పార్కింగ్ వివాదం.. హోటల్ యజమానిపై చేయిచేసుకున్న నటుడు
పార్కింగ్ విషయంలో చోటుచేసుకున్న వివాదం తీవ్రరూపం దాల్చి.. ఘర్షణకు దారితీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
కోల్కతా: బెంగాలీ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోహమ్ చక్రవర్తి (Soham Chakraborty) కోల్కతాలోని ఒక రెస్టారంట్ యజమానిపై చేయిచేసుకున్నారు. పార్కింగ్ విషయంలో జరిగిన వాగ్వాదమే ఈ ఘటనకు దారితీసింది. దీనిపై ఇరువర్గాలు భిన్నమైన వాదన వినిపించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం..
కోల్కతాలోని న్యూటౌన్ ప్రాంతంలోని తన రెస్టారంట్ పైభాగాన్ని షూటింగ్ నిమిత్తం సోహమ్కు ఇచ్చినట్లు యజమాని ఆలం తెలిపారు. ‘‘నా రెస్టారంట్పైన స్థలాన్ని షూటింగ్ నిమిత్తం ఆయనకు ఇచ్చాను. అందుకోసం నేను డబ్బు వసూలు చేయలేదు. ఆయన భద్రతా సిబ్బంది మా వినియోగదారులకు కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో వాహనాలను పార్క్ చేశారు. వాటిని అక్కడ పార్క్ చేయొద్దని మా సిబ్బంది చెప్పారు. సోహమ్ ఒక ఎమ్మెల్యే అని, అభిషేక్ బెనర్జీకి సన్నిహితుడని వారు చెప్పారు. ఆయన ఎవరైనా నాకు సంబంధం లేదని నేను బదులిచ్చాను. ఆ వెంటనే సోహమ్ వచ్చి, నా ముఖంపై కొట్టాడు..తన్నాడు’’ అని ఆలం ఆరోపించారు.
హోటల్ యజమానిని కొట్టినట్లు తృణమూల్ ఎమ్మెల్యే అంగీకరించాడు. ‘‘పెద్దగా కేకలు వినిపించడంతో నేను వెంటనే కిందికి వచ్చాను. ఆ యజమాని నా సిబ్బందిని తిట్టడం కనిపించింది. అభిషేక్ బెనర్జీని కూడా నిందించాడు. దాంతో సహనం కోల్పోయిన నేను చెంపదెబ్బ కొట్టాను’’ అని సోహమ్ వెల్లడించారు. వారిద్దరి మధ్య వాగ్వాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని హోటల్ మేనేజర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం
నీతి ఆయోగ్ 9వ పాలకమండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉదయం ఇక్కడి రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగనుంది. భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్ 2047’ అజెండాపై ఇందులో చర్చించనున్నారు. -
టూరిస్టులు.. చెత్త సంచి వెంటతెచ్చుకోవాలి!
రాష్ట్రానికి వచ్చే పర్యటకులు తమ వెంట చెత్త సంచి లేదా చెత్త డబ్బాను తెచ్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?