Atiq Ahmed: అతీక్ హత్య కోసం.. రిపోర్టింగ్ ట్రైనింగ్!
రాజకీయ నేతగా ఎదిగిన ఉత్తర్ప్రదేశ్ గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ అహ్మద్లపై కాల్పులు జరిపేందుకు ముందు రోజు ప్రధాన నిందితుడు తివారీ రిపోర్టింగ్ శిక్షణ తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
లఖ్నవూ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్లు అతీక్ అహ్మద్, అతడి సోదరుడు అష్రాఫ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్య చేసే సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ప్రధాన నిందితుడు లవ్లేశ్ తివారీ రిపోర్టింగ్ కోసం స్వల్పకాలం పాటు శిక్షణ కూడా తీసుకున్నాడట. ఈ మేరకు అతడికి శిక్షణ ఇచ్చిన ముగ్గురిని కూడా ఉత్తర్ప్రదేశ్ పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. ఓ స్థానిక ఛానెల్కు పని చేస్తున్న ఈ ముగ్గురు వ్యక్తులు తివారీకి ట్రైనింగ్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు పరారీలో ఉన్న అతీక్ అహ్మద్ భార్య షాహిస్తా పర్వీన్ కోసం కౌశాంబిలో పోలీసులు విస్త్రృతంగా గాలిస్తున్నారు.
అతీక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ సోదరులను శనివారం రాత్రి వైద్యపరీక్షల కోసం తరలిస్తుండగా.. హంతకులు వారిద్దరిపై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. మీడియా ప్రతినిధులు వారిని అనుసరిస్తూ ప్రశ్నలడుగుతున్న సమయంలోనే జర్నలిస్టుల్లా వచ్చిన ముగ్గురు వారిపై తుపాకులతో అతి దగ్గరి నుంచి కాల్పులు జరిపారు. మొదట అతీక్ తలపై ఒక వ్యక్తి కాల్పులు జరపగా.. ఆ తర్వాత అష్రాఫ్పై కాల్పులు కొనసాగాయి. అయితే, ఈ కాల్పులకు తెగబడిన లవ్లేశ్ తివారీతోపాటు అరుణ్ మౌర్య, సన్నీ సింగ్లు కూడా జర్నలిస్టుల్లా వ్యవహరించేందుకు హత్యకు ముందు రోజు శిక్షణ తీసుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!