లు ఇజ్రాయెల్ను, పరోక్షంగా యూఏఈని విమర్శించాయి. అంతకుముందు కశ్మీర్ విషయంలో సౌదీ మద్దతు లభించకపోవడంపై పాక్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు కోపం వచ్చింది. సౌదీ తమకు చెల్లించాల్సిన రుణాలు వాపస్ చేయాలని కోరింది. దీంతో గతి లేని పరిస్థితుల్లో పాక్ చైనా ఎదుట చేయిజాచి సొమ్ము తీసుకొంది. సౌదీకి వాపస్ చేసింది. అంతేకాదు, సౌదీ సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా చేసిన ప్రయత్నాలూ సత్ఫలితాలను ఇవ్వలేదు. పాక్ ఇక్కడ ఒక విషయం మర్చిపోయింది.. ఆర్థిక అండదండలు ఇచ్చే సౌదీ-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై స్వరం పెంచి మాట్లాడింది. దీంతో చమురు, నిధులు ఇచ్చే సౌదీ దూరమైంది. కేవలం టర్కీ ఉందనే ధైర్యంతో ఇలా చేసింది.
పాక్ను రెచ్చగొట్టి.. తాను పక్కకు తప్పుకొని..
వాస్తవానికి టర్కీ-ఇజ్రాయెల్కు ఎప్పటి నుంచో దౌత్య సంబంధాలు ఉన్నాయి. 2018 మే వరకు టర్కీ రాయబారి ఇజ్రాయెల్లో ఉన్నారు. 2017లో అమెరికా జెరుసలేమ్ను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తించింది. ఆ తర్వాత పరిణామాలతో 2018లో టర్కీ తన రాయబారిని వాపస్ తీసుకుంది. తాజాగా తన ప్రత్యర్థులైన సౌదీ, యూఏఈతోపాటు బహ్రెయన్, సూడాన్, మొరాకో వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్తో దోస్తీ చేస్తున్నాయి. టర్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు కఠినంగా.. చేతలు మాత్రం ఉదారంగానే ఉన్నాయి. తాజాగా బైడెన్ శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతుండటంతో ఇక తన ఆటలు సాగవని టర్కీకి అర్థమైంది. దీంతో ఇజ్రాయెల్ను దూరం పెట్టడం ఏమాత్రం మంచిది కాదని భావించి.. ఆగమేఘాల మీద ఓ రాయబారిని నియమించింది. ‘అబ్రహం అకార్డు’ను విమర్శించిన ఐదు నెలల్లోనే టర్కీ స్వరం మారిపోయింది. వాషింగ్టన్ను శాంతపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. ఇక టర్కీ వెనుక ఉన్న పాక్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.
టర్కీ చర్యతో ఏమి చేయాలో తెలియని పాక్ విదేశాంగశాఖ మంత్రి ఖురేషీ ‘‘తాము మాత్రం ఇజ్రాయెల్ను గుర్తించం’’ అని తెలిపారు. యూఏఈ, సౌదీ నుంచి ఒత్తిడి వస్తోందని.. ఖురేషీ చెప్పారు. తాము మాత్రం యుఏఈకి పాక్ ప్రజల మనోభావాలను వెల్లడించామన్నారు.
త్వరలో సౌదీ సంకేతాలు..
ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకునే దేశాల్లో త్వరలో సౌదీ అరేబియా కూడా చేరే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ రీజనల్ కోపరేషన్ మినిస్టర్ అఫీర్ అకునీస్ వైనెట్ న్యూస్తో మాట్లాడుతూ..‘‘త్వరలో మరో రెండు దేశాలు కూడా తమతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురానున్నాయి. వీటిల్లో ఒకటి గల్ఫ్ ప్రాంతానికి చెందింది. ఒక పెద్ద ముస్లిం దేశం.. పాకిస్థాన్ మాత్రం కాదు’’ అని తెలిపారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM