కుప్పకూలిన సుఖోయ్‌ యుద్ధ విమానం..!

మహారాష్ట్ర నాసిక్‌లో సుఖోయ్‌ యుద్ధ విమానం కుప్పకూలింది. పైలట్‌, కో- పైలట్‌ ప్రమాదం నుంచి బయటపడ్డారు.

Published : 04 Jun 2024 17:23 IST

దిల్లీ: సుఖోయ్‌ యుద్ధ విమానం కుప్పకూలింది. మహారాష్ట్ర నాసిక్‌లోని షిరస్‌గావ్‌ గ్రామ సమీపంలోని పొలంలో ఈ ఫైటర్‌ జెట్‌ నేలకూలింది. అయితే ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని.. పైలట్‌, కో- పైలట్‌ ఇద్దరూ స్వల్ప గాయాలతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈవిషయాన్ని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 

కిశోరీ భయ్యా మీరు గెలుస్తారని తెలుసు: ప్రియాంక గాంధీ ఎమోషనల్‌ పోస్ట్‌

సుఖోయ్‌ విమానానికి వింగ్‌ కమాండర్‌గా బోకిల్‌, సెకెండ్‌ ఇన్‌ కమాండర్‌గా బిస్వాస్‌ ఉన్నారు. నాసిక్‌లోని ఓజర్‌ నుంచి విమానాన్ని టేకాఫ్‌ చేశారు. మధ్యాహ్నం 1:20 గంటలకు షిరస్‌గావ్‌ గ్రామంలోని పొలంలో ఒక్కసారిగా ఈ జెట్‌ కూలిపోయింది. విమానంలో మంటలు చెలరేగి చుట్టూ పొగలు కమ్ముకున్నాయి. వెంటనే పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పైలట్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఈ విమానం భారత్‌ వైమానిక దళం జాబితాలో లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు