ఫైటర్ పైలట్ విలువ తెలుసా..?
భారత్ యుద్ధవిమనాలు.. హెలికాప్టర్లు.. రవాణ విమానాలు వరుసగా నేల కూలుతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది పైలట్లు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చాలా మంది అత్యంత విలువైన యుద్ధవిమానం కోల్పోయామని చూస్తారు.. కానీ, పైలట్ను కోల్పోవడం దేశానికి అంతకంటే పెద్ద నష్టం
మిగ్-29కే కంటే పైలట్ మరణంతోనే అధిక నష్టం..!
వారి అనుభవానికి వెలకట్టలేము..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత యుద్ధవిమానాలు.. హెలికాప్టర్లు.. రవాణా విమానాలు వరుసగా నేల కూలుతూనే ఉన్నాయి. దీంతో చాలా మంది పైలట్లు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. చాలా మంది అత్యంత విలువైన యుద్ధవిమానం కోల్పోయామని అంటారు.. కానీ, పైలట్ను కోల్పోవడం దేశానికి అంతకంటే పెద్ద నష్టం. ప్రభుత్వాలు మారుతున్నా.. ఈ దుర్ఘటనలు మాత్రం ఆగటంలేదు. గత నెలాఖరులో గోవా సమీపంలో ఓ మిగ్-29కే శిక్షణ విమానం సముద్రంలో కుప్పకూలింది. ఒక శిక్షణా పైలట్ ప్రాణాలతో బయటపడి చికిత్స పొందుతుండగా.. మరో పైలట్ నిషాంత్ సింగ్ ఆచూకీ మాత్రం తెలియలేదు. గోవాలోని ఐఎన్ఎస్ హంస వైమానిక స్థావరానికి చెందిన మూడు మిగ్-29కెలు ఏడాది వ్యవధిలో కుప్పకూలడం ప్రమాద ఘంటికలను మోగిస్తోంది.
ఫైటర్ పైలట్ ట్రైనింగ్ అంత ఈజీ కాదు..
ఫైటర్ పైలట్ శిక్షణ అంత తేలిగ్గా ఉండదు. మూడు దశల్లో 285 గంటల కఠిన శిక్షణ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి అంశంలో 100శాతం ప్రదర్శన చేస్తేనే ముందుకు వెళతారు. పైలట్ శిక్షణ ఖర్చు బహిర్గతం చేయకపోయినా.. కోట్లల్లోనే ఉంటుంది. ఒక సారి శిక్షణ విమానం గాల్లోకి ఎగరాలంటే చాలా సపోర్టింగ్ టీమ్స్ పనిచేయాల్సి ఉంటుంది. రాడార్లు, వాటి నిర్వహణ, ఏటీసీ నిర్వహణ, అత్యంత నిపుణులైన శిక్షకులను ఏర్పాటు చేయడం, రన్వేను సిద్ధం చేయడం, లోకల్ ఫ్లైయింగ్ ఏరియా, సిమ్యూలేటర్లు ఇలా ప్రతి ఒక్కటి అత్యంత ఖర్చుతో కూడుకున్నవి. అన్ని టెక్నాలజీలను సొంతంగా తయారు చేసుకొనే అమెరికా వంటి దేశాల్లోనే ఎఫ్-22 రాప్టర్ పైలట్ శిక్షణ ఖర్చు 10.90 మిలియన్ డాలర్లు(ఫోర్బ్స్ లెక్కల ప్రకారం) సీ130జే రవాణా విమాన పైలట్ శిక్షణ ఖర్చు 2.47 మిలియన్ డాలర్లు. భారత్ సీ-130 రకం విమానాలను వినియోగిస్తుంది. ఎఫ్-16 ఫైటర్ జెట్ పైలట్ శిక్షణ ఖర్చు 5.62 మిలియన్ డాలర్లు. భారత్లో కూడా శిక్షణకు 2015 లెక్కల ప్రకారం రూ.13 కోట్లు ఖర్చవుతుంది. ఇప్పుడు ఆ విలువ ఇంకా పెరిగి ఉంటుంది. అన్నిటికీ మించి పైలట్కు సొంతమయ్యే అనుభవం అత్యంత విలువైనది. దీనికి వెలకట్టలేం. తాజాగా ఆచూకీ గల్లంతైన నిషాంత్ పైలట్లకు శిక్షకుడు. అంటే నౌకాదళ నష్టం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాగ్ ఎప్పుడో హెచ్చరించింది..
భారత నౌకాదళంలో విమాన వాహక నౌకలపై మిగ్-29కెలను వినియోగించడాన్ని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎప్పుడో తప్పుపట్టింది. 2016 జులైలో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఈ విమానాల్లో చాలా సమస్యలు ఉన్నాయని పేర్కొంది. ఈ నేవల్ ఫైటర్ జెట్ ఎయిర్ ఫ్రేమ్లో చిక్కులు ఉన్నాయని తెలిపింది. దీంతోపాటు దీనిలో వినియోగించే ఆర్డీ-33 ఎంకే ఇంజిన్, ఫ్లైబై వైర్ వ్యవస్థలో ఇబ్బందులు ఉన్నాయని తెలిపింది. ఈ విమానంలో రెండు ఇంజిన్లు ఉంటాయి. 2016 నాటికి ఒక ఇంజిన్ మోరాయించడంతో.. మిగిలి ఇంజిన్తోనే తంటాలుపడి ల్యాండ్ అయిన ఘటనలు 10 చోటు చేసుకొన్నాయని పేర్కొంది. ఈ ఇంజిన్ జీవిత కాలం కూడా తక్కువగా ఉంటోంది.
నిషాంత్కు ఏం జరిగి ఉంటుంది..
యుద్ధ విమానాలు కూలిపోతాయి అని తెలిసినప్పుడు పైలట్ దానిని ల్యాండ్ చేయడానికి చివరి వరకు ప్రయత్నిస్తారు. ఇక తప్పదు అనుకున్నప్పుడు విమానం నుంచి ఎజెక్ట్ (బయటకు వచ్చేయడం) అవుతారు. దీనికి పైలట్ సీటు కింద రాకెట్ ఇంజిన్ వంటి ఓ వ్యవస్థ ఉంటుంది. తొలుత పైలట్ పైన ఉన్న గ్లాస్ను తొలగిస్తారు. అనంతరం ఆ రాకెట్ వ్యవస్థ పనిచేసి పైలట్ అత్యంత వేగంతో గాల్లోకి ఎగిరిపోతారు. ఆ తర్వాత అతడి నుంచి సీటు వేర్పడిపోతుంది. అతనికి ఉన్న పారాచూట్ తెరుచుకొని కిందకు దిగుతాడు. ఈ పక్రియ అత్యంత వేగంగా జరిగిపోవాలి. ఏ మాత్రం ఆలస్యమైనా.. గాల్లో ప్రయాణిస్తున్న ఆ యుద్ధ విమానం తోకభాగం పైలట్ శరీరాన్ని తాకుతుంది. దీంతోపాటు తగినంత ఎత్తులో ఎజెక్ట్ కాకపోతే పారచూట్ తెరుచుకునే సమయం లభించక నీటిలో లేదా నేలపై పడిపోతాడు. మరో విషయం ఏంటంటే పైలట్ సీటు రాకెట్ వేగంతో గాల్లోకి లేవడంతో ఆతని వెన్ను పూస దెబ్బతినడం, లేదా తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం జరుగుతుంది. అప్పుడు నీటిలో పడినా వెంటనే ఈదలేక ప్రాణాలు కోల్పోతారు. వారి ఆచుకీ తెలుసుకొనేందుకు సూట్లో ఓ లొకేటర్ ఉంటుంది. అది నీటిలోపడితే పనిచేయదు. దీంతో ఆచుకీ కనుగొనడం కష్టంగా మారుతుంది. ఒక వేళ పైలట్ ప్రాణాలతో ఉంటే అతనికి కొంతకాలానికి సరిపడా అత్యంత శక్తిమంతమైన ఆహారం కూడా వారి సూట్లో ఉంటుంది. ఇక నిషాంత్ విషయంలో ఏం జరిగిందో ఇప్పటికీ స్పష్టతలేదు. అతను క్షేమంగా తిరిగిరావాలని కోరుకుందాం.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి