Year Ender 2023: మురిపించిన చంద్రయాన్.. మెలిపెట్టిన ప్రపంచకప్: 2023 పంచిన జ్ఞాపకాలివే..!
2023.. మనకు ఓ మిశ్రమ కాలం. రోమాలు నిక్కబొడుచుకునే ఘనతలు ఒకవైపు, పెను విషాదాలు నింపిన ఘటనలు మరోవైపు. కొత్త ఏడాదిలోకి కాలుమోపేముందు అవేంటో చూద్దామా..!
ఇంటర్నెట్ డెస్క్: మరో ఏడాది చరిత్రగా మారే సమయం ఆసన్నమైంది. సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకొని కొత్త ఏడాదిని స్వాగతించేందుకు ప్రపంచం సిద్ధమవుతోంది. ఈ 2023 భారత్కు ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చింది. చంద్రయాన్, జీ20 సదస్సుతో భారత్ పేరు అంతర్జాతీయంగా మార్మోగగా.. మణిపుర్ ఘర్షణలు, ఒడిశా ఘోర రైలు ప్రమాదం, రెజ్లర్ల ఆందోళన కలుక్కుమనిపించాయి. ఇలా మధురానుభూతులతో పాటు చేదు గుళికలను మిగిల్చిన ఈ ఏడాదిని ఓ సారి గుర్తుచేసుకుందాం..!
రోడ్డెక్కిన కుస్తీయోధులు..
లైంగిక వేధింపుల ఆరోపణలతో భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా సాక్షి మలిక్, బజ్రంగ్ పునియా, వినేశ్ ఫొగాట్ తదితర రెజ్లర్లు జనవరి నెలలో దిల్లీలో చేపట్టిన ఆందోళన తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW).. డబ్ల్యూఎఫ్ఐపై నిరవధికంగా సస్పెన్షన్ విధించింది. ఈ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్ను రద్దు చేసి, మరలా ఎన్నికలు నిర్వహించింది. ఈ క్రమంలో ఎన్నో ఉద్వేగపూరిత పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒక దశలో తమ పతకాలను గంగా నదిలో కలిపేందుకు రెజ్లర్లు సిద్ధమయ్యారు. మరికొందరు ఆట నుంచి వీడ్కోలు పలుకుతున్నామని ప్రకటించగా.. ఇంకొందరు అవార్డులు వెనక్కి ఇచ్చారు.
రాహుల్పై అనర్హత వేటు..
సాక్షాత్తూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ (Rahul Gandhi) పై మార్చి నెలలో అనర్హత వేటు పడటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. మోదీ ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై నమోదైన పరువునష్టం (క్రిమినల్) కేసులో సూరత్ కోర్టు రాహుల్కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన 24 గంటల వ్యవధిలోనే లోక్సభ సచివాలయం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై విపక్షాలు భగ్గుమన్నాయి. న్యాయపోరాటం అనంతరం దిగువస్థాయి కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో సుమారు ఐదు నెలల తర్వాత రాహుల్ పార్లమెంట్లో అడుగుపెట్టారు.
జనాభాలో భారత్ నంబర్ వన్..
ఈ ఏడాది ఏప్రిల్లో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ (India) అవతరించింది. అప్పటివరకు నంబర్ వన్గా ఉన్న చైనాను దాటేసి.. 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. చైనా రెండో స్థానంలో నిలిచింది. 1950 నుంచి ఐరాస జనాభా లెక్కల్ని ప్రచురిస్తోంది. అప్పట్నుంచి అగ్రస్థానంలో ఉన్న చైనాను మనదేశం వెనక్కి నెట్టింది. జనాభా విషయంలోనూ భారత్పై చైనా అక్కసు వెళ్లగక్కింది. తమవద్ద ఇప్పటికీ 90 కోట్ల మంది ప్రతిభ కలిగిన కార్మికులు ఉన్నారని పేర్కొంది. జనాభా పెరిగినా వారిలో ప్రతిభ ఉండాలిగా అంటూ వ్యాఖ్యలు చేసింది.
ఉలిక్కిపాటుకు గురిచేసిన మణిపుర్ ఘటన..
జాతుల మధ్య వైరంతో మే నెలలో ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు (Violence in Manipur) దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. మైతేయిలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న అంశాన్ని పరిశీలించేందుకు కేంద్ర ఆదివాసీ శాఖకు ప్రతిపాదన చేయాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశించడంతో అల్లర్లు చెలరేగాయి. వారికి రిజర్వేషన్లు ఇవ్వొద్దని ఆదివాసీ తెగలు డిమాండ్ చేశాయి. ఇది కాస్తా తీవ్ర ఘర్షణలకు దారితీయడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మహిళలు బృందాలుగా ప్రముఖుల ఇళ్లపై దాడి చేసి, నిప్పంటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇవన్నీ ఒకఎత్తైతే.. ఇద్దరు మహిళలను కొందరు పురుషులు నగ్నంగా ఊరేగించిన ఘటనతో యావత్ దేశం దిగ్భ్రాంతికి గురైంది. ఇంటర్నెట్ ఆంక్షలతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఆ ఘటన దేశాన్ని కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటనలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల చర్యలతో ప్రస్తుతం ఆ రాష్ట్రంలో పరిస్థితి కాస్త కుదుటపడింది.
భారత్కు కొత్త పార్లమెంట్ భవనం..
ఈ అమృతకాలంలో భారత్కు కొత్త పార్లమెంట్ భవనం అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అధునాతన సదుపాయాలు, సకల హంగులతో నిర్మించిన భవనాన్ని (New Parliament Building) ప్రధాని నరేంద్ర మోదీ (Modi) ప్రారంభించారు. ద్రవిడ సంప్రదాయానికి గుర్తుగా ఉన్న సెంగోల్ను స్పీకర్ కుర్చీ పక్కన ప్రతిష్ఠాపన చేశారు.
పెను విషాదం నింపిన ఒడిశా రైలు దుర్ఘటన..
ఒడిశాలోని బాలేశ్వర్లో జూన్ 2 రాత్రి కోరమాండల్ ఎక్స్ప్రెస్, ఓ గూడ్స్ రైలు, యశ్వంత్పూర్-హావ్డా ఎక్స్ప్రెస్ రైళ్లు అనూహ్య రీతిలో ఢీకొన్న ఘటన (Odisha Train Tragedy) దేశ వ్యాప్తంగా పెను విషాదం నింపింది. ఈ ఘటనలో 296 మంది బలయ్యారు. సుమారు 1200 మంది గాయపడ్డారు. బోగీలు ఒకదానిపై ఒకటి దూసుకెళ్లడం, వాటి మధ్య ఛిద్రమైన శరీరాలు, క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం భీతావహంగా మారింది. ఆ విపత్తు వేళ స్థానికులు ప్రదర్శించిన మానవత్వం హృదయాలను కదిలించింది. గాయపడిన వారికి రక్తం అవసరం ఉంటుందని ఆలోచించిన వందలాదిమంది యువత ఆసుపత్రికి తరలివచ్చి సాయం అందించారు.
రోమాలు నిక్కబొడుచుకున్న మూమెంట్.. చంద్రయాన్-3
ఆగస్టు నెలలో జాబిల్లి దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 (Chandrayaan-3) సురక్షితంగా దిగడంతో అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త చరిత్రను లిఖించింది. అంతరిక్ష రంగంలో ప్రబల శక్తులుగా పేరున్న అమెరికా, రష్యా, చైనాలకు సైతం అందని దక్షిణ ధ్రువంపై కాలుమోపి విజయ గీతిక వినిపించింది. ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్లు 14 రోజుల పాటు చంద్రుడి గురించి విలువైన సమాచారం అందించాయి. అనంతరం చంద్రుడిపై చీకటి కావడంతో ఆ రెండు నిద్రాణస్థితిలోకి వెళ్లిపోయాయి. చంద్రయాన్-3 సురక్షిత ల్యాండింగ్ జరిగిన కొద్దిరోజులకు.. సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష సంస్థ (ISRO) ‘ఆదిత్య ఎల్1’ ను ప్రయోగించింది. జనవరి 6న ఇది గమ్యస్థానానికి చేరుకోనుంది.
జీ20..అధ్యక్ష బాధ్యతలు సగర్వంగా నిర్వహించి..
సెప్టెంబర్ నెలలో భారత్ అధ్యక్షతన జీ-20 శిఖరాగ్ర సదస్సు (G20 Summit) జరిగింది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ నినాదంతో సభ్యదేశాలతో పాటు పలు మిత్ర దేశాలు, అంతర్జాతీయ సంస్థలకు భారత్ ఆతిథ్యం ఇచ్చింది. ‘దిల్లీ డిక్లరేషన్’పై సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడాన్ని భారీ విజయంగా అభివర్ణించారు. దీని నిర్వహణపై అమెరికా సహా ప్రపంచ దేశాల నుంచి భారత్కు ప్రశంసలు దక్కాయి. మనదేశం నుంచి ఐరోపాను అనుసంధానం చేసే ప్రతిష్ఠాత్మక భారత్-పశ్చిమాసియా-తూర్పు ఐరోపా ఆర్థిక నడవా విషయంలో ఈ సదస్సులో అవగాహన ఒప్పందం కుదరడం కీలక పరిణామం.
క్రికెట్ ప్రపంచకప్.. మిస్..!
ఈ నవంబర్ నెల భారత క్రికెట్ అభిమానులకు అంతులేని నిరాశను మిగిల్చింది. వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023)లో ప్రారంభం నుంచి పరుగుల వరద పారించి.. వికెట్ల వేటలో దూసుకుపోయి.. ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టి జైత్రయాత్రను కొనసాగించిన రోహిత్ సేన ఆఖరి మెట్టుపై భంగపడింది. పరాజయం పాలై కంగారులకు ఆరో ప్రపంచకప్ సమర్పించుకొంది. కపిల్ దేవ్, మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత భారత్కు కప్పు అందించాలనుకున్న రోహిత్ స్వప్నం చెదిరిపోయింది.
కలవరపెట్టి.. సుఖాంతమైన ఆపరేషన్ టన్నెల్..
ఉత్తరాఖండ్లోని ఉత్తర్కాశీలో సొరంగం (Uttarakhand Tunnel) పాక్షికంగా కుప్పకూలడంతో 41 మంది కూలీలు చిక్కుకుపోయిన ఘటన దేశవ్యాప్తంగా కలవరానికి గురిచేసింది. సహాయక చర్యలకు అడుగడుగునా సవాళ్లు ఎదురయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యలను దాటి, 17 రోజుల పాటు విరామం ఎరుగక శ్రమపడ్డ సహాయక బలగాల కష్టానికి ఫలితం దక్కింది. చివరకు ‘ర్యాట్ హోల్ మైనర్ల’ నైపుణ్యంతో ఆ కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.
భద్రతా వైఫల్యం.. మూకుమ్మడి సస్పెన్షన్లు
శీతాకాల పార్లమెంట్ (Parliament) సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్సభ (Loksabha)లోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఓ వ్యక్తి గ్యాలరీ నుంచి కిందకు దూకుతూ నినాదాలు చేయగా.. మరోవ్యక్తి ఒకరకమైన పొగను వదలడం అలజడి సృష్టించింది. ఇదే సమయంలో పార్లమెంటు బయట మరో ఇద్దరు దుండగులు ఈ తరహాలోనే ఆందోళనలు చేశారు. దీనిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ నిరసనలతో పార్లమెంట్ కార్యకలాపాలకు అంతరాయం కలుగుతుందంటూ సభాపతులు వారిపై వేటు వేశారు. ఒక సెషన్లో 146 మందిపై సస్పెన్షన్ విధించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
మరికొన్ని..
స్వలింగ సంపర్కుల వివాహాలకు ‘ప్రత్యేక వివాహాల చట్టం’ కింద చట్టబద్ధత కల్పించేందుకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా నిరాకరించింది. అలాంటిది చేయాలంటే దానికి తగ్గట్టు చట్టాన్ని మార్చే పరిధి పార్లమెంటుకు మాత్రమే ఉందని స్పష్టం చేసింది. ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల పాత్ర ఉండొచ్చని ఆరోపించి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కలకలం సృష్టించారు. కేంద్రంలో భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో విపక్ష పార్టీలన్నీ కలిసి ‘ఇండియా’ కూటమిని ఏర్పాటు చేశాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్గా భావించే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు డిసెంబర్లో వెలువడగా.. మూడింట ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి భాజపా రాణించింది. హిందీ రాష్ట్రాలైన రాజస్థాన్ (Rajasthan), మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో కాషాయ జెండా రెపరెపలాడింది. మరి రాబోయే కొత్త సంవత్సరం ఎలాంటి సంతోషాలు, సవాళ్లను మనముందు ఉంచుతుందో చూడాలి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
పెండింగ్ బిల్లుల విషయంలో కేరళ, బెంగాల్ గవర్నర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. -
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
అగ్నిపథ్ పథకం దేశ సైన్యాన్ని బలోపేతం చేయడానికి తీసుకువచ్చిన సంస్కరణ అని మోదీ(PM Modi) తెలిపారు. -
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు