పాక్ను ఇప్పుడేమనాలి..!
పాకిస్థాన్కు అరబ్ ప్రపంచలోని ఎటువంటి విలువ లేదని జరుగుతున్న పరిణామలు చెబుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలను పెట్టుకోగానే.. పాకిస్థాన్కు పూనకం వచ్చింది.. టర్కీ ఎగదోయడంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు
* టర్కీ తోకపట్టుకున్నందుకు తలబాదుకోలేక..
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
పాకిస్థాన్కు అరబ్ ప్రపంచంలో ఎటువంటి విలువ లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకోగానే.. పాకిస్థాన్కు పూనకం వచ్చింది. టర్కీ ఎగదోయడంతో నోటికొచ్చినట్లు మాట్లాడింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మరోపక్క పాక్ను ఎగదోసిన టర్కీ మాత్రం ఇజ్రాయెల్తో సంబంధాలను నెరుపుతోంది. తాజాగా ఇజ్రాయెల్లో తన రాయబారిని నియమించింది. ఈ పరిణామం పాక్ను ప్రపంచం ముందు వెర్రిదాన్ని చేసింది.
ఆగస్టు నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్-ఇజ్రాయెల్ ‘అబ్రహం అకార్డ్’పై సంతకం చేయడంతో గల్ఫ్లో పరిణామాలు వేగంగా మారిపోయాయి. చాలా ముస్లిం దేశాలు యూఏఈ, సౌదీల నాయకత్వం నుంచి బయటకు వచ్చేస్తాయని.. వాటికి తాము నాయకత్వం వహించవచ్చని టర్కీ, పాక్లు భావించాయి. అబ్రహం అకార్డ్ తర్వాత టర్కీ, పాక్లు ఇజ్రాయెల్ను, పరోక్షంగా యూఏఈని విమర్శించాయి. అంతకుముందు కశ్మీర్ విషయంలో సౌదీ మద్దతు లభించకపోవడంపై పాక్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో యూఏఈ, సౌదీ అరేబియాలకు కోపం వచ్చింది. సౌదీ తమకు చెల్లించాల్సిన రుణాలు వాపస్ చేయాలని కోరింది. దీంతో గతి లేని పరిస్థితుల్లో పాక్ చైనా ఎదుట చేయిజాచి సొమ్ము తీసుకొంది. సౌదీకి వాపస్ చేసింది. అంతేకాదు, సౌదీ సంబంధాలను తిరిగి సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు పాక్ ఆర్మీ చీఫ్ బజ్వా చేసిన ప్రయత్నాలూ సత్ఫలితాలను ఇవ్వలేదు. పాక్ ఇక్కడ ఒక విషయం మర్చిపోయింది.. ఆర్థిక అండదండలు ఇచ్చే సౌదీ-యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై స్వరం పెంచి మాట్లాడింది. దీంతో చమురు, నిధులు ఇచ్చే సౌదీ దూరమైంది. కేవలం టర్కీ ఉందనే ధైర్యంతో ఇలా చేసింది.
పాక్ను రెచ్చగొట్టి.. తాను పక్కకు తప్పుకొని..
వాస్తవానికి టర్కీ-ఇజ్రాయెల్కు ఎప్పటి నుంచో దౌత్య సంబంధాలు ఉన్నాయి. 2018 మే వరకు టర్కీ రాయబారి ఇజ్రాయెల్లో ఉన్నారు. 2017లో అమెరికా జెరుసలేమ్ను ఇజ్రాయెల్ రాజధానిగా అమెరికా గుర్తించింది. ఆ తర్వాత పరిణామాలతో 2018లో టర్కీ తన రాయబారిని వాపస్ తీసుకుంది. తాజాగా తన ప్రత్యర్థులైన సౌదీ, యూఏఈతోపాటు బహ్రెయన్, సూడాన్, మొరాకో వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్తో దోస్తీ చేస్తున్నాయి. టర్కీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటనలు కఠినంగా.. చేతలు మాత్రం ఉదారంగానే ఉన్నాయి. తాజాగా బైడెన్ శ్వేతసౌధంలో అడుగుపెట్టబోతుండటంతో ఇక తన ఆటలు సాగవని టర్కీకి అర్థమైంది. దీంతో ఇజ్రాయెల్ను దూరం పెట్టడం ఏమాత్రం మంచిది కాదని భావించి.. ఆగమేఘాల మీద ఓ రాయబారిని నియమించింది. ‘అబ్రహం అకార్డు’ను విమర్శించిన ఐదు నెలల్లోనే టర్కీ స్వరం మారిపోయింది. వాషింగ్టన్ను శాంతపర్చేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. ఇక టర్కీ వెనుక ఉన్న పాక్ మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.
టర్కీ చర్యతో ఏమి చేయాలో తెలియని పాక్ విదేశాంగశాఖ మంత్రి ఖురేషీ ‘‘తాము మాత్రం ఇజ్రాయెల్ను గుర్తించం’’ అని తెలిపారు. యూఏఈ, సౌదీ నుంచి ఒత్తిడి వస్తోందని.. ఖురేషీ చెప్పారు. తాము మాత్రం యుఏఈకి పాక్ ప్రజల మనోభావాలను వెల్లడించామన్నారు.
త్వరలో సౌదీ సంకేతాలు..
ఇజ్రాయెల్తో పూర్తి స్థాయి సంబంధాలు పెట్టుకునే దేశాల్లో త్వరలో సౌదీ అరేబియా కూడా చేరే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ రీజనల్ కోపరేషన్ మినిస్టర్ అఫీర్ అకునీస్ వైనెట్ న్యూస్తో మాట్లాడుతూ..‘‘త్వరలో మరో రెండు దేశాలు కూడా తమతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురానున్నాయి. వీటిల్లో ఒకటి గల్ఫ్ ప్రాంతానికి చెందింది. ఒక పెద్ద ముస్లిం దేశం.. పాకిస్థాన్ మాత్రం కాదు’’ అని తెలిపారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
రైల్వేశాఖ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది. -
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్