బాలుడిని వెంటాడుతున్న చైనా..?
చైనాకు భూదాహం ఎక్కువ.. దాని ఎదుట నైతిక విలువలు.. విచక్షణ ఏవీ ఉండవు. సాధారణంగా ఒక ప్రదేశాన్ని గుప్పిట పెట్టుకోవడానికి ఏ దేశమైనా ఏమిచేస్తుంది..? సైనిక బలగాలను ప్రయోగిస్తుంది.. లేదా అభివృద్ధిని ఆశపెడుతుంది..? అదీకాకపోతే ప్రజలకు తాయిలాలను ఆశచూపుతుంది.
రక్షణగా రంగంలోకి అమెరికా..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
చైనాకు భూదాహం ఎక్కువ.. దానికి నైతిక విలువలు.. విచక్షణ ఏవీ ఉండవు. సాధారణంగా ఒక ప్రదేశాన్ని గుప్పిట పెట్టుకోవడానికి ఏ దేశమైనా ఏం చేస్తుంది..? సైనిక బలగాలను ప్రయోగిస్తుంది.. లేదా అభివృద్ధి చేస్తామని ఆశపెడుతుంది..? అదీ కాకపోతే ప్రజలకు తాయిలాలను ప్రకటిస్తుంది. కానీ, చైనా అలాకాదు.. ఓ బాలుడిని కిడ్నాప్ చేసింది..! హా.. నిజమే..! ప్రపంచంలో రెండో ఆర్థిక మహాశక్తి చేసిన నిర్వాకం ఇదీ..! ఆ బాలుడి స్థానంలో తన కీలుబొమ్మ వంటి వ్యక్తిని ప్రవేశపెట్టింది. ఇలాంటి పనే మరోసారి చేయాలని చూస్తోంది. దీంతో ఈ సారి అమెరికా రంగంలోకి దిగింది. చైనా ఎక్కువ ఉత్సాహం చూపించకుండా అడ్డుకొనేలా ఓ బిల్లును ప్రవేశపెట్టింది. నిన్న ట్రంప్ దానిపై సంతకం చేశారు. మన పొరుగున ఉన్న టిబెట్ ఈ ఉత్కంఠభరిత పరిణామాలకు కేంద్రంగా మారింది. తాజాగా అమెరికా ‘ది టిబెటియన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ 2020’ అమల్లోకి రానుంది.
చైనా కబంద హస్తాల్లోకి టిబెట్ బాల లామా..!
ఈ ఏడాది మే 20వ తేదీన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఓ కీలక ప్రకటన చేశారు. టిబెట్కు చెందిన 11వ పంచయిన్ లామ గెధున్ చొయికి నైమా క్షేమ సమాచారం అది. ‘‘బాలుడిగా ఉన్నప్పుడు అతడికి తప్పనిసరి విద్యను అందించాం. ఇప్పుడు ఆ యువకుడు గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఉద్యోగం కూడా లభించింది. 31ఏళ్ల అతడు గానీ.. అతడి కుటుంబం గానీ ప్రస్తుతం ఉన్న ప్రశాంత పరిస్థితులను వదులుకోవాలనుకోవడం లేదు’’ అని పేర్కొన్నారు. టిబెట్లో 10వ పంచయిన్ లామా వారసుడిగా గుర్తింపు పొందిన ఆరేళ్ల బాలుడు గెధున్ చొయికి నైమాను సరిగ్గా 25 ఏళ్ల క్రితం చైనా సైన్యం కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి అతడి ఆచూకీ ఎవరికీ తెలియదు. పంచయన్ లామా అంటే దలైలామాకు ముందు ఉండే పదవి. అంటే టిబెట్ బౌద్ధుల్లో రెండో అత్యున్నత స్థానం.
కిడ్నాప్.. కుట్ర కథ ఇదీ..
1950లో చైనా టిబెట్పై ఆక్రమణ ప్రారంభించింది. ఆ తర్వాత చాలా ప్రాంతాలను కలిపేసుకొని.. మిగిలిన వాటికి స్వయం ప్రతిపత్తి ఇచ్చింది. 1959లో టిబెట్ తిరుబాటు చేసింది.. కానీ, అది విఫలం కావడంతో టిబెటియన్ల బౌద్ధ మత గురువు దలైలామా భారత్కు శరణార్థిగా వచ్చారు. ఆయన ధర్మశాలలో ఆశ్రయం పొందుతున్నారు. ఆయన తర్వాతి స్థానంలో ఉన్న 10వ పంచయిన్ లామా లోబ్సాంగ్ గ్యాల్సెన్ మాత్రం టిబెట్లోనే ఉండిపోయారు. అదే సమయంలో చైనా సాంస్కృతిక విప్లవం పేరుతో టిబెట్ సంస్కృతిని ధ్వంసం చేయడం మొదలుపెట్టింది. మఠాలు, రచనలను ధ్వంసం చేసింది. మరోపక్క చైనా ఆగడాలను దలైలామా ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో భవిష్యత్తులో దలైలామా స్థానాన్ని కబ్జా చేయాలని చైనా భావించింది. ఈ దలైలామ ఎంపికలో పంచయిన్ లామా పాత్ర చాలా కీలకం. 1989లో టిబెట్లోనే ఉండిపోయిన పంచయిన్ లామా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఆయనపై విష ప్రయోగం చేశారంటారు. ఆయన మరణం తర్వాత వారసుడి ఎంపికను తాషి లున్పో ఆశ్రమం, బౌద్ధ సన్యాసులు వారి ఆచారాల ప్రకారం చేస్తారు. అప్పటికే టిబెట్ను గుప్పిట పెట్టుకొన్న చైనా.. భారత్లో ఉన్న దలైలామాను ఈ ఎంపిక ప్రక్రియకు దూరం పెట్టాలని నిర్ణయించింది. తాషి లున్పో మఠాధిపతిని ఈ ఎంపికకు అధిపతి చేసింది. పంచయిన్ లామా ఎంపికకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. కానీ, తాషి లున్పో అధిపతి పంచయిన్ లామా వారసుడిగా సరిపోలిన బాలుడిని గుర్తించి ఆ జాబితాను ప్రవాసంలో ఉన్న దలైలామాకు రహస్యంగా చేరవేశాడు. ఆయన 1995 మే 14న ఆరేళ్ల బాలుడైన గెధున్ చొయికి నైమా పేరును 11వ పంచయిన్ లామాగా ప్రకటించారు. దీంతో చైనా ఆగ్రహం కట్టలు తెంచుకొంది. సరిగ్గా మూడు రోజుల తర్వాత చైనా సైన్యం ఆ బాలుడిని కిడ్నాప్ చేసింది. అప్పటి నుంచి అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. తాషి లున్పో అధిపతిని జైల్లో వేసింది. ఆ తర్వాత చైనా గ్యాన్సీ నిబ్రో అనే ఐదేళ్ల బాలుడిని పంచయిన్ లామాగా ప్రకటించింది. ఎందుకో తెలుసా..? పంచయిన్ లామా ఎంపికలో దలైలామా పాత్ర ఉన్నట్లే.. కొత్త దలైలామా ఎంపికలో పంచయిన్ లామా పాత్ర ఉంటుంది. తాను ఎంపిక చేసిన పంచయిన్ లామాతో తనకు నచ్చిన వ్యక్తిని దలైలామాగా ప్రకటింపజేయాలి. ఆ తర్వాత కొత్త దలైలామా సహకారంతో టిబెట్ స్వతంత్ర ఉద్యమాన్ని అణచివేయాలన్నది వ్యూహం. చైనా ఎంపిక చేసిన పంచయిన్ లామాను ఇప్పటికీ టిబెటియన్లు ఏ మాత్రం పట్టించుకోరు.
తాజాగా అమెరికా జోక్యం..
ప్రస్తుత దలైలామాకు దాదాపు 85ఏళ్ల వయస్సు వచ్చేసింది. ఆయన చైనా దుర్బుద్ధిని ముందే పసిగట్టి తన వారసుడు కేవలం టిబెట్ నుంచే రావాల్సిన అవసరం లేదని.. ఉత్తర భారత్, నేపాల్, భూటాన్ల నుంచి కూడా రావచ్చని ప్రకటించారు. తర్వాత దలైలామా ఎంపిక స్వేచ్ఛగా, చైనా జోక్యం లేకుండా.. సంప్రదాయం ప్రకారం జరిగేలా చూడాలని అమెరికా కాంగ్రెస్ నిర్ణయించి.. ‘ది టిబెటియన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ 2020’ పాస్ చేసింది. దీని ప్రకారం టిబెట్లో లాసాలో అమెరికా ప్రత్యేక రాయబార కార్యాలయం ఏర్పాటు చేయనుంది. దీంతో టిబెట్ వాసులకు మద్దతుగా ఓ కూటమి తయారు చేయాలని భావిస్తోంది. దలైలామా ఎంపికలో చైనా జోక్యం చేసుకొంటే భారీ ఆంక్షలను రుచి చూడాల్సి ఉంది. దీనిపై డ్రాగన్ బుసలు కొట్టింది. మా అంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అమెరికాపై ప్రతి ఆంక్షలు విధిస్తామని పేర్కొంది. అంతేకాదు టిబెట్కు చెందిన ఎన్జీవోలకు సహకారం అందించాలని నిర్ణయించింది. లాసాలో అమెరికా రాయబారా కార్యాలయం ఏర్పాటు అయ్యే వరకు కొత్తగా చైనా ఏర్పాటు చేయాలనుకునే రాయాబారా కార్యాలయాలపై ఆంక్షలు విధించింది. టిబెట్ వ్యవహారాలు చూసేందుకు ఓ అధికారిని కూడా నియమించింది. ప్రస్తుతం దలైలామాకు ఆశ్రయం ఇస్తున్న భారత్ మాత్రం నిశ్శబ్దంగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంది. ఇప్పటికే లాద్దాఖ్లో భారత్తో ఘర్షణకు దిగిన చైనాను ఈ పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
Viral Video: ఒకే రైల్వే ట్రాక్పై నాలుగు రైళ్లు ఉన్న వీడియో ఒకటి తెగ సర్క్యులేట్ అవుతోంది. దీనిపై రైల్వే శాఖ స్పష్టతనిచ్చింది. -
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఆయన అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనపై చేసిన వ్యాఖ్యలపై ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్రంగా స్థాయిలో విరుచుకుపడ్డారు. -
మాట్లాడుతుంటే మైక్ కట్ చేశారు: నీతిఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
నీతి ఆయోగ్ సమావేశంలో తనను మాట్లాడకుండా అడ్డుకున్నారని మమతా బెనర్జీ(Mamata Banerjee ) ఆరోపించారు. -
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
ప్రధాని మోదీ అధ్యక్షతన రాష్ట్రపతి భవన్లో నేడు నీతి ఆయోగ్(NITI Aayog) సమావేశం ప్రారంభమైంది. -
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లుగా విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
PM Modi: ప్రధాని మోదీ వచ్చే నెలలో ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. -
విద్యార్థుల హృదయాలు గెలుచుకున్న వెంకయ్యనాయుడు
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విద్యార్థుల హృదయాలు గెలుచుకున్నారు. ఓ స్నాతకోత్సవంలో ఏకంగా 675 మందికి స్వయంగా పట్టాలు ప్రదానం చేశారు. ఇందుకు గంటకుపైగా ఆయన వేదికపై నిల్చొనే ఉన్నారు. శుక్రవారం చెన్నైలో గురునానక్ కళాశాల 48వ స్నాతకోత్సవం జరిగింది. -
అస్సాం సమాధులకు యునెస్కో వారసత్వ హోదా
అస్సాంలో అహోమ్ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. -
శివుడికి నైవేద్యంగా ఔషధాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసిలో ఉన్న రాసేశ్వర్ మహాదేవ్ ఆలయంలో శివుడికి నైవేద్యంగా ఔషధాలను సమర్పిస్తున్నారు ఆయుర్వేద సిబ్బంది. ఈ ఆలయం బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఉంది. -
కేంద్ర మంత్రిని మందలించిన లోక్సభ స్పీకర్
సభలో సభ్యుల నడవడిక, ప్రవర్తనకు సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లా శుక్రవారం పలు సూచనలు చేశారు. -
పారిస్ ఒలింపిక్స్కు రికార్డుస్థాయిలో 24 మంది ఎల్పీయూ విద్యార్థులు
పారిస్లో శుక్రవారం నుంచి ప్రారంభమైన 2024 ఒలింపిక్ క్రీడల్లో తమ విద్యాసంస్థకు చెందిన 24 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు పంజాబ్లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ) ఓ ప్రకటనలో వెల్లడించింది. -
పార్లమెంటు ముందుకు ‘ఎమర్జెన్సీ’ దారుణాలు!
దేశంలో అత్యయికస్థితి విధించిన సమయంలో చోటుచేసుకున్న దురాగతాలపై దర్యాప్తు చేసిన ‘షా కమిషన్’ నివేదిక అంశం శుక్రవారం రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చింది. -
కార్గిల్ వీరులకు పార్లమెంటు, రాష్ట్రపతి నివాళి
కార్గిల్ 25వ విజయ్ దివస్ సందర్భంగా నాటి యుద్ధంలో ప్రాణాలు అర్పించిన 500 మందికి పైగా వీర సైనికులకు పార్లమెంటులోని ఉభయ సభల సభ్యులు కొద్దిసేపు మౌనంగా నిలబడి నివాళులు అర్పించారు. -
ఇజ్రాయెల్ అనాగరిక చర్యలకు పశ్చిమ దేశాల మద్దతు : ప్రియాంక
గాజాపై అనాగరిక దాడులకు పాల్పడుతున్నారంటూ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. -
ఎవరూ క్లెయిమ్ చేయని నష్టపరిహారాలు.. దేశమంతటా ఉన్న సమస్య: సుప్రీంకోర్టు
లేబర్ కోర్టులు, మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునళ్ల (ఎంఏసీటీ) దగ్గర ఎవరూ క్లెయిమ్ చేయని పరిహర సొమ్ము భారీ మొత్తంలో పేరుకు పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. -
నీట్-యూజీ తుది ఫలితాల వెల్లడి
పేపర్ లీక్ ఆరోపణలతో వివాదాస్పదంగా మారిన నీట్-యూజీ ప్రవేశ పరీక్ష తుది ఫలితాలను(రీరివైజ్డ్) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) శుక్రవారం విడుదల చేసింది. -
పాఠాలు నేర్చుకోని పాకిస్థాన్
చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. -
కావడి యాత్రలో.. పేర్ల ప్రదర్శనపై మధ్యంతర స్టే పొడిగింపు
కావడి యాత్ర మార్గంలో తినుబండారాలు విక్రయించే యజమానులు తమ పేర్లను ఆహారశాలలపై తప్పనిసరిగా ప్రదర్శించాలంటూ ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఆదేశాలపై మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు పొడిగించింది. -
అధిక వడ్డీ రుణాలపై విచారణకు సుప్రీం నిర్ణయం
చట్టవిరుద్ధంగా వడ్డీ వ్యాపారం చేసేవారి నుంచి నిస్సహాయులైన రుణగ్రహీతలను కాపాడాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. -
పరువునష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్గాంధీ
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, రాయ్బరేలీ ఎంపీ రాహుల్ గాంధీ శుక్రవారం ఉత్తర్ప్రదేశ్లోని సుల్తాన్పుర్ కోర్టుకు హాజరయ్యారు. -
అంత్యక్రియల తర్వాత... ఇంటికి వచ్చిన కుమార్తె
తమ కుమార్తెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి చంపేశారని భావించి గుర్తు తెలియని మృతదేహానికి అంత్యక్రియలు చేసిన తల్లిదండ్రులకు ఆశ్చర్య ఘటన ఎదురైంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు