Eric Garcetti: భారత్-అమెరికా భాగస్వామ్యం.. ప్రపంచానికి భాగ్యదాయకం
భారత్-అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు.
ఇక్కడ అవకాశాలు పుష్కలం
అందుకే మా పారిశ్రామికవేత్తల చూపు మరింతగా ఇటువైపు
జనరిక్ ఔషధాలకు మాకు ఇండియానే ఆధారం
‘ఈనాడు’ ప్రత్యేక ఇంటర్వ్యూలో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి
ఐ.ఆర్.శ్రీనివాసరావు
ఈనాడు - హైదరాబాద్
భారత్-అమెరికా దేశాల ఉమ్మడి భాగస్వామ్యం యావత్ ప్రపంచానికి లాభదాయకమని భారతదేశంలోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. భారతదేశం ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవిస్తోందని, అమెరికా దాన్ని స్వాగతిస్తోందని చెప్పారు. రెండు దేశాల సంబంధాలు గడిచిన ఏడాదిలో చరిత్రాత్మక స్థాయికి చేరాయని వివరించారు. ఉభయ దేశాల మధ్య వాణిజ్యం 190 బిలియన్ డాలర్లకు చేరిందని, జనరిక్ ఔషధాల విషయంలో అమెరికా భారత్పైనే ఆధారపడుతోందని తెలిపారు. ఇరు దేశాల సంబంధాలు రానున్న రోజుల్లో మరింత విస్తరిస్తాయని, శిలాజ రహిత ఇంధన(నాన్ ఫాసిల్ ఫ్యూయల్) రంగంలో 2030 నాటికి భారత్ 500 గిగావాట్ల స్థాయికి చేరుతుందని అన్నారు. రాయబారిగా ఆయన ఇటీవల ఏడాది పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
భారత్లో మీరు రెండు దేశాల సంబంధ బాంధవ్యాలను మరింత పటిష్ఠపరచడంలో మీ ప్రాధాన్యాంశాలు ఏమిటి ?
భారత్-అమెరికా సంబంధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావవంతమైనవి. భారత్ ఓ ప్రపంచ శక్తిగా ఆవిర్భవించడాన్ని మేం స్వాగతిస్తాం. ఇరు దేశాల సంపద పెంపు, ప్రజారక్షణ, పర్యావరణంలో మార్పులు తదితర అంశాలపై కలిసి పని చేయడమన్నది ప్రస్తుత ప్రాధాన్యాంశం. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడం నాకు బాగా సంతృప్తి ఇస్తోంది. ఇద్దరు స్నేహితుల మధ్య ప్రతి విషయంలోనూ పూర్తి ఏకాభిప్రాయం ఉండకపోవచ్చుగానీ... మన ఉమ్మడి కలలు, ప్రజల సంక్షేమం తదితరాల విషయంలో ఇరు దేశాలను ఒకే తాటిపై ఉంచగల అంశాలపై ఉభయులకూ పూర్తిస్థాయి అవగాహన ఉంది. సంయుక్తంగా పనిచేసినప్పుడు మాత్రమే ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ లాభదాయకమవుతుంది.
ఏడాది పూర్తి చేసుకున్నారు కదా.. మీ అనుభవం ఏం చెబుతోంది?
జవాబు: పూర్తి సంతృప్తితో ఉన్నా. అమెరికా-భారత్ సంబంధాల విషయంలో ఈ ఏడాది చరిత్రాత్మకమైనది. ఇరుదేశాల సంబంధ బాంధవ్యాలు పలు అంశాల్లో చాలా మెరుగ్గా కొనసాగుతున్నాయి. ఉదాహరణకు భారత ప్రధాని మోదీ వైట్హౌస్ సందర్శన, దిల్లీలో నిర్వహించిన జీ-20 సదస్సుకు అమెరికా నేతల రాక... ఇలాంటి ఎన్నో అంశాలు మంచి సంబంధాలకు తార్కాణాలు. ఇవన్నీ రానున్న రోజుల్లో మరింత మెరుగైన బంధాలకు పటిష్ఠ పునాదులవుతాయి. ఓ దౌత్యవేత్తగా నేనున్నప్పుడే ఇవన్నీ జరగడం సంతోషకరం. చేయాల్సినవి, జరగాల్సినవీ ఇంకెన్నో ఉన్నాయి.
అమెరికా-భారత్ మధ్య వినూత్న పరిశోధనలు, కాలుష్యరహిత ఇంధనం (క్లీన్ ఎనర్జీ), ఆరోగ్య సంరక్షణ వంటి కీలక విషయాల్లో ద్వైపాక్షిక సహకారం ఎలా ఉంది ?
జ: ఇరు దేశాల మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. క్లీన్ ఎనర్జీ సాంకేతికత అంటే సోలార్ ప్యానెళ్లు, విద్యుత్ బ్యాటరీల రంగంలో 2030 నాటికల్లా భారత్ 500 గిగావాట్ల ఉత్పాదనకు చేరువయ్యేలా చూడాలన్నది మా సంకల్పం. వ్యాక్సిన్ల విషయానికి వస్తే ఇప్పటికే భారత్ నుంచి అనేక దేశాలకు టీకాలు సరఫరా అవుతున్నాయి. ఈ రంగంలో భారత్ కంపెనీలతో మా దేశ కంపెనీల భాగస్వామ్యం కొనసాగుతోంది. మరిన్ని రంగాల్లో సహకారానికి అవకాశముందని యూఎస్-ఇండియా ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ వేదికగా ఇరు దేశాల నేతలు పేర్కొన్నారు. ఆ దిశగా సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. ఇలా చేయడం ప్రపంచం మొత్తానికి మంచి చేయూత అవుతుంది.
ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లోని సవాళ్ల నేపథ్యంలో... సముద్ర జలాలు, తీరప్రాంత రక్షణ, ఉగ్రవాదానికి విరుగుడైన కౌంటర్ టెర్రరిజం తదితర అంశాల్లో భారత్ పోషిస్తున్న భూమికను మీరెలా చూస్తున్నారు ?
జ: భారత్-అమెరికాలు రెండూ ఉగ్రవాద బాధిత దేశాలే. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద నిర్మూలనకు ఈ ఇరు దేశాల కృషి అనివార్యం. కౌంటర్ టెర్రరిజం, సముద్ర జలాలు, సరిహద్దులను సంరక్షించుకోవడం తదితర అంశాలన్నింటిలోనూ అమెరికా నుంచి భారత్కు తగిన మద్దతు ఉంటుంది. భద్రత, క్లీన్ ఎనర్జీ, అంతరిక్ష పరిశోధనలు వంటి వాటిపై ఇరు దేశాలకు చెందిన ఇద్దరిద్దరు(2+2) ప్రతినిధి బృందాలతో ప్రతినిత్యం చర్చలు కొనసాగుతున్నాయి. ఇండో-పసిఫిక్ రీజియన్; క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్; ఇండియా-యూఎస్ యాక్సలరేషన్ ఇకో సిస్టం వంటి వేదికలపైనా భారత రక్షణ, పారిశ్రామిక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.
పర్యావరణ మార్పులు, ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో స్వేచ్ఛా వాణిజ్యం సహా పలు అంశాల్లో ఉభయ దేశాల మధ్య సహాయ సహకారాలను మీరెలా చూస్తున్నారు ?
జ: ఇండో-పసిఫిక్ ప్రాంతాల్లో స్వేచ్ఛా వాణిజ్యంపై అమెరికా-భారత్ దేశాలది ఒకే దృక్పథం. సెమీ కండక్టర్ల సాంకేతికత ఇచ్చిపుచ్చుకోవడం, అత్యాధునిక రక్షణ ఉపకరణాల తయారీ, సరఫరా వ్యవస్థల రూపకల్పనల్లో సంయుక్త భాగస్వామ్యం వంటివి ఈ కోవలోనివే. భారతీయ వ్యోమగాములకు నాసా ద్వారా శిక్షణ, వ్యవసాయం, ఇంధన వనరులు, ఆరోగ్యం, సాంకేతికత వంటి అంశాలపై పరిశోధనల్లో ఇరు దేశాల విశ్వవిద్యాలయాల మధ్య భాగస్వామ్యం... ఇలా చాలా అంశాలున్నాయి. ఉభయ దేశాలతో పాటు క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్లో భాగమైన జపాన్, ఆస్ట్రేలియాలూ సంయుక్తంగా పనిచేస్తే... వ్యాక్సిన్ల తయారీ మొదలుకొని వాతావరణ, పర్యావరణ సంరక్షణలో భాగస్వామ్యం, సాంకేతికత అభివృద్ధిలో మరింత ఊతం లభించి ఇంకా పురోగతి సాధించవచ్చు. అందుకు అవసరమైన కార్య క్షేత్రాన్ని ఇప్పటికే సిద్ధం చేశాం. ఇవి సమస్త మానవాళి పురోగతికీ ఉపయుక్తమైన అంశాలు.
అంతర్జాతీయంగా సప్లై-చైన్ మేనేజ్మెంట్లో భారత్ పాత్రను ఎలా చూస్తున్నారు?
జ: ఒక దేశం నుంచి మరో దేశానికి ఇచ్చిపుచ్చుకోవడాల్లో తేడాలొచ్చినప్పుడు పరిస్థితులు ఎంతో సంక్లిష్టంగా మారి, ఎలాంటి ఘర్షణలు ఉత్పన్నమవుతాయన్నది ఇటీవలే కరోనా మహమ్మారి ప్రపంచాన్ని బాధించినప్పుడు స్పష్టమైంది. ఎగుమతులు, దిగుమతులు కొనసాగుతున్నప్పుడే అన్ని దేశాలూ ప్రయోజనం పొందుతాయి. ఒక దౌత్యవేత్తగా... భారత్ తన దేశీయ మార్కెట్తోపాటు ప్రపంచ మార్కెట్కూ తన ఉత్పాదనల్ని సరఫరా చేయాలని ఆశిస్తాను. అమెరికా కొన్ని అవసరాల కోసం భారత్ వైపు చూస్తోంది. ఉదాహరణకు మాకు అవసరమైన జనరిక్ ఔషధాల్లో 40 శాతం ఉత్పాదన భారత్లోనే జరుగుతోంది. విద్యుత్ వాహనాలు, సోలార్ సెల్స్ లాంటి అంశాల్లోనూ ఇదే జరగాలన్నది మా అభిలాష. గతేడాది మా మధ్య పెండింగ్లో ఉన్న ఏడు వాణిజ్య సంఘర్షణలను డబ్ల్యూటీవో వేదికగా పరిష్కరించుకున్నాం. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత వేగంగా పురోగమిస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో అమెరికాదీ అదే వేగం. ఇరు దేశాల మధ్య మంచి సౌహార్ద సంబంధాలకు అవకాశముంది. కొన్ని కీలక విషయాల్లో రెండింటి మధ్య సారూప్యత, సమన్వయం ఉన్నాయి. అందుకే మా కంపెనీలు ఇక్కడ దృష్టి పెడుతున్నాయి.
అమెరికా వీసాల జారీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వీసాల జారీలో జాప్యమవుతోంది
జ: తొలిసారి జారీ చేసే బీ1/బీ2 వీసాలు మినహా మిగతా అన్ని వీసాల జారీలోనూ జాప్యాన్ని దాదాపుగా నివారించగలిగాం. బీ1/బీ2ల జారీలోనూ జాప్యాన్ని కనీసం 75 శాతానికిపైగా కుదించగలిగాం. వారాంతాల్లోనూ మా ఉద్యోగులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. భారత్లో వీసాలకు డిమాండ్ ఇంకా ఎక్కువగానే ఉంటోంది. తగినంత మంది ఉద్యోగుల నియామకం ఓ సవాలుగా ఉంది. అయినా మరిన్ని ఎక్కువ వీసాల జారీకి కృషి చేస్తాం.
ఇటీవల హైదరాబాద్ వచ్చిన సందర్భంగా చార్మినార్ వద్ద ఎరిక్ గార్సెట్టి
మరింత మెరుగైన ద్వైపాక్షిక సంబంధాల విషయంలో మీ అభిప్రాయం ఏమిటి
జ: వివిధ అంశాలను ఉభయ దేశాలు సంయుక్త కృషితో సాధిస్తే ప్రయోజనాలు బహుముఖంగా ఉంటాయి. అవి ఏమిటనే విషయంలో ఇరుపక్షాలకూ స్పష్టమైన అవగాహన ఉంది. వాటిని సాధించాలన్న కోరిక కూడా బలంగా ఉంది. ఉభయ దేశాల మధ్య బంధంతో ఒనగూరే ప్రయోజనాలు అమెరికా ప్లస్ ఇండియా అన్నట్టుగా కాదు... బహుముఖంగా ఉంటాయి. ఇలా ఉమ్మడిగా కృషి చేస్తే ఇరు దేశాలకే కాదు.. ప్రపంచానికే లాభసాటిగా పరిణమిస్తుందన్నది నా ప్రగాఢ విశ్వాసం.
అమెరికా, భారత్ల మధ్య సంబంధాలు మునుపటి కన్నా బాగా విస్తృతం అయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ఆకాశమే హద్దు అన్నంతగా విరాజిల్లుతున్నాయి.
అమెరికా కంపెనీలు భారత్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునే విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఇంతటి విశాలమైన, వైవిధ్యమైన దేశంలో అవకాశాలకు కొదవలేకపోగా అవెంతోఆకర్షణీయంగా కూడా ఉన్నాయి.
- ఎరిక్ గార్సెట్టి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ దుయ్యబట్టారు. ఉగ్రవాదాన్ని అణచివేసి శత్రువులకు దీటైన బదులిస్తామని హెచ్చరించారు. -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
PM Modi: కార్గిల్ యుద్ధంలో అమరులైన భారత జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఘన నివాళులర్పించారు. లద్దాఖ్లోని యుద్ధ స్మారకాన్ని ఆయన సందర్శించారు. -
కావడి యాత్ర శాంతియుతంగా సాగాలనే..: యూపీ ప్రభుత్వం
Kanwar Yatra: కన్వల్ యాత్రపై జారీ చేసిన ఉత్తర్వులను తాజాగా యూపీ ప్రభుత్వం సమర్థించుకుంది. యాత్ర శాంతియుతంగా సాగాలన్నదే తమ ఉద్దేశమని సుప్రీంకోర్టుకు తెలియజేసింది. -
సీయూఈటీ-యూజీ తుది ‘కీ’ విడుదల
యూజీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024 తుది ‘కీ’ని ఎన్టీఏ గురువారం విడుదల చేసింది. -
ప్రముఖ ఆర్థికవేత్త సి.టి.కురియన్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ఆచార్యులు సి.టి.కురియన్(93) మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైలో కన్నుమూశారు. -
గనులు, ఖనిజ భూములపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలదే
ఖనిజ భూములు, గనులపై లీజుదారుడు చెల్లించే రాయల్టీని పన్నుగా పరిగణించకూడదని సుప్రీంకోర్టు రాజ్యాంగధర్మాసనం కీలక తీర్పునిచ్చింది. 35 ఏళ్లుగా ఈ అంశంపై కేంద్రానికి, రాష్ట్రాలకు మధ్య రగులుతున్న వివాదానికి గురువారం ముగింపు పలికింది. -
పని చేస్తేనే మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వేచ్ఛ
మహిళలు తండ్రి మీదో, భర్త మీదో ఆధారపడకుండా స్వయంగా డబ్బు సంపాదించినప్పుడు కలిగే ఆత్మవిశ్వాసం, దాని ద్వారా వచ్చే ఆర్థిక స్వేచ్ఛ ముందు ఏదీ సాటి రాదు. వారికి ఇంట్లో గౌరవం కూడా పెరుగుతుంది. -
మమత వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ అభ్యంతరం
నిస్సహాయ స్థితిలో తమ రాష్ట్రానికి వచ్చే బంగ్లాదేశీలకు ఆశ్రయం కల్పిస్తామంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. -
టీచర్గా మారిన రాష్ట్రపతి
దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము గురువారం దిల్లీలోని విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. వారి అభిరుచులు, లక్ష్యాలను తెలుసుకున్నారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆమె ఉపాధ్యాయురాలిగా మారారు. -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. -
92 వేల అంగన్వాడీల ఉన్నతికి కేంద్ర ప్రభుత్వం అనుమతి
చిన్నారుల విద్య, పోషకాహార నాణ్యతను మెరుగుపరిచే లక్ష్యంతో 92,108 అంగన్వాడీలను ఉన్నతీకరించి సక్షమ్ అంగన్వాడీలుగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. -
నేడు కార్గిల్ 25వ విజయ్ దివస్
కార్గిల్ 25వ విజయ్ దివస్ శుక్రవారం జరగనుంది. ఈ నేపథ్యంలో కార్గిల్లోని యుద్ధ వీరుల స్మారకాన్ని ప్రధాని మోదీ సందర్శించి నివాళులర్పించనున్నారు. -
గూగుల్ మ్యాప్స్లో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. -
ఇద్దరు ఝార్ఖండ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఝార్ఖండ్ శాసనసభ స్పీకర్ ట్రైబ్యునల్ గురువారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. -
సంక్షిప్త వార్తలు (7)
తిహాడ్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించడంపై ‘ఇండియా’ కూటమి ఆందోళన వ్యక్తం చేసింది. -
మహారాష్ట్ర, హిమాచల్లలో కుంభవృష్టి
హిమాచల్, మహారాష్ట్రల్లో కుండపోత వర్షాలు కురిసి జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ముంబయిలో 9 గంటల వ్యవధిలో 100 మి.మీ. పైగా వాన దంచికొట్టింది. -
ముమ్మాటికీ వివక్షేనన్న విపక్షం
కేంద్ర బడ్జెట్లో ఒకటిరెండు రాష్ట్రాలకు తప్పిస్తే మిగిలినవాటికి అన్యాయం జరిగిందని విపక్ష సభ్యులు మరోసారి గట్టిగా గళం వినిపించడంతో గురువారం పార్లమెంటు ఉభయసభలు దాదాపు స్తంభించిపోయాయి. -
ట్రంకు పెట్టెల బదులు ట్రాలీ బ్యాగులు
లోకోపైలట్లు, గార్డులు ఇకపై తమ వ్యక్తిగత వస్తువుల్ని, విధి నిర్వహణకు అవసరమైన సామగ్రిని ఇనుప ట్రంకు పెట్టెల్లో కాకుండా ట్రాలీ బ్యాగుల్లో తీసుకువెళ్లాల్సి ఉంటుంది. -
ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0
జమ్ముకశ్మీర్లో ఉగ్ర చర్యలకు పాల్పడుతున్న 55 మంది ఉగ్రవాదులను హతమార్చడమే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ ‘ఆపరేషన్ సర్ప్ వినాశ్ 2.0’ను ప్రారంభించింది. -
భారీ వర్షాలు.. ముంబయిలో రెడ్ అలర్ట్
మహారాష్ట్రలోని ముంబయిలోనూ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!
-
2034 నాటికి అలాంటి ఉద్యోగాలు ఉండవ్.. లింక్డిన్ వ్యవస్థాపకుడి అంచనా!
-
మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం.. కార్గిల్ నుంచి పాక్కు మోదీ హెచ్చరిక
-
వైకాపా హయాంలో ప్రకటనల కుంభకోణం.. హౌస్ కమిటీ వేయాలని తెదేపా ఎమ్మెల్యేల డిమాండ్
-
విజయ్ సేతుపతి మూవీపై కత్రినాకైఫ్ రివ్యూ
-
సోషల్ మీడియా వీడియోల పిచ్చి ముదిరి.. రైలును పట్టాలు తప్పించి..!